Shocking Incident: టికెట్ తీసుకోకపోవడమే తప్పు.. ఆపై టీటీఈపై దాడి చేసిన మహిళలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident: ఈ మధ్య కాలంలో రైలు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య ఎక్కవుతుంది. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి మరో సంఘటన హౌరా నుంచి రిషికేశ్ వెళ్లే డూన్ ఎక్స్ప్రెస్లో జరిగింది. టికెట్ తనిఖీకి వెళ్లిన టీటీఈకి దారుణ సంఘటన ఎదురైంది. ఇందుకు సంబంధించిన ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఉన్న చార్బాగ్ రైల్వే స్టేషన్లో స్లీపర్ బోగీ S-3లో అనధికారికంగా ప్రయాణిస్తున్న కొందరు మహిళలు సీటు ఖాళీ చేయమని అడిగిన టీటీఈపై దాడి చేశారు. ఈ ఘటనపై టీటీఈ చార్బాగ్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. రైల్వే యంత్రాంగం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపింది.
Siddu Jonnalagadda : ఆ హీరోనే నా ఫేవరెట్.. తెలుగు హీరోలకు షాక్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ఈ సంఘటన ఉత్తర రైల్వే లక్నో డివిజన్లోని చార్బాగ్ రైల్వే స్టేషన్లో జరిగింది. హౌరా నుండి రిషికేశ్ వెళ్లే రైలు నంబర్ 13009 డూన్ ఎక్స్ప్రెస్ గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చార్బాగ్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. లక్నో రాకముందే టీటీఈ దివాకర్ మిశ్రా రైలులోని స్లీపర్ బోగీ S-3లో టికెట్ తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తనిఖీ సమయంలో, ఒక ప్రయాణికుడు తమ సీటులో అనధికారికంగా ఉన్న ప్రయాణికులపై సోషల్ మీడియా ‘X’ (గతంలో ట్విట్టర్) ద్వారా ఫిర్యాదు చేసి, వెంటనే సీటు ఖాళీ చేయించాలని అభ్యర్థించారు.
Wines Tender : ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు.. ఇంకా రెండు రోజులే గడువు
ఈ విషయమై టీటీఈ దివాకర్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన సీటు నంబర్ నాలుగు ఖాళీ చేయించడానికి వెళ్లగా, ఆ సీటులో కూర్చున్న మహిళలు కోపంతో ఆయనపై విరుచుకుపడ్డారు. ఆ మహిళలు దూషణలు మొదలుపెట్టి, టీటీఈ చొక్కా చింపివేశారు. అంతేకాకుండా ఆయనను కొట్టి, ఆయన ముఖంపై టీ కూడా విసిరేశారు. మహిళా ప్రయాణికులు తన బంగారు గొలుసు కూడా తెంపేశారని దివాకర్ మిశ్రా చెప్పారు. ఈ వ్యవహారంపై చార్బాగ్ జీఆర్పీలో ఫిర్యాదు నమోదైంది. మహిళలు జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్ బోగీలో ప్రయాణిస్తున్నారని, ఇది అనధికార ప్రయాణం అని రైల్వే యంత్రాంగం తెలిపింది. టీటీఈ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తర్వాత, ఆ మహిళలను బారాబంకి రైల్వే స్టేషన్లో దింపేసినప్పటికీ.. వారు మళ్లీ బోగీలోకి ప్రవేశించారు. ఆ తరువాత రైలు చార్బాగ్ రైల్వే స్టేషన్కు చేరుకున్నప్పుడు వారిని కిందకు దింపి వారిపై జీఆర్పీలో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!