Shraddha Walkar: నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాకు ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు కోర్టులో స్వల్ప ఊరట లభించింది. రోజుకు ఎనిమిది గంటల పాటు ఏకాంత సెల్ నుంచి బయటికి రావడానికి అనుమతించాలని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీహార్ జైలు అధికారులకు ఆదేశించింది.
శ్రద్ధా వాకర్ ను చంపి.. ఆమె శరీరాన్ని అనేక ముక్కలుగా నరికి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆఫ్తాబ్ విసిరేశాడు. అయితే నేరం జరిగిన ఆరు నెలల తర్వాత ఈ కేసు వెలుగు చూసింది. ఆఫ్తాబ్ చేసిన అనాగరికతపై దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
Also Read
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
పూనావాలా దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సురేష్ కుమార్ కైట్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకాంత సెల్ నుంచి విడిచిపెట్టాలని ఆదేశాలను జారీ చేసింది. పూనావాలా తరపు న్యాయవాది వాదిస్తూ.. ఇతర ఖైదీలను రోజుకు ఎనిమిది గంటల పాటు బయట ఉండేలా అనుమతిస్తారు. కానీ పూనావాలాను ఇంతవరకు ఉదయం, సాయంత్రం గంటపాటే బయట ఉండేందుకు అనుమతించారు. ఇకపై ఇతర ఖైదీల మాదిరిగా 8 గంటల పాటు అతడిని అన్లాక్ చేసి, రాత్రిపూట ఒంటరిగా సెల్లో ఉంచాలని జస్టిస్ గిరీష్ కత్పాలియాతో కూడిన ధర్మాసనం జైలు అధికారులను ఆదేశించింది.
కాగా గతంలో పూనావాలాను రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి తీసుకెళ్తుండగా అతడిపై దాడి జరగడంతో తగిన భద్రత కల్పించాలని ట్రయల్ కోర్టు అప్పట్లో ఆదేశాలు జారీ చేసిందని, అందువల్లే నిందితుడిని, ఇతర ఖైదీలతో కలిపి ఉంచడం లేదని జైలు అధికారుల తరపున న్యాయవాది తెలిపారు.
2022, మే18న ఢిల్లీలోని మెహ్రౌలీలో తన ప్రియురాలు శ్రద్ధా వాకర్ను గొంతు కోసి, ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి చంపినట్లు పూనావాలాపై ఆరోపణలు వచ్చాయి. శరీర భాగాలను రిఫ్రిజిరేటర్లో ఉంచి అడవిలో వాటిని పారవేసినట్లుగా పోలీసులు తెలిపారు. 2023 జనవరి 24న ఢిల్లీ పోలీసులు ఈ కేసులో 6,629 పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేశారు. అనంతరం ట్రయల్ కోర్టు పూనావాలాపై హత్య, సాక్ష్యాధారాల అదృశ్యం ఆరోపణలను నమోదు చేసింది.
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!