Shamshabad: శంషాబాద్ ఘన్సీమియాగూడ గుర్తుతెలియని జంతువు సంచారం..భయాందోళనలో జనాలు
- రెండు రోజులుగా ఆ పరిసరాల్లో ఓ గుర్తుతెలియని జంతువు సంచారం
- సీసీ కెమెరాల్లో జంతువు దృశ్యాలు రికార్డ్
- అక్కడ సంచరిస్తున్న జంతువు హైనా నా.. చిరుత నా అనేది గుర్తించలేకపోతున్నామన్న డీఎఫ్ఓ విజయానంద్
భయాందోళనలో శంషాబాద్.. ఘన్సీమియాగూడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజులుగా ఆ పరిసరాల్లో ఓ గుర్తుతెలియని జంతువు సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఆ జంతువు ఏదనేది గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సీసీ కెమెరాల్లో జంతువు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా DFO, విజయానంద్ మాట్లాడారు. అక్కడ సంచరిస్తున్న జంతువు హైనా నా, చిరుత నా అనేది గుర్తించలేకపోతున్నామన్నారు. 10 ట్రాప్ కెమెరాలు, 3 బోన్లు ఏర్పాటు చేశామని… ఎక్కడా జంతువు ఆనవాళ్లు దొరకలేదని స్పష్టం చేశారు. ఈరోజు మరొక 6 కెమెరాలు పెడుతున్నామని తెలిపారు.
READ MORE: Weather Updates: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
గడ్డి ఎక్కువగా పెరిగిందని.. సీసీ కెమెరా ఫుటేజ్ లో వర్షం ఉండటం వల్ల జంతువును సరిగ్గా గుర్తించలేకపోతున్నామని విజయానంద్ తెలిపారు. హైనా అయినా, చిరుత అయినా.. స్థానికులకు ఎలాంటి అపాయం జరగకూడదన్నారు.
ఆ జంతువును పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అడవి నుంచి బయటకు వచ్చిన జంతువులు.. అంత త్వరగా ట్రాప్ లో పడవుని వెల్లడించారు. ప్రజలెవరూ భయాందోళనకు గురవ్వద్దని సూచించారు.
READ MORE: Vijayawada: జంతు చర్మాల స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు..(వీడియో)
కాగా .. నెల రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టు రన్వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. చిరుతను బంధించేందుకు మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా ఒక బోన్ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రాప్ కెమెరాల్లో సైతం చిరుత కదలికలు స్పష్టంగా రికార్ట్ అయ్యాయి. అదే చిరుత రన్వే పైకి వచ్చిందని జిల్లా అటవీ శాఖ అధికారి విజయానంద్ తెలిపారు. కొన్ని నెలల క్రితం షాద్నగర్ ప్రాంతంలోనూ చిరుత కనిపించింది. వారం రోజులు శ్రమించి దాన్నిపట్టుకున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!