Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..
- ఏసు క్రీస్తు ‘‘ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్’’లో భారతీయ మూలాలు..
- క్రీస్తు మరణానంతరం కప్పిన వస్త్రంపై రీసెర్చ్..
- ఈ వస్త్రంలో భారతీయ డీఎన్ఏ..
- సింధూ లోయ నుంచి వచ్చినట్లు అభిప్రాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shroud Of Turin: ఏసు క్రీస్తుకు సంబంధించిన ‘‘ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్’’ మూలాలు భారతదేశంలో ఉన్నాయా?, ఏసు క్రీస్తుకు శిలువ వేసిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఆయన శరీరంపై కప్పడానికి ఉపయోగించిన వస్త్రాన్ని ‘‘ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్’’గా వ్యవహరిస్తుంటారు. ఈ లెనిన్ వస్త్రం గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక డీఎన్ఏ అధ్యయనంలో షాకింగ్ విషయాలు తెలిశాయి.
పడోవా విశ్వవిద్యాలయానికి చెందిన జియానీ బార్కాసియా నేతృత్వంలోని పరిశోధకులు, 1978లో ‘ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్’ నుండి సేకరించిన నమూనాలను అధునాతన DNA సీక్వెన్సింగ్ పద్ధతులను ఉపయోగించి తిరిగి పరీక్షించారు. ఈ రీసెర్చ్లో వస్త్రంపై మొక్కలు, జంతువులు, భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులకు సంబంధించిన డీఎన్ఏ ఆనవాళ్లు ఉన్నట్లుగా గుర్తించారు. పరిశోధకుల ప్రకారం, ఈ వస్త్రంలో కనిపించిన డీఎన్ఏలో సుమారు 40 శాతం భారతీయ వంశాలకు చెందినదిగా గుర్తించారు. దీని ఆధారంగా ఈ వస్త్రం భారత్లోని సింధూ లోయ ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. రోమన్లు ఈ వస్త్రాన్ని భారత్ నుంచి తీసుకువచ్చి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read
- Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
- FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై 'దక్షిణ కొరియా' సంచలన విజయం.!
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
Read Also: Good Friday: ఏసుక్రీస్తుకు శిలువ వేసిన రోజు.. గుడ్ ఫ్రైడే ఎందుకు ‘‘గుడ్’’..
1354లో ఫ్రాన్స్లో మొదటిసారిగా ఈ వస్త్రం గురించిన వివరాలను నమోదు చేశారు. ఇది 14.44 అడుగుల పొడవు, 3.61 అడుగుల వెడల్పు ఉంది. దీనికి సంబంధించిన రహస్యాలు ఇప్పటికీ పరిశోధకులకు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఇటలీలోని ట్యూరిన్ లో ఉన్న సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ కేథడ్రల్లో భద్రపరిచిన ఈ వస్త్రం, భారత్ నుంచి వచ్చి ఉండొచ్చని చెబుతున్నారు.
ఈ వస్త్రం శతాబ్ధాలుగా అనేక విభిన్న ప్రాంతాల్లో తిరిగిన కారణంగా దీనిపై పిల్లులు, కుక్కలు, జింకలు, కుందేళ్లు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు, గుర్రాలతో సహా అనేక జంతువుల డీఎన్ఏను గుర్తించారు. క్యారెట్లు, మిరపకాయలు, గోధుమల వంటి మొక్కల డీఏన్ఏ కూడా ఉంది. క్యూటిబాక్టీరియం, స్టెఫిలోకాకస్తో సహా మానవ చర్మ బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణాల వల్ల ఈ వస్త్రానికి చెందిన ప్రాథమిక డీఎన్ఏను ఖచ్చితంగా గుర్తించడం కష్టమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
-
Jailer 2 : జైలర్ 2లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ స్పెషల్ క్యామియో
-
Vaibhav Sooryavanshi: అర్ధరాత్రి 2 గంటలకు గదిలో లేని వైభవ్.. టెన్షన్ పడిపోయిన బుడ్డోడి తల్లి!
-
FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై ‘దక్షిణ కొరియా’ సంచలన విజయం.!
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!