Shamshabad: శంషాబాద్ ఘన్సీమియాగూడ గుర్తుతెలియని జంతువు సంచారం..భయాందోళనలో జనాలు
- రెండు రోజులుగా ఆ పరిసరాల్లో ఓ గుర్తుతెలియని జంతువు సంచారం
- సీసీ కెమెరాల్లో జంతువు దృశ్యాలు రికార్డ్
- అక్కడ సంచరిస్తున్న జంతువు హైనా నా.. చిరుత నా అనేది గుర్తించలేకపోతున్నామన్న డీఎఫ్ఓ విజయానంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భయాందోళనలో శంషాబాద్.. ఘన్సీమియాగూడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజులుగా ఆ పరిసరాల్లో ఓ గుర్తుతెలియని జంతువు సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఆ జంతువు ఏదనేది గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సీసీ కెమెరాల్లో జంతువు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా DFO, విజయానంద్ మాట్లాడారు. అక్కడ సంచరిస్తున్న జంతువు హైనా నా, చిరుత నా అనేది గుర్తించలేకపోతున్నామన్నారు. 10 ట్రాప్ కెమెరాలు, 3 బోన్లు ఏర్పాటు చేశామని… ఎక్కడా జంతువు ఆనవాళ్లు దొరకలేదని స్పష్టం చేశారు. ఈరోజు మరొక 6 కెమెరాలు పెడుతున్నామని తెలిపారు.
READ MORE: Weather Updates: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన!
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
గడ్డి ఎక్కువగా పెరిగిందని.. సీసీ కెమెరా ఫుటేజ్ లో వర్షం ఉండటం వల్ల జంతువును సరిగ్గా గుర్తించలేకపోతున్నామని విజయానంద్ తెలిపారు. హైనా అయినా, చిరుత అయినా.. స్థానికులకు ఎలాంటి అపాయం జరగకూడదన్నారు.
ఆ జంతువును పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అడవి నుంచి బయటకు వచ్చిన జంతువులు.. అంత త్వరగా ట్రాప్ లో పడవుని వెల్లడించారు. ప్రజలెవరూ భయాందోళనకు గురవ్వద్దని సూచించారు.
READ MORE: Vijayawada: జంతు చర్మాల స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు..(వీడియో)
కాగా .. నెల రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టు రన్వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. చిరుతను బంధించేందుకు మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా ఒక బోన్ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రాప్ కెమెరాల్లో సైతం చిరుత కదలికలు స్పష్టంగా రికార్ట్ అయ్యాయి. అదే చిరుత రన్వే పైకి వచ్చిందని జిల్లా అటవీ శాఖ అధికారి విజయానంద్ తెలిపారు. కొన్ని నెలల క్రితం షాద్నగర్ ప్రాంతంలోనూ చిరుత కనిపించింది. వారం రోజులు శ్రమించి దాన్నిపట్టుకున్నారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!