Shraddha Walkar: నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాకు ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు కోర్టులో స్వల్ప ఊరట లభించింది. రోజుకు ఎనిమిది గంటల పాటు ఏకాంత సెల్ నుంచి బయటికి రావడానికి అనుమతించాలని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీహార్ జైలు అధికారులకు ఆదేశించింది.
శ్రద్ధా వాకర్ ను చంపి.. ఆమె శరీరాన్ని అనేక ముక్కలుగా నరికి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆఫ్తాబ్ విసిరేశాడు. అయితే నేరం జరిగిన ఆరు నెలల తర్వాత ఈ కేసు వెలుగు చూసింది. ఆఫ్తాబ్ చేసిన అనాగరికతపై దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
పూనావాలా దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సురేష్ కుమార్ కైట్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకాంత సెల్ నుంచి విడిచిపెట్టాలని ఆదేశాలను జారీ చేసింది. పూనావాలా తరపు న్యాయవాది వాదిస్తూ.. ఇతర ఖైదీలను రోజుకు ఎనిమిది గంటల పాటు బయట ఉండేలా అనుమతిస్తారు. కానీ పూనావాలాను ఇంతవరకు ఉదయం, సాయంత్రం గంటపాటే బయట ఉండేందుకు అనుమతించారు. ఇకపై ఇతర ఖైదీల మాదిరిగా 8 గంటల పాటు అతడిని అన్లాక్ చేసి, రాత్రిపూట ఒంటరిగా సెల్లో ఉంచాలని జస్టిస్ గిరీష్ కత్పాలియాతో కూడిన ధర్మాసనం జైలు అధికారులను ఆదేశించింది.
కాగా గతంలో పూనావాలాను రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి తీసుకెళ్తుండగా అతడిపై దాడి జరగడంతో తగిన భద్రత కల్పించాలని ట్రయల్ కోర్టు అప్పట్లో ఆదేశాలు జారీ చేసిందని, అందువల్లే నిందితుడిని, ఇతర ఖైదీలతో కలిపి ఉంచడం లేదని జైలు అధికారుల తరపున న్యాయవాది తెలిపారు.
2022, మే18న ఢిల్లీలోని మెహ్రౌలీలో తన ప్రియురాలు శ్రద్ధా వాకర్ను గొంతు కోసి, ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి చంపినట్లు పూనావాలాపై ఆరోపణలు వచ్చాయి. శరీర భాగాలను రిఫ్రిజిరేటర్లో ఉంచి అడవిలో వాటిని పారవేసినట్లుగా పోలీసులు తెలిపారు. 2023 జనవరి 24న ఢిల్లీ పోలీసులు ఈ కేసులో 6,629 పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేశారు. అనంతరం ట్రయల్ కోర్టు పూనావాలాపై హత్య, సాక్ష్యాధారాల అదృశ్యం ఆరోపణలను నమోదు చేసింది.
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
-
NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..