Godavari River Tragedy: గోదావరిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు.. ఒక మృతదేహం లభ్యం!
- గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు
- యువకుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
- ఒక మృతదేహం లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని లంక వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన 8 మంది యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము వరకు గజ ఈత గాళ్లు, వలల సాయంతో ఎస్డీఆర్ఎఫ్ అధికారులు గోదావరిని జల్లెడ పట్టారు. ప్రమాదం జరిగిన సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం వడ్డే మహేష్గా గుర్తించారు. ఇంకా ఏడుగురి యువకుల ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
శేరిలంకకు చెందిన కొండేపూడి నాగరాజు-చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమజ్యోతి రజస్వల వేడుకకు ఆమె సోదరుడు పోలిశెట్టి అభిషేక్ తన స్నేహితులను పిలిచాడు. అభిషేక్ ఆహ్వానంపై పలు ప్రాంతాలకు చెందిన మిత్రులు, బంధువులు వేడుకకు హాజరయ్యారు. భోజనాలు ఆరగించిన తరువాత సరదాగా గౌతమి గోదావరిలో స్నానం చేసేందుకు 11 మంది వెళ్లారు. ముందుగా ఒక యువకుడు స్నానానికి దిగి.. కాస్త లోపలికి వెళ్ళాడు. అక్కడ లోతుగా ఉండడంతో అతడు మునిగిపోయాడు. అది చూసిన మరో ముగ్గురు అతడిని రక్షించేందుకు గోదావరిలోకి దిగి మునిగిపోయారు. అలా ఒకరి తరువాత ఒకరు గోదావరిలోకి వెళ్లి గల్లంతయ్యారు.
Also Read
- Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
- Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
- Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
Also Read: Mahanadu 2025: నేటి నుంచి టీడీపీ మహానాడు.. ఈరోజటి కార్యక్రమాలు ఇవే!
ప్రమాదాన్ని గ్రహించిన ముగ్గురు యువకులు నదిలోకి దిగకుండా సురక్షితంగా బయటపడ్డారు. యువకులు స్థానికులకు సమాచారం ఇవ్వడంతో.. హుటాహుటిన అందరూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసు అధికారులు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగింది. ప్రమాదం జరిగిన సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతయిన ఎనిమిది మందిలో నలుగురు రెండు కుటుంబాలకు చెందిన సోదరులు. మహేష్, రాజేష్.. క్రాంతి కిరణ్, పాల్ అభిషేక్ సొంత సోదరులు. దీంతో యువకుల కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. కమిని లంక పాయ దగ్గర గోదావరి లోతుగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. యానాం దగ్గర గోదావరి, సముద్రం పోటు కారణంగా నీళ్లు వెనక్కి ఫోర్స్ గా వస్తాయని మత్స్యకారులు అంటున్నారు.
తాజావార్తలు
-
Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
-
Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
-
Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..