రైతులు వ్యవసాయంతో పాటుగా పాడి పరిశ్రమపై కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. అందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే గొర్రెల పెంపకం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. గొర్రెల పెంపకం చేపట్టే రైతులు చలికాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.. గొర్రెలను పెంచడం లో కొన్ని సూచనలు పాటించాలి.అప్పుడే ఇంకాస్త మంచి ఫలితాలను పొందొచ్చు అని అంటూన్నారు..వ్యవసాయం, పశుపోషణ రెండు రంగాలు ఒకదానితో మరొకటి పరస్పర అనుబంధమైనవి , అలాగే ఒకదానిపై మరొకటి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా అధారపడతాయి…
తక్కువ ఖర్చుతో ఈ గొర్రెలను పెంచవచ్చు.. ఇక తక్కువ వర్షపాతం గల తెలంగాణా, రాయలసీమ మొదలగు ప్రాంతాల్లో లాభదాయకంగా ఉంటుంది. వీటి నుంచి మనకు కావాల్సిన మాంసం, ఉన్ని, తోలు, ఎరువు లభిస్తాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కూడా గొర్రెల పెంపకాన్ని ప్రోత్సాహించడంతో ఎక్కువ మంది రైతులు గొర్రెల పెంపకం చేపడుతున్నారు.. గొర్రెలను ఉంచడానికి కాస్త జాగా ఉంటే చాలు, తిండి ఎలాగో బయట పొలాల్లో దొరుకుతుంది.. వృధాగా పెరిగే గడ్డి , పంట నుండి వచ్చే వాటిని తీసుకొని బలంగా తయారవుతాయి..
గొర్రెల సంత పెరగాలంటే ఆడ గొర్రెలను బాగా పెంచాలి.. అవి దృడంగా ఉంటేనే పిల్లలు కూడా ఎక్కువగా వస్తాయి.. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్ళులేని గొర్రెలను ఏరివేయాలి. అడ గొర్రెలను సంతలో కాకుండా,రైతుల మందలోనే చూసి కొనాలి. సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి తీసివేయాలి.. వాటివల్ల మిగిలిన వాటిపై ప్రభావం పడకూడదు..పొట్టేళ్లని మందపై వాడడానికి కనీసం ఒకటిన్నర సంవత్సరాల వయసు గలదై ఉండాలి. కవల పిల్లల నుండి వచ్చిన పొట్టేలు అయితే మంచిది. మందలో ప్రతి 30 ఆడ గొర్రెలకు, ఒక రెండు మగ గొర్రెలను ఉంచాలి.. వీటి సంతానోత్పత్తికి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.. ఎప్పటికప్పుడు గొర్రెల సంరక్షణ చేపట్టాలి.. వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి..