Kangana Ranaut: స్టార్ హీరోయిన్కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి భాజపా ఎంపీగా ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు పంజాబ్-హర్యానా హైకోర్టులో ఓ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై ఉన్న డిఫమేషన్ కేసును రద్దు చేయాలంటూ ఆమె వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసు 2021లో జరిగిన సంఘటనలకు సంబంధించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా కిసాన్ ఆందోళన జరుగుతుంది. అదే సమయంలో కంగనా రనౌత్ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో బతిండా జిల్లా బహదూర్గఢ్ జండియా గ్రామానికి చెందిన మహిందర్ కౌర్ అనే 87 ఏళ్ల వృద్ధ మహిళను 200 రూపాయలు తీసుకుని ఆందోళనకు వచ్చిన మహిళగా అభివర్ణించారు.
Washing Machine: టాప్ లోడ్ vs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు.. ఏది బెస్ట్? ఎందుకు?
Also Read
- Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
- Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
- Kerala CM Row: కేరళలో ముదిరిన కాంగ్రెస్ పోరు.. రాహుల్, ప్రియాంక గాంధీలకు వార్నింగ్..
- Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
ఈ ట్వీట్ సదరు మహిళ గౌరవాన్ని దెబ్బతీసిందంటూ.. 2021 జనవరి 4న మహిందర్ కౌర్ బతిండా కోర్టులో డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. కంగనా తర్వాత ఆ ట్వీట్ను తొలగించినప్పటికీ, ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. ఈ కేసుపై 13 నెలల పాటు విచారణ జరిగిన అనంతరం బతిండా కోర్టు కంగనాకు సమన్లు జారీ చేసింది. దీంతో ఈ కేసును రద్దు చేయించుకోవాలనే ఉద్దేశంతో కంగనా పంజాబ్-హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, జస్టిస్ త్రిభువన్ సింగ్ దహియా నేతృత్వంలోని కోర్టు ఆమె పిటిషన్ను తిరస్కరించింది. కంగనా రనౌత్ ఒక సెలబ్రిటీ.. ఆమె చేసిన ట్వీట్ లేదా రీట్వీట్ వలన బాధిత మహిళ ప్రతిష్టకు హాని జరిగిందని, అది పూర్తిగా మనభిమానానికి దారితీసేలా ఉందని కోర్టు పేర్కొంది. మ్యాజిస్ట్రేట్ అన్ని ఆధారాలను పరిశీలించిన తరువాతే కంగనాపై ప్రాథమికంగా IPC సెక్షన్ 499 ప్రకారం కేసు కొనసాగించేలా నిర్ణయించారని పేర్కొంది. దీంతో, ఇకపై కంగనాకు పంజాబ్లోని స్థానిక కోర్టులో విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది.
ENG vs IND: అందరికీ ఛాన్స్లు ఇస్తున్నారు.. మా అబ్బాయికి ఇవ్వరా? డిప్రెషన్లోకి వెళ్లాడు
అయితే , కంగనా తన తరఫు వాదనలో తాను స్వయంగా ఆ ట్వీట్ రాయలేదని.. ఒక న్యాయవాది పోస్టును కేవలం రీట్వీట్ చేశానని చెబుతున్నారు. అయినప్పటికీ, కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. దీనితో మరోసారి ఈ కేసు సంబంధించి ఆమెపై విచారణ కొనసాగనుంది.
తాజావార్తలు
-
Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
-
Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
-
Kerala CM Row: కేరళలో ముదిరిన కాంగ్రెస్ పోరు.. రాహుల్, ప్రియాంక గాంధీలకు వార్నింగ్..
-
Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!