Death Certificate: బతికుండగానే రోగికి మరణ ధృవీకరణ పత్రం ఇచ్చిన వైద్యులు
- మధ్యప్రదేశ్లోని జబల్పూర్ డివిజన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.
- రోగి చనిపోకపోయిన డెత్ సర్టిఫికెట్ మంజూరు.
- వైద్యులపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death Certificate: మధ్యప్రదేశ్లోని జబల్పూర్ డివిజన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి నుండి వెలుగులోకి వచ్చిన ఒక ఆశ్చర్యకరమైన ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. ఈ ఆస్పత్రిలో రోగి చనిపోయినట్లు డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. కాకపోతే, ఆ తర్వాత అతను జీవించి ఉన్నట్లు తేలడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం అర్థరాత్రి, జబల్పూర్లోని గ్వారిఘాట్కు చెందిన 66 ఏళ్ల ఇంద్రజిత్ శుక్లా అనే రోగి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత 7:30 గంటలకు వైద్యులు అతని మరణాన్ని ధృవీకరించి నివేదిక విడుదల చేశారు. అయితే, రోగి బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిని నిరూపించేందుకు వారు రోగి వీడియోను చూపించగా.. అందులో రోగి ఊపిరి పీలుస్తూ స్పష్టంగా కనిపించాడు.
Also Read: Dera Baba: బెయిల్పై జైలు నుంచి విడుదలైన డేరా బాబా..
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
మరణ పత్రాన్ని చూసిన రోగి కుమారుడు ఆయుష్మాన్ శుక్లా తన తండ్రి వద్దకు పరిగెత్తి వెళ్లి చూడగా అతను జీవించి ఉన్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా, వైద్యుల నిర్లక్ష్యం స్పష్టమైంది. తమ తప్పు తెలిసిన డాక్టర్లు రోగికి చికిత్స అందించడం మానేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ రోగికి చికిత్స చేయడానికి నిరాకరించారని, ప్రస్తుతం తమ తండ్రి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆయుష్మాన్ శుక్లా అన్నారు. రోగి పరిస్థితి మరింత విషమించకముందే తగిన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘోర ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేషెంట్ను ఆసుపత్రి నుంచి తీసుకెళ్లమని వైద్యులు సూచించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ సంఘటనపై న్యాయం కోసం కుటుంబ సభ్యులు కలెక్టర్ను సంప్రదించేందుకు సిద్ధమయ్యారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి కారణమైన ఈ ఘటనకు సంబంధించి, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. జబల్పూర్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన వైద్య రంగంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. వైద్యుల నిర్లక్ష్యం, అనైతిక చర్యల వల్ల రోగుల ప్రాణాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం గురించి చర్చ జరుగుతుంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!