Kangana Ranaut: స్టార్ హీరోయిన్కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి భాజపా ఎంపీగా ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు పంజాబ్-హర్యానా హైకోర్టులో ఓ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై ఉన్న డిఫమేషన్ కేసును రద్దు చేయాలంటూ ఆమె వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసు 2021లో జరిగిన సంఘటనలకు సంబంధించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా కిసాన్ ఆందోళన జరుగుతుంది. అదే సమయంలో కంగనా రనౌత్ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో బతిండా జిల్లా బహదూర్గఢ్ జండియా గ్రామానికి చెందిన మహిందర్ కౌర్ అనే 87 ఏళ్ల వృద్ధ మహిళను 200 రూపాయలు తీసుకుని ఆందోళనకు వచ్చిన మహిళగా అభివర్ణించారు.
Washing Machine: టాప్ లోడ్ vs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు.. ఏది బెస్ట్? ఎందుకు?
Also Read
- Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
- Trump: అణు తనిఖీలు, హార్ముజ్పై ట్రంప్ కీలక ప్రకటన.. వెంటనే ఖండించిన ఇరాన్
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
- Tragedy: ఫోన్ వాడొద్దన్నందుకు.. ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకిన బాలుడు..
ఈ ట్వీట్ సదరు మహిళ గౌరవాన్ని దెబ్బతీసిందంటూ.. 2021 జనవరి 4న మహిందర్ కౌర్ బతిండా కోర్టులో డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. కంగనా తర్వాత ఆ ట్వీట్ను తొలగించినప్పటికీ, ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. ఈ కేసుపై 13 నెలల పాటు విచారణ జరిగిన అనంతరం బతిండా కోర్టు కంగనాకు సమన్లు జారీ చేసింది. దీంతో ఈ కేసును రద్దు చేయించుకోవాలనే ఉద్దేశంతో కంగనా పంజాబ్-హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, జస్టిస్ త్రిభువన్ సింగ్ దహియా నేతృత్వంలోని కోర్టు ఆమె పిటిషన్ను తిరస్కరించింది. కంగనా రనౌత్ ఒక సెలబ్రిటీ.. ఆమె చేసిన ట్వీట్ లేదా రీట్వీట్ వలన బాధిత మహిళ ప్రతిష్టకు హాని జరిగిందని, అది పూర్తిగా మనభిమానానికి దారితీసేలా ఉందని కోర్టు పేర్కొంది. మ్యాజిస్ట్రేట్ అన్ని ఆధారాలను పరిశీలించిన తరువాతే కంగనాపై ప్రాథమికంగా IPC సెక్షన్ 499 ప్రకారం కేసు కొనసాగించేలా నిర్ణయించారని పేర్కొంది. దీంతో, ఇకపై కంగనాకు పంజాబ్లోని స్థానిక కోర్టులో విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది.
ENG vs IND: అందరికీ ఛాన్స్లు ఇస్తున్నారు.. మా అబ్బాయికి ఇవ్వరా? డిప్రెషన్లోకి వెళ్లాడు
అయితే , కంగనా తన తరఫు వాదనలో తాను స్వయంగా ఆ ట్వీట్ రాయలేదని.. ఒక న్యాయవాది పోస్టును కేవలం రీట్వీట్ చేశానని చెబుతున్నారు. అయినప్పటికీ, కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. దీనితో మరోసారి ఈ కేసు సంబంధించి ఆమెపై విచారణ కొనసాగనుంది.
తాజావార్తలు
-
Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
-
Trump: అణు తనిఖీలు, హార్ముజ్పై ట్రంప్ కీలక ప్రకటన.. వెంటనే ఖండించిన ఇరాన్
-
Thalaivar 173: రజనీకాంత్ ఫ్యాన్స్కు పూనకాలే.. ‘తలైవర్ 173’ టైటిల్ రివీల్ రేపే!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!