Hate Speech: మతం పేరుతో ఎక్కడికి చేరుకున్నాం?.. ద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hate Speech: రాజకీయ నాయకులు ద్వేషపూరిత ప్రసంగాలు చేయడంపై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇది భారత రాజ్యాంగంలోని విలువలకు విరుద్ధమని పేర్కొంది. ఇలాంటి కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. మతాలకు అతీతంగా.. ఈ తరహా ప్రసంగాలు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశంలో వర్గాలను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేసే విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ల ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. ఈ తరహా కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్రంతో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది.
Adar Poonawalla: గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉత్పత్తి భారత్లో అప్పుడే..
Also Read
- Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
- Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
- AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
- Nepal: 25 మందిని చంపిన ‘‘కిల్లర్ ఏనుగు’’.. ఒకే కుటుంబంపై రెండుసార్లు దాడి..
విద్వేష పూరిత ప్రసంగాలు ముఖ్యంగా ప్రజాస్వామిక, మత-తటస్థ దేశానికి భంగమని కోర్టు అభిప్రాయపడింది. ఎవరో ఫిర్యాదు చేస్తారని ఎదురుచూడకుండా నిందితులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాని యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ యంత్రాగం జాప్యం చేసినట్లయితే దానిని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది. దేశ లౌకిక విధాన పరిరక్షణకు విద్వేష పూరిత ప్రసంగాలు ఎవరు చేసినా మత ప్రసక్తి లేకుండా సుమోటో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. షహీన్ అబ్దుల్లా అనే పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్పై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. ‘ఇది 21వ శతాబ్దం. మతం పేరిట మనం ఎక్కడికి చేరుకున్నాం? లౌకిక దేశంలో ఈ పరిస్థితి దిగ్భ్రాంతికరం అంటూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
-
Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
-
AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
-
Nepal: 25 మందిని చంపిన ‘‘కిల్లర్ ఏనుగు’’.. ఒకే కుటుంబంపై రెండుసార్లు దాడి..
-
Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..