Death Certificate: బతికుండగానే రోగికి మరణ ధృవీకరణ పత్రం ఇచ్చిన వైద్యులు
- మధ్యప్రదేశ్లోని జబల్పూర్ డివిజన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.
- రోగి చనిపోకపోయిన డెత్ సర్టిఫికెట్ మంజూరు.
- వైద్యులపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death Certificate: మధ్యప్రదేశ్లోని జబల్పూర్ డివిజన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి నుండి వెలుగులోకి వచ్చిన ఒక ఆశ్చర్యకరమైన ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. ఈ ఆస్పత్రిలో రోగి చనిపోయినట్లు డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. కాకపోతే, ఆ తర్వాత అతను జీవించి ఉన్నట్లు తేలడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం అర్థరాత్రి, జబల్పూర్లోని గ్వారిఘాట్కు చెందిన 66 ఏళ్ల ఇంద్రజిత్ శుక్లా అనే రోగి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత 7:30 గంటలకు వైద్యులు అతని మరణాన్ని ధృవీకరించి నివేదిక విడుదల చేశారు. అయితే, రోగి బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిని నిరూపించేందుకు వారు రోగి వీడియోను చూపించగా.. అందులో రోగి ఊపిరి పీలుస్తూ స్పష్టంగా కనిపించాడు.
Also Read: Dera Baba: బెయిల్పై జైలు నుంచి విడుదలైన డేరా బాబా..
Also Read
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
మరణ పత్రాన్ని చూసిన రోగి కుమారుడు ఆయుష్మాన్ శుక్లా తన తండ్రి వద్దకు పరిగెత్తి వెళ్లి చూడగా అతను జీవించి ఉన్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా, వైద్యుల నిర్లక్ష్యం స్పష్టమైంది. తమ తప్పు తెలిసిన డాక్టర్లు రోగికి చికిత్స అందించడం మానేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ రోగికి చికిత్స చేయడానికి నిరాకరించారని, ప్రస్తుతం తమ తండ్రి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆయుష్మాన్ శుక్లా అన్నారు. రోగి పరిస్థితి మరింత విషమించకముందే తగిన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘోర ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేషెంట్ను ఆసుపత్రి నుంచి తీసుకెళ్లమని వైద్యులు సూచించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ సంఘటనపై న్యాయం కోసం కుటుంబ సభ్యులు కలెక్టర్ను సంప్రదించేందుకు సిద్ధమయ్యారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి కారణమైన ఈ ఘటనకు సంబంధించి, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. జబల్పూర్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన వైద్య రంగంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. వైద్యుల నిర్లక్ష్యం, అనైతిక చర్యల వల్ల రోగుల ప్రాణాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం గురించి చర్చ జరుగుతుంది.
తాజావార్తలు
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
-
Mystery Crime Thriller OTT : కంటైనర్లో ఒంటరి మహిళ.. ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
-
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!