Shocking Incident: టికెట్ తీసుకోకపోవడమే తప్పు.. ఆపై టీటీఈపై దాడి చేసిన మహిళలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident: ఈ మధ్య కాలంలో రైలు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య ఎక్కవుతుంది. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి మరో సంఘటన హౌరా నుంచి రిషికేశ్ వెళ్లే డూన్ ఎక్స్ప్రెస్లో జరిగింది. టికెట్ తనిఖీకి వెళ్లిన టీటీఈకి దారుణ సంఘటన ఎదురైంది. ఇందుకు సంబంధించిన ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఉన్న చార్బాగ్ రైల్వే స్టేషన్లో స్లీపర్ బోగీ S-3లో అనధికారికంగా ప్రయాణిస్తున్న కొందరు మహిళలు సీటు ఖాళీ చేయమని అడిగిన టీటీఈపై దాడి చేశారు. ఈ ఘటనపై టీటీఈ చార్బాగ్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. రైల్వే యంత్రాంగం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపింది.
Siddu Jonnalagadda : ఆ హీరోనే నా ఫేవరెట్.. తెలుగు హీరోలకు షాక్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ
Also Read
- Pakistan: పాకిస్తాన్లో రక్తపాతం.. జాఫర్ ఎక్స్ప్రెస్పై బీఎల్ఏ దాడి.. 23 మంది దుర్మరణం
- MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- Hyderabad: మాదాపూర్లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
ఈ సంఘటన ఉత్తర రైల్వే లక్నో డివిజన్లోని చార్బాగ్ రైల్వే స్టేషన్లో జరిగింది. హౌరా నుండి రిషికేశ్ వెళ్లే రైలు నంబర్ 13009 డూన్ ఎక్స్ప్రెస్ గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చార్బాగ్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. లక్నో రాకముందే టీటీఈ దివాకర్ మిశ్రా రైలులోని స్లీపర్ బోగీ S-3లో టికెట్ తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తనిఖీ సమయంలో, ఒక ప్రయాణికుడు తమ సీటులో అనధికారికంగా ఉన్న ప్రయాణికులపై సోషల్ మీడియా ‘X’ (గతంలో ట్విట్టర్) ద్వారా ఫిర్యాదు చేసి, వెంటనే సీటు ఖాళీ చేయించాలని అభ్యర్థించారు.
Wines Tender : ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు.. ఇంకా రెండు రోజులే గడువు
ఈ విషయమై టీటీఈ దివాకర్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన సీటు నంబర్ నాలుగు ఖాళీ చేయించడానికి వెళ్లగా, ఆ సీటులో కూర్చున్న మహిళలు కోపంతో ఆయనపై విరుచుకుపడ్డారు. ఆ మహిళలు దూషణలు మొదలుపెట్టి, టీటీఈ చొక్కా చింపివేశారు. అంతేకాకుండా ఆయనను కొట్టి, ఆయన ముఖంపై టీ కూడా విసిరేశారు. మహిళా ప్రయాణికులు తన బంగారు గొలుసు కూడా తెంపేశారని దివాకర్ మిశ్రా చెప్పారు. ఈ వ్యవహారంపై చార్బాగ్ జీఆర్పీలో ఫిర్యాదు నమోదైంది. మహిళలు జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్ బోగీలో ప్రయాణిస్తున్నారని, ఇది అనధికార ప్రయాణం అని రైల్వే యంత్రాంగం తెలిపింది. టీటీఈ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తర్వాత, ఆ మహిళలను బారాబంకి రైల్వే స్టేషన్లో దింపేసినప్పటికీ.. వారు మళ్లీ బోగీలోకి ప్రవేశించారు. ఆ తరువాత రైలు చార్బాగ్ రైల్వే స్టేషన్కు చేరుకున్నప్పుడు వారిని కిందకు దింపి వారిపై జీఆర్పీలో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
తాజావార్తలు
-
Avika Gor: “ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా డ్రీమ్”.. నానిపై అవికా గోర్ మనసులో మాట
-
Gurindervir Singh: భారత అత్యంత వేగవంతమైన రన్నర్గా గురిందర్వీర్ సింగ్ నయా రికార్డు.. 10.09 సెకన్లలో 100 మీటర్లు పూర్తి
-
Pakistan: పాకిస్తాన్లో రక్తపాతం.. జాఫర్ ఎక్స్ప్రెస్పై బీఎల్ఏ దాడి.. 23 మంది దుర్మరణం
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ .. ‘హెల్లాళ్లాలో’ వీడియో సాంగ్ అవుట్!
-
MI vs RR: వాంఖడేలో హోరాహోరీ పోరు.. ముంబై vs రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?