Shubman Gill Fined: మ్యాచ్ గెలిచినా గుజరాత్కు షాక్.. గిల్కు భారీ జరిమానా..!
- ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్కు గెలుపు, కానీ కెప్టెన్ గిల్కు షాక్
- స్లో ఓవర్రేట్ కారణంగా శుభమాన్ గిల్కు రూ.12 లక్షల జరిమానా
- బీసీసీఐ ఆర్టికల్ 2.22 ప్రకారం చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill Fined: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్కు గెలుపు దక్కినా, కెప్టెన్ శుభమాన్ గిల్ కు పెద్ద షాక్ తగిలింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా బీసీసీఐ గిల్పై జరిమానా విధించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 210/4 భారీ స్కోర్ నమోదు చేసింది. గిల్ 70 పరుగులతో జట్టును ముందుండి నడిపించాడు. అతనికి తోడుగా వాషింగ్టన్ సుందర్ 55, జొస్ బట్లర్ 52 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఢిల్లీ బౌలింగ్లో రషీద్ ఖాన్ 3/17తో రాణించగా, ప్రసిద్ కృష్ణ 2 వికెట్లు తీశాడు.
Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!
Also Read
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
- TMC: సొంత డబ్బులతో విమానం కొని, దానికే అద్దె చెల్లించారు.. తృణమూల్ స్కాంతో ఈడీ షాక్..
- Greece: గ్రీస్లో ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా దగ్ధమైన యుద్ధ విమానం
- TMC Crisis: మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలోకి మాజీ టీఎంసీ ఎంపీలు..
చేజింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున KL రాహుల్ 92 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా డేవిడ్ మిల్లర్ 41* తో మ్యాచ్ ను చివరి వరకు తీసుకెళ్లినా, కీలక సమయంలో తీసుకున్న నిర్ణయం మ్యాచ్ను మలుపు తిప్పింది. చివరి రెండు బంతులకు రెండు పరుగులు అవసరమైన సమయంలో మిల్లర్ సింగిల్ తీసుకోకపోవడం, చివరి బంతికి కుల్దీప్ యాదవ్ రన్ అవుట్ కావడంతో ఢిల్లీ 209/8కే పరిమితమైంది.
Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్వాచ్ లాంచ్..!
ఇక మ్యాచ్ తర్వాత గుజరాత్ టైటాన్స్ స్లో ఓవర్రేట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఐపీఎల్ కమిటీ గుర్తించింది. దీంతో ఆర్టికల్ 2.22 ప్రకారం గిల్కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో ఇది అతని మొదటి తప్పిదం కావడంతో కేవలం జరిమానాతోనే సరిపెట్టారు. ఈ సంఘటనతో గిల్ శిక్షలు ఎదుర్కొన్న కెప్టెన్ల జాబితాలో చేరాడు. ప్రస్తుతం ఐపీఎల్లో సస్పెన్షన్ లకు బదులుగా జరిమానాలు, డీమరిట్ పాయింట్లు విధించే విధానం అమల్లో ఉంది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో మూడు మ్యాచ్ల్లో రెండు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్ల్లో నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
తాజావార్తలు
-
El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
-
TMC: సొంత డబ్బులతో విమానం కొని, దానికే అద్దె చెల్లించారు.. తృణమూల్ స్కాంతో ఈడీ షాక్..
-
Viral Video : “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా”.. మనవడితో సీఎం రేవంత్ రెడ్డి మధుర క్షణాలు
-
Greece: గ్రీస్లో ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా దగ్ధమైన యుద్ధ విమానం
-
Jana Nayagan: ఎట్టకేలకు పూర్తయిన జన నాయగన్ సెన్సార్.. ఆరోజు రిలీజ్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!