INDIA Bloc: ఖర్గే, రాహల్ను కలిసిన శరద్ పవార్.. ఇండియా కూటమి తదుపరి మీటింగ్ అక్కడేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA Bloc: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కలిశారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో చివరిసారిగా సమావేశం కాగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి కోసం ముందుకు సాగే ప్రణాళికపై చర్చించినట్లు తెలిసింది. ముంబయి సమావేశం అనంతరం మళ్లీ ప్రతిపక్ష కూటమి సమావేశం కాలేదని, త్వరలో సమావేశం కావచ్చని పలు వర్గాలు తెలిపాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టాలని భావిస్తున్న కూటమికి సంబంధించిన మార్గాన్ని ముగ్గురు నేతలు చర్చించారు. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. వారు ఇండియా కూటమి తదుపరి సమావేశానికి సంబంధించిన ప్రణాళికలను కూడా రూపొందించారని రాజకీయ వర్గాలు వెల్లడించాయి.
Also Read: Sela Tunnel: 13 వేల అడుగుల ఎత్తులో అతి పొడవైన టన్నెల్.. ఇండో-చైనా సరిహద్దులో కీలక నిర్మాణం..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు శరద్ పవార్తో తన సమావేశానికి సంబంధించి చిత్రాలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. దేశ ప్రజల గొంతును మరింత పెంచడానికి రాహుల్ గాంధీతో పాటు తనను శరద్ పవార్ కలిశారని ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు. మేము ప్రతి సవాల్కు సిద్ధంగా ఉన్నామని.. ఆయన ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ ట్విటర్ పోస్ట్కు ట్యాగ్లైన్ ఉపయోగించారు.
అక్టోబర్లో భోపాల్లో జరగాల్సిన ఇండియా కూటమి ఉమ్మడి బహిరంగ సభ రద్దయిన తర్వాత శుక్రవారం చర్చలు జరిగాయి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్తో సహా డీఎంకే నాయకులు చేసిన ప్రకటనలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ వ్యతిరేకతతో దీనిని నిర్వహించలేకపోయారని పలు వర్గాలు తెలిపాయి. ఇండియా కూటమి ప్రతిపక్ష నేతల తదుపరి సమావేశం పశ్చిమ బెంగాల్లో నిర్వహించాలని కొందరు ప్రతిపక్ష నేతలు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!