Death Certificate: బతికుండగానే రోగికి మరణ ధృవీకరణ పత్రం ఇచ్చిన వైద్యులు
- మధ్యప్రదేశ్లోని జబల్పూర్ డివిజన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.
- రోగి చనిపోకపోయిన డెత్ సర్టిఫికెట్ మంజూరు.
- వైద్యులపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death Certificate: మధ్యప్రదేశ్లోని జబల్పూర్ డివిజన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి నుండి వెలుగులోకి వచ్చిన ఒక ఆశ్చర్యకరమైన ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. ఈ ఆస్పత్రిలో రోగి చనిపోయినట్లు డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. కాకపోతే, ఆ తర్వాత అతను జీవించి ఉన్నట్లు తేలడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం అర్థరాత్రి, జబల్పూర్లోని గ్వారిఘాట్కు చెందిన 66 ఏళ్ల ఇంద్రజిత్ శుక్లా అనే రోగి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత 7:30 గంటలకు వైద్యులు అతని మరణాన్ని ధృవీకరించి నివేదిక విడుదల చేశారు. అయితే, రోగి బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిని నిరూపించేందుకు వారు రోగి వీడియోను చూపించగా.. అందులో రోగి ఊపిరి పీలుస్తూ స్పష్టంగా కనిపించాడు.
Also Read: Dera Baba: బెయిల్పై జైలు నుంచి విడుదలైన డేరా బాబా..
Also Read
- BSNL Mobile: కాల్స్ చేసుకోవడానికి సిగ్నల్స్ అవసరమే లేదు.. అద్భుత ఫోన్ లాంచ్ చేసిన BSNL..
- Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? 'అతడిని బయటకు పంపండి' అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
మరణ పత్రాన్ని చూసిన రోగి కుమారుడు ఆయుష్మాన్ శుక్లా తన తండ్రి వద్దకు పరిగెత్తి వెళ్లి చూడగా అతను జీవించి ఉన్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా, వైద్యుల నిర్లక్ష్యం స్పష్టమైంది. తమ తప్పు తెలిసిన డాక్టర్లు రోగికి చికిత్స అందించడం మానేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ రోగికి చికిత్స చేయడానికి నిరాకరించారని, ప్రస్తుతం తమ తండ్రి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆయుష్మాన్ శుక్లా అన్నారు. రోగి పరిస్థితి మరింత విషమించకముందే తగిన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘోర ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేషెంట్ను ఆసుపత్రి నుంచి తీసుకెళ్లమని వైద్యులు సూచించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ సంఘటనపై న్యాయం కోసం కుటుంబ సభ్యులు కలెక్టర్ను సంప్రదించేందుకు సిద్ధమయ్యారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి కారణమైన ఈ ఘటనకు సంబంధించి, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. జబల్పూర్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన వైద్య రంగంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. వైద్యుల నిర్లక్ష్యం, అనైతిక చర్యల వల్ల రోగుల ప్రాణాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం గురించి చర్చ జరుగుతుంది.
తాజావార్తలు
-
BSNL Mobile: కాల్స్ చేసుకోవడానికి సిగ్నల్స్ అవసరమే లేదు.. అద్భుత ఫోన్ లాంచ్ చేసిన BSNL..
-
CM Revanth Reddy: యువతకు సీఎం సంచలన ఆఫర్.. క్రీడా విజేతలకు ఉద్యోగాల గ్యారెంటీ
-
Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? ‘అతడిని బయటకు పంపండి’ అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
-
US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
-
Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!