RGIA : మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాలు ఆలస్యం.. ప్రయాణికుల ఆగ్రహం
- స్పైస్జెట్ విమాన ఆలస్యంపై హైడ్రామా
- రన్వే పైకి వెళ్లి తిరిగి పార్కింగ్ బేలోకి వచ్చిన విమానం!
- విమానయాన సంస్థల నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGIA : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో ప్రయాణికుల కష్టాలు పెరిగిపోతున్నాయి. గమ్యస్థానాలకు సరిగ్గా చేరాల్సిన విమానాలు గంటల తరబడి ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తాజాగా మరోసారి స్పైస్జెట్ విమానం ఆలస్యం కావడం విమానాశ్రయంలో కలకలం రేపింది.
ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మూడు గంటలుగా ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు విమానం బయలుదేరుతుందా అని ఎదురుచూస్తూ అలసిపోయిన ప్రయాణికులు ఎయిర్పోర్టులో ఆందోళనకు దిగారు. విమాన సిబ్బంది కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రయాణికులు మండిపడుతున్నారు.
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
ఇదే నెలలో ఇదే స్పైస్జెట్ విమానం ఐదున్నర గంటల పాటు ఆలస్యమైన సంఘటన ఇంకా మరిచిపోక ముందే మరోసారి ఈ తరహా ఆలస్యాలు చోటుచేసుకోవడం విమానయాన సంస్థల నిర్లక్ష్యాన్ని అర్థమయ్యేలా చేస్తోంది. ఫిబ్రవరి 7న ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన విమానం పలు కారణాలతో ఐదున్నర గంటలు ఆలస్యం అవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం సాయంత్రం అయ్యే సరికి గమ్యస్థానానికి చేరలేదు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన ప్రయాణికుల్లో హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు, ఇద్దరు ఐఏఎస్లు, ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. “గంటల తరబడి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా సమయాన్ని వృథా చేస్తున్నారు!” అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక అంతకు ముందు రోజు మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గుహవాటి వెళ్లాల్సిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం రన్వేపైకి వెళ్లాక ఇంజిన్ మొరాయించింది! పైలెట్ అప్రమత్తమై వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇంజనీరింగ్ నిపుణులు వెంటనే రంగంలోకి దిగారు. దాదాపు గంట పాటు లోపాన్ని సరిచేయడానికి ప్రయత్నించి ఎట్టకేలకు విమానాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ రన్వేపైకి వెళ్లిన విమానం తిరిగి పార్కింగ్ బే వైపు రావడంతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. చివరకు గంటన్నర ఆలస్యంగా విమానం గమ్యస్థానానికి బయలుదేరింది.
తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం, ఆలస్యమైనా కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం పై విమానయాన సంస్థలపై ప్రయాణికుల అసహనం పెరుగుతోంది. “ఎప్పుడెప్పుడు బయలుదేరుతుందో చెప్పకుండా గంటల తరబడి నిలిపేస్తే ప్రయాణికుల పరిస్థితి ఏమిటి?” అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే డిమాండ్ మరింత బలపడుతోంది.
UP Encounter: యూపీలో ఎన్కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ హతం..
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
-
NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..