Good Friday: ఏసుక్రీస్తుకు శిలువ వేసిన రోజు.. గుడ్ ఫ్రైడే ఎందుకు ‘‘గుడ్’’..
- ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే..
- క్రైస్తవులకు ఎంతో ప్రత్యేకమైన రోజు..
- క్రీస్తుకు శిలువ వేసిన రోజును ఎందుకు ‘‘గుడ్ ఫ్రైడే’’గా పిలుస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good Friday: క్రైస్తవులకు ఎంతో శుభకరమైన రోజు ‘‘గుడ్ ఫ్రైడే’’ ఈ ఏడాది ఏప్రిల్ 3న వస్తోంది. క్రైస్తవులు దీనిని ఒక ప్రత్యేకమైన, శోకదినంగా పాటిస్తారు. ఇదే రోజున ఏసు క్రీస్తుకు శిలువ వేసినట్లు నమ్ముతారు. ఈ రోజున క్రైస్తవులు చర్చ్లకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. చాలా మంది ఉపవాసం పాటిస్తారు. కొందరు మౌనంగా ఉంటూ తమ భక్తిని ప్రదర్శిస్తారు. అయితే, ఏసు క్రీస్తును హింసించి, శిలువ వేసిన ఈ రోజును ‘‘గుడ్ ఫ్రైడే’’గా ఎందుకు జరుపుకుంటారు. ఒక విషాద దినాన్ని ఎందుకు ‘‘గుడ్’’గా పేర్కొంటారనే సందేహం వస్తుంది.
అనేక కారణాలు:
Also Read
- Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
- Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
- Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
గుడ్ ఫ్రైడేకు అనేక కారణాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారం.. మనిషి చనిపోయిన రోజు పుట్టిన రోజు కన్నా పవిత్రమైందిగా భావించబడతుంది. ఈ రోజు ఏసు క్రీస్తు త్యాగం చేసిన పవిత్రమైనన రోజుగా భావిస్తారు, అందుకే దీనిని ‘‘గుడ్’’గా వ్యవహరిస్తారు. గుడ్ అనే పదానికి పూర్వకాలం ‘‘పవిత్రమైన’’ అనే అర్థం కూడా ఉండేది. అందుకే దీనిని ‘‘హోలీ ఫ్రైడే’’ అని కూడా పిలిచేవారు. కొన్ని ప్రాంతాల్లో దీనిని ‘‘బ్లాక్ ఫ్రైడే’’ లేదా ‘‘గ్రేట్ ఫ్రైడే’’గా కూడా పిలుస్తారు.
ఏసుకు ఎందుకు శిలువ వేశారు:
సుమారు 2000 ఏళ్ల క్రితం, ఏసు క్రీస్తు ప్రజలకు అహింస, ప్రేమ, కరుణ, ఐక్యత, మానవత్వ వంటి విలువల్ని బోధించారు. ఆయన ఉపదేశాలకు ప్రజలు ఆకర్షితులై ఆయనను దేవుడిగా, దేవుడి కుమారుడిగా ఆరాధించడం మొదలుపెట్టారు. క్రమంగా ఏసుకు పెరుగుతున్న ఆదరణ చూసిన మత గురువులు ఆయనపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈ మతనాయకులంతా కుట్ర పన్ని, అప్పటి రోమన్ పాలకుడికి ఏసు గురించి లేనిపోని అబద్ధాలు చెప్పారు. క్రీస్తు తాను దేవుని కుమారుడనని చెప్పుకుంటున్నాడని, ఆయన మాటలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. దీంతో ఏసు క్రీస్తుపై దేశ ద్రోహం అభియోగాలు మోపి, వేలాది మంది ప్రజల సమక్షంలో ఆయన శరీరాన్ని శిలువ వేశారు. ఆయనకు ముళ్ల కిరీటాన్ని పెట్టి, కొరడాలతో కొడుతూ శిలువ వద్దకు తీసుకెళ్లి, ఆయన కాళ్లు చేతులకు మేకులు కొట్టి శిలువకు వేలాడదీశారు.
తాజావార్తలు
-
Durefishan Saleem: పాక్ నటి డేటింగ్ రూమర్స్.. యూట్యూబర్తో పెళ్లి వార్తలపై మేకప్ ఆర్టిస్ట్ షాకింగ్ రియాక్షన్
-
India – Pakistan: భారత్ – పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
-
Jana Nayagan : జననాయగన్ రిలీజ్కు అన్ని దారులు క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!