Tejeshwar Case: నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు.. అన్నా నన్నెందుకు చంపుతున్నారు అని వేడుకున్నా..
- నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు
- అన్నా నన్నెందుకు చంపుతున్నారు అని వేడుకున్నా వదలకుండా
- ఇవాళ తేజేశ్వర్, ఐశ్వర్య లను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీస్ లు పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గద్వాల నవ వరుడు తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితులకు కోర్టు తాజా రిమాండ్ అనంతరం ఏ1 తిరుమలరావు, ఏ3 నాగేష్, ఏ4 పరుశరాము, ఏ5 రాజులను నాలుగు రోజులు కస్టడీలోకి తీసుకొని నిర్వహించిన విచారణలో వెల్లడైన అంశాలను ఆదివారం గద్వాల సీఐ శ్రీను విలేకరులకు వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితులు తిరుమలరావు, ఐశ్వర్యల మధ్య ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని తెలిపారు. ఐశ్వర్యను రెండో వివాహం చేసుకుంటానని తిరుమలరావు తన భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించగా ఆమె ఒప్పుకోలేదు. మరోవైపు తిరుమలరావును వివాహం చేసుకుంటే కుటుంబం పరువుపోతుందని బంధువులు చెప్పడంతో ఐశ్వర్య, తేజేశ్వర్ని వివాహం చేసుకుంది.
Also Read:San Rechal: ప్రముఖ మోడల్ శాన్ రీచల్ ఆత్మహత్య
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య, తిరుమలరావు ఫోన్లో మాట్లాడుకునేవారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తిరుమలరావు వాయిస్ ఛేంజర్ డివైజ్ సాయంతో మహిళ గొంతులో ప్రియురాలు ఐశ్వర్యతో మాట్లాడేవాడని విచారణలో తేలింది. ఈ పరికరాన్ని కర్నూలులో తిరుమలరావు పనిచేసే బ్యాంకులో స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. తేజేశ్వర్ కు విషయం తెలిస్తే ఎప్పటికైనా ప్రమాదం అని అతడిని చంపాలని ప్రియుడు తిరుమల రావును ప్రేరేపించింది. ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం చేసుకుని జూన్ 13న గద్వాలలోని సంగాల చెర్వు వద్దకు రావాలంటూ తేజేశ్వర్కు గ్యాంగ్ ఫోన్ చేయగా.. అతను తన స్నేహితుడితో కలిసి రావడంతో హత్య పన్నాగం విఫలమైంది.
Also Read:Shreya Dhanwanthary : ముద్దు సన్నివేశం తొలగించడమేంటీ..? సెన్సార్పై శ్రీయ బోల్డ్ కౌంటర్
మళ్లీ 17న డ్రైవర్ నాగేష్, పరుశరాము, రాజు కలిసి గద్వాలలోని కృష్ణారెడ్డి బంగ్లా వద్ద తేజేశ్వర్ని కారులో తీసుకెళ్లారు. కారులోనే అతన్ని వేట కొడవళ్లు, కత్తులతో గొంతు కోసి కడతేర్చారు. ‘అన్నా.. నన్నెందుకు చంపుతున్నారు’ అని తేజేశ్వర్ గ్యాంగ్ను అడిగినట్లు విచారణలో తేలిందని సీఐ పేర్కొన్నారు. వేడుకున్నా వదలకుండా హత్య చేసినట్లు తెలిపారు. తేజేశ్వర్ హత్య నిందితులు మహబూబ్ నగర్ జిల్లా జైలు లో ఉన్నారు. ఇవాళ తేజేశ్వర్, ఐశ్వర్య లను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీస్ లు పిటిషన్ వేయనున్నారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..