Death Certificate: బతికుండగానే రోగికి మరణ ధృవీకరణ పత్రం ఇచ్చిన వైద్యులు
- మధ్యప్రదేశ్లోని జబల్పూర్ డివిజన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.
- రోగి చనిపోకపోయిన డెత్ సర్టిఫికెట్ మంజూరు.
- వైద్యులపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death Certificate: మధ్యప్రదేశ్లోని జబల్పూర్ డివిజన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి నుండి వెలుగులోకి వచ్చిన ఒక ఆశ్చర్యకరమైన ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. ఈ ఆస్పత్రిలో రోగి చనిపోయినట్లు డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. కాకపోతే, ఆ తర్వాత అతను జీవించి ఉన్నట్లు తేలడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం అర్థరాత్రి, జబల్పూర్లోని గ్వారిఘాట్కు చెందిన 66 ఏళ్ల ఇంద్రజిత్ శుక్లా అనే రోగి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత 7:30 గంటలకు వైద్యులు అతని మరణాన్ని ధృవీకరించి నివేదిక విడుదల చేశారు. అయితే, రోగి బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిని నిరూపించేందుకు వారు రోగి వీడియోను చూపించగా.. అందులో రోగి ఊపిరి పీలుస్తూ స్పష్టంగా కనిపించాడు.
Also Read: Dera Baba: బెయిల్పై జైలు నుంచి విడుదలైన డేరా బాబా..
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
మరణ పత్రాన్ని చూసిన రోగి కుమారుడు ఆయుష్మాన్ శుక్లా తన తండ్రి వద్దకు పరిగెత్తి వెళ్లి చూడగా అతను జీవించి ఉన్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా, వైద్యుల నిర్లక్ష్యం స్పష్టమైంది. తమ తప్పు తెలిసిన డాక్టర్లు రోగికి చికిత్స అందించడం మానేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ రోగికి చికిత్స చేయడానికి నిరాకరించారని, ప్రస్తుతం తమ తండ్రి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆయుష్మాన్ శుక్లా అన్నారు. రోగి పరిస్థితి మరింత విషమించకముందే తగిన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘోర ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేషెంట్ను ఆసుపత్రి నుంచి తీసుకెళ్లమని వైద్యులు సూచించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ సంఘటనపై న్యాయం కోసం కుటుంబ సభ్యులు కలెక్టర్ను సంప్రదించేందుకు సిద్ధమయ్యారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి కారణమైన ఈ ఘటనకు సంబంధించి, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. జబల్పూర్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన వైద్య రంగంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. వైద్యుల నిర్లక్ష్యం, అనైతిక చర్యల వల్ల రోగుల ప్రాణాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం గురించి చర్చ జరుగుతుంది.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!