Bhuvanagiri Student: విద్యార్థుల ఆత్మహత్య కేసు.. పోస్టుమార్టంలో ఒంటిపై గాయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuvanagiri Student: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య కలకలం రేపింది. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. అయితే.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఆరుగురు పైన కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. వార్డెన్ శైలజ.. ఆటో డ్రైవర్ ఆంజనేయులు.. వంట మనుషులు సుజాత, సులోచన ..పిఈటి ప్రతిభ.. ట్యూషన్ టీచర్ భువనేశ్వరి పై కేసు నమోదు చేశారు. వార్డెన్ తో పాటు ఆటో డ్రైవర్ని విచారిస్తున్నారు. పోస్టుమార్టం సందర్భంగా పిల్లల ఒంటిపై గాయాలు గుర్తించారు. దీంతో గాయాలకు సంబంధించిన ఫోటోలను కుటుంబ సభ్యులు బయటికి విడుదల చేశారు. పిల్లలపై ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉరివేసుకుని విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడితే మరి ఒంటిపై గాయాలు ఎలా వచ్చాయంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల కడుపు, చేతులు, మొడలపై పళ్ల ఘాట్లు వున్నట్లు పోస్టుమార్టంలో తేలిందని, ఇది తప్పకుండా యాజమన్యం సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.
Read also: Supreme Court: చండీగఢ్ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ
Also Read
- Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
- PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
- Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
అభం శుభం తెలియని పిల్లలకు అమానుషంగా ప్రవర్తించి చంపేశారని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లలపై ఇలాంటివి జరుగుతున్నా న్యాయం చేసేవారు కరువయ్యారంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పిల్లలపై ఇంత అమానుషంగా ప్రవర్తించి చావకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరోవైపు సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సూసైడ్ లెటర్ లో పలు అంశాలను విద్యార్థులు ప్రస్తావించిన విషయం తెలిసిందే.. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన బాలికలు భువనగిరిలోని రెడ్డివాడ బాలికల ఉన్నత పాఠశాలలో హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. హాస్టల్ గదిలోనే ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆ గదిలో నుంచి సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో పేర్కొన్న అంశాలను చదివి పోలీసులు ఆశ్చర్యపోయారు. ‘మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి.. మేం తప్పు చేయకపోయినా అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని మా శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకచోటే సమాధి చేయండి’ అని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
Paytm : పేటీఎం ఖేల్ ఖతం.. రూ.20500కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
తాజావార్తలు
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
-
PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!