Death Certificate: బతికుండగానే రోగికి మరణ ధృవీకరణ పత్రం ఇచ్చిన వైద్యులు
- మధ్యప్రదేశ్లోని జబల్పూర్ డివిజన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.
- రోగి చనిపోకపోయిన డెత్ సర్టిఫికెట్ మంజూరు.
- వైద్యులపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death Certificate: మధ్యప్రదేశ్లోని జబల్పూర్ డివిజన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి నుండి వెలుగులోకి వచ్చిన ఒక ఆశ్చర్యకరమైన ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. ఈ ఆస్పత్రిలో రోగి చనిపోయినట్లు డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. కాకపోతే, ఆ తర్వాత అతను జీవించి ఉన్నట్లు తేలడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం అర్థరాత్రి, జబల్పూర్లోని గ్వారిఘాట్కు చెందిన 66 ఏళ్ల ఇంద్రజిత్ శుక్లా అనే రోగి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత 7:30 గంటలకు వైద్యులు అతని మరణాన్ని ధృవీకరించి నివేదిక విడుదల చేశారు. అయితే, రోగి బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిని నిరూపించేందుకు వారు రోగి వీడియోను చూపించగా.. అందులో రోగి ఊపిరి పీలుస్తూ స్పష్టంగా కనిపించాడు.
Also Read: Dera Baba: బెయిల్పై జైలు నుంచి విడుదలైన డేరా బాబా..
Also Read
మరణ పత్రాన్ని చూసిన రోగి కుమారుడు ఆయుష్మాన్ శుక్లా తన తండ్రి వద్దకు పరిగెత్తి వెళ్లి చూడగా అతను జీవించి ఉన్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా, వైద్యుల నిర్లక్ష్యం స్పష్టమైంది. తమ తప్పు తెలిసిన డాక్టర్లు రోగికి చికిత్స అందించడం మానేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ రోగికి చికిత్స చేయడానికి నిరాకరించారని, ప్రస్తుతం తమ తండ్రి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆయుష్మాన్ శుక్లా అన్నారు. రోగి పరిస్థితి మరింత విషమించకముందే తగిన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘోర ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేషెంట్ను ఆసుపత్రి నుంచి తీసుకెళ్లమని వైద్యులు సూచించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ సంఘటనపై న్యాయం కోసం కుటుంబ సభ్యులు కలెక్టర్ను సంప్రదించేందుకు సిద్ధమయ్యారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి కారణమైన ఈ ఘటనకు సంబంధించి, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. జబల్పూర్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన వైద్య రంగంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. వైద్యుల నిర్లక్ష్యం, అనైతిక చర్యల వల్ల రోగుల ప్రాణాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం గురించి చర్చ జరుగుతుంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!