Pekamedalu : ‘నా పేరు శివ’, ‘అంధకారం’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన వినోద్ కిషన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పేక మేడలు’. ఇందులో అనుషా కృష్ణ కథానాయికగా నటిస్తోంది. ఎవ్వరికి చెప్పోడు చిత్రంతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించిన తరువాత, ఇప్పుడు పెక మేడలు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఈ చిత్రంలోని మొదటి పాట, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల హీరో వినోద్ కిషన్ రూపొందించిన వినూత్న ప్రచార వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నుండి రెండవ సింగిల్ అడాపిల్ల పాట విడుదలైంది.
Balakrishna : ఇద్దరు భామలతో బాలయ్య కిరాక్ పోజు.. ఫోటో వైరల్..
‘ఆనందం అత్తకు స్వాహా మనశాంతి మామకు స్వాహా ఆడదాని జన్మంతా స్వాహా’ అంటూ సాగే ఈ పాట సింగర్ సాకే రాజశేఖర్ పాడగా లిరిక్స్ రాసింది భార్గవ కార్తీక్. స్మరణ్ సాయి అందించిన మ్యూజిక్ చాలా ఎట్రాక్టివ్ గా కొత్తగా ఉంది. ఈ పాట అధ్యంతం కొత్తగా, వైవిద్యంగా చిత్రీకరించినట్టుగా అర్ధమవుతుంది. భార్గవ కార్తీక్ సాహిత్యం అందించిన ఈ పాటను గాయకుడు సాకే రాజశేకర్ ఆలపించారు. స్మారణ్ సాయి అందించిన సంగీతం చాలా ఆకర్షణీయంగా, కొత్తదిగా ఉంది. ఈ పాటను కొత్త, భిన్నమైన రీతిలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మంచి కాన్సెప్ట్, కంటెంట్తో కూడిన కథగా ఈ సినిమా తప్పకుండా విజయం సాధించేలా కనపడుతుంది. ఈ చిత్రం జూలై 19న గ్రాండ్ గా విడుదలవుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితికా శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనుషా నుతాల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితర నటీనటులు నటించారు.
Pollution: ఈ నగరాలకు ఏమైంది.. ప్రతీ ఏడాది 33 వేల మరణాలు..
ఈ సినిమాకు రాకేశ్ వార్రే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నీలగిరి మామిల్ల రచయిత, దర్శకుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. డిఓపి గా హరిచరణ్ కె., ఎడిటర్లు గా సృజనా అడుసుమిల్లి, హమ్జా అలీలు., మ్యూజిక్ డైరెక్టర్ గా స్మారన్ సాయి., లైన్ నిర్మాతగా అనుషా బోరా., ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కేతన్ కుమార్, పిఆర్ఓగా మధు విఆర్ బాద్యతలను నిర్వహిస్తున్నారు.