Shakib Al Hasan: నా భర్త నన్ను మోసం చేయలేదు.. బంగ్లా మాజీ కెప్టెన్ షకీబ్ భార్య!
- భార్యను షకీబ్ మోసం చేసినట్లు వార్తలు
- 100/100 మార్కులు ఇవ్వొచ్చు
- పోటోలను ప్రైవేట్లో ఉంచాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ తన భార్య ఉమ్మీ అహ్మద్ శిశిర్ను మోసం చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనిఎం విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. భర్త షకీబ్తో కలిసి దిగిన ఫొటోలను శిశిర్ సోషల్ మీడియాలో డిలీట్ చేయడమే ఇందుకు కారణం. ఈ వార్తలను షకీబ్ భార్య శిశిర్ తాజాగా ఖండించారు. అసత్య వార్తలను వ్యాప్తి చేయొద్దని.. ఓ భర్తగా, మంచి తండ్రిగా షకీబ్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నాడని పేర్కొన్నారు.
భర్త షకీబ్తో కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేయలేదని, ప్రైవేట్లో పెట్టానని శిశిర్ వివరణ ఇచ్చారు. ‘క్రికెట్ పరంగా నా భర్త షకీబ్ గురించి మీకు రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మీరు క్రికెట్ పరంగా ఎన్ని విమర్శలైనా చేయండి కానీ.. వాటిని మా వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టొద్దు. షకీబ్ గొప్ప భర్త, మంచి తండ్రి. నాతో ఎంతో నిజాయితీగా ఉంటాడు. నన్ను అస్సలు బాధపెట్టడు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. పెళ్లయినప్పటినుంచి ఏం మారలేదు. జీవిత భాగస్వామిగా 100/100 మార్కులు ఇవ్వొచ్చు’ అని శిశిర్ చెప్పారు.
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
Also Read: Nani: నా కెరీర్లో ప్రత్యేకమైన చిత్రం అదే: నాని
‘దయచేసి సోషల్ మీడియాలో ప్రచారంను ఆపండి. ఇలాంటి వార్తలను వ్యాప్తి చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిజానికి నా వ్యక్తిగత జీవితం గురించి అందరి ముందు మాట్లాడడం ఇష్టం ఉండదు. కానీ అనవసరమైన కాల్స్, మెసేజ్లు వస్తుండటంతో తప్పక స్పందించాల్సి వచ్చింది. షకీబ్ ఇప్పుడు పాకిస్థాన్ సిరీస్పై దృష్టి పెట్టాడు. నేను మా కుటుంబంతో సరదాగా ఉన్నాను. నేను సోషల్ మీడియాలో ఎలాంటి ఫొటోలు డిలీట్ చేయలేదు. వాటిని ప్రైవేట్లో ఉంచాను’ అని శిశిర్ చెప్పుకొచ్చారు. షకీబ్ ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్నాడు. ఆగస్టు 21 నుంచి పాక్తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..