Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర రెండో దశ ప్రకటించిన కాంగ్రెస్.. ఈ సారి యాత్ర ఎక్కడి నుంచంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి దశకు విశేష స్పందన లభించిన తర్వాత, ఇప్పుడు గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రెండో దశను ప్లాన్ చేసినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మంగళవారం తెలిపారు. అదే సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తారని ఆయన తెలిపారు. మహారాష్ట్రలో యాత్రకు సన్నాహకంగా రాష్ట్రంలోని ప్రతి లోక్సభ స్థానానికి 48 మంది పార్టీ పరిశీలకులను నియమించినట్లు పటోలే తెలిపారు. ఈ పరిశీలకులు ఆరు రోజుల్లోగా క్షేత్రస్థాయి పరిస్థితిపై నివేదికను సమర్పించనున్నారు, ఆ తర్వాత ఆగస్టు 16న కోర్ కమిటీ సమావేశం జరగనుంది.
పటోలే ప్రకారం.. తూర్పు విదర్భలో యాత్రకు నాయకత్వం వహిస్తామని, ముంబైలో వర్ష గైక్వాడ్, పశ్చిమ విదర్భలో విజయ్ వాడెట్టివార్, ఉత్తర మహారాష్ట్రలో బాలాసాహెబ్ థోరట్, మరఠ్వాడాలో అశోక్ చవాన్, పశ్చిమ మహారాష్ట్రలో పృథ్వీరాజ్ చవాన్ నాయకత్వం వహిస్తారు. అనంతరం నేతలంతా కలిసి కొంకణ్కు వెళ్లనున్నారు. పాదయాత్ర అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తామని పటోలే తెలిపారు.
Also Read
- Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
- Varuna Yagam: నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
- FCRA Bill: 'మా చట్టాల గురించి మీకెందుకు?'.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
Also Read: Mallikarjun Kharge: 13న రాయ్పూర్..18న తెలంగాణ.. ప్రచార పర్వానికి ఖర్గే శ్రీకారం..!
రాహుల్ గాంధీ తన రెండో దశ యాత్రను రాష్ట్రం నుంచి ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించినట్లు గుజరాత్ కాంగ్రెస్ ప్రకటించిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ల భూమి అయిన గుజరాత్ నుంచి భారత్ జోడో యాత్ర రెండో దశను ప్రారంభించాలని రాహుల్గాంధీకి ఆహ్వానం పంపామని, రెండో దశ రాష్ట్రం నుంచే ప్రారంభం కావాలని గుజరాత్ ప్రతిపక్ష నేత అమిత్ చావ్డా పేర్కొన్నారు. రెండో దశ యాత్ర ఈసారి తూర్పు నుంచి పశ్చిమం వరకు ఉన్న రాష్ట్రాలను కవర్ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదటి దశ సెప్టెంబర్ 2022లో తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. జనవరి 30న జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో ముగిసింది. ఈ పాదయాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేసింది. యాత్ర ముగిసిన రెండు నెలల తర్వాత రాహుల్ గాంధీ తన ‘మోదీ’ ఇంటిపేరు వ్యాఖ్యపై పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించబడింది. రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. దోషిగా తేలడంతో లోక్సభ ఎంపీగా కూడా అనర్హత వేటు పడింది. అయితే, గత వారం సుప్రీంకోర్టుృ స్టే విధించింది. సోమవారం లోక్సభ ఎంపీగా రాహుల్ తిరిగి నియమించబడ్డారు.
Also Read: Google Grammar Check: ఇకపై గ్రామర్ తప్పులకు చెక్.. గూగుల్లో ప్రత్యేక ఫీచర్
ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విఫలమైందని, మహారాష్ట్ర కాంగ్రెస్కు కూడా అదే గతి పట్టిందని బీజేపీ పేర్కొంది.” రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విఫలమైంది. యాత్ర ముగిసిన తర్వాత ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధినేత కూడా ఇదే ఉదాహరణను అనుసరించాలనుకుంటున్నారా? ప్రజలతో సంబంధం లేని కారణంగానే కాంగ్రెస్ పాదయాత్ర చేస్తోందన్నారు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఉనికిని కలిగి ఉన్న కోకన్ ప్రాంతంపై వారు దృష్టి సారిస్తున్నారు. మహావికాస్ అఘాడీ కేవలం కాగితంపై మాత్రమే ఉందని స్పష్టమైంది” అని మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు మాధవ్ భండారీ అన్నారు.
తాజావార్తలు
-
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్పాట్.. టాలీవుడ్కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
-
AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
-
Varuna Yagam: నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!