Tejeshwar Case: నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు.. అన్నా నన్నెందుకు చంపుతున్నారు అని వేడుకున్నా..
- నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు
- అన్నా నన్నెందుకు చంపుతున్నారు అని వేడుకున్నా వదలకుండా
- ఇవాళ తేజేశ్వర్, ఐశ్వర్య లను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీస్ లు పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గద్వాల నవ వరుడు తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితులకు కోర్టు తాజా రిమాండ్ అనంతరం ఏ1 తిరుమలరావు, ఏ3 నాగేష్, ఏ4 పరుశరాము, ఏ5 రాజులను నాలుగు రోజులు కస్టడీలోకి తీసుకొని నిర్వహించిన విచారణలో వెల్లడైన అంశాలను ఆదివారం గద్వాల సీఐ శ్రీను విలేకరులకు వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితులు తిరుమలరావు, ఐశ్వర్యల మధ్య ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని తెలిపారు. ఐశ్వర్యను రెండో వివాహం చేసుకుంటానని తిరుమలరావు తన భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించగా ఆమె ఒప్పుకోలేదు. మరోవైపు తిరుమలరావును వివాహం చేసుకుంటే కుటుంబం పరువుపోతుందని బంధువులు చెప్పడంతో ఐశ్వర్య, తేజేశ్వర్ని వివాహం చేసుకుంది.
Also Read:San Rechal: ప్రముఖ మోడల్ శాన్ రీచల్ ఆత్మహత్య
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య, తిరుమలరావు ఫోన్లో మాట్లాడుకునేవారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తిరుమలరావు వాయిస్ ఛేంజర్ డివైజ్ సాయంతో మహిళ గొంతులో ప్రియురాలు ఐశ్వర్యతో మాట్లాడేవాడని విచారణలో తేలింది. ఈ పరికరాన్ని కర్నూలులో తిరుమలరావు పనిచేసే బ్యాంకులో స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. తేజేశ్వర్ కు విషయం తెలిస్తే ఎప్పటికైనా ప్రమాదం అని అతడిని చంపాలని ప్రియుడు తిరుమల రావును ప్రేరేపించింది. ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం చేసుకుని జూన్ 13న గద్వాలలోని సంగాల చెర్వు వద్దకు రావాలంటూ తేజేశ్వర్కు గ్యాంగ్ ఫోన్ చేయగా.. అతను తన స్నేహితుడితో కలిసి రావడంతో హత్య పన్నాగం విఫలమైంది.
Also Read:Shreya Dhanwanthary : ముద్దు సన్నివేశం తొలగించడమేంటీ..? సెన్సార్పై శ్రీయ బోల్డ్ కౌంటర్
మళ్లీ 17న డ్రైవర్ నాగేష్, పరుశరాము, రాజు కలిసి గద్వాలలోని కృష్ణారెడ్డి బంగ్లా వద్ద తేజేశ్వర్ని కారులో తీసుకెళ్లారు. కారులోనే అతన్ని వేట కొడవళ్లు, కత్తులతో గొంతు కోసి కడతేర్చారు. ‘అన్నా.. నన్నెందుకు చంపుతున్నారు’ అని తేజేశ్వర్ గ్యాంగ్ను అడిగినట్లు విచారణలో తేలిందని సీఐ పేర్కొన్నారు. వేడుకున్నా వదలకుండా హత్య చేసినట్లు తెలిపారు. తేజేశ్వర్ హత్య నిందితులు మహబూబ్ నగర్ జిల్లా జైలు లో ఉన్నారు. ఇవాళ తేజేశ్వర్, ఐశ్వర్య లను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీస్ లు పిటిషన్ వేయనున్నారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!