Godavari River Tragedy: గోదావరిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు.. ఒక మృతదేహం లభ్యం!
- గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు
- యువకుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
- ఒక మృతదేహం లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని లంక వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన 8 మంది యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము వరకు గజ ఈత గాళ్లు, వలల సాయంతో ఎస్డీఆర్ఎఫ్ అధికారులు గోదావరిని జల్లెడ పట్టారు. ప్రమాదం జరిగిన సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం వడ్డే మహేష్గా గుర్తించారు. ఇంకా ఏడుగురి యువకుల ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
శేరిలంకకు చెందిన కొండేపూడి నాగరాజు-చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమజ్యోతి రజస్వల వేడుకకు ఆమె సోదరుడు పోలిశెట్టి అభిషేక్ తన స్నేహితులను పిలిచాడు. అభిషేక్ ఆహ్వానంపై పలు ప్రాంతాలకు చెందిన మిత్రులు, బంధువులు వేడుకకు హాజరయ్యారు. భోజనాలు ఆరగించిన తరువాత సరదాగా గౌతమి గోదావరిలో స్నానం చేసేందుకు 11 మంది వెళ్లారు. ముందుగా ఒక యువకుడు స్నానానికి దిగి.. కాస్త లోపలికి వెళ్ళాడు. అక్కడ లోతుగా ఉండడంతో అతడు మునిగిపోయాడు. అది చూసిన మరో ముగ్గురు అతడిని రక్షించేందుకు గోదావరిలోకి దిగి మునిగిపోయారు. అలా ఒకరి తరువాత ఒకరు గోదావరిలోకి వెళ్లి గల్లంతయ్యారు.
Also Read
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
Also Read: Mahanadu 2025: నేటి నుంచి టీడీపీ మహానాడు.. ఈరోజటి కార్యక్రమాలు ఇవే!
ప్రమాదాన్ని గ్రహించిన ముగ్గురు యువకులు నదిలోకి దిగకుండా సురక్షితంగా బయటపడ్డారు. యువకులు స్థానికులకు సమాచారం ఇవ్వడంతో.. హుటాహుటిన అందరూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసు అధికారులు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగింది. ప్రమాదం జరిగిన సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతయిన ఎనిమిది మందిలో నలుగురు రెండు కుటుంబాలకు చెందిన సోదరులు. మహేష్, రాజేష్.. క్రాంతి కిరణ్, పాల్ అభిషేక్ సొంత సోదరులు. దీంతో యువకుల కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. కమిని లంక పాయ దగ్గర గోదావరి లోతుగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. యానాం దగ్గర గోదావరి, సముద్రం పోటు కారణంగా నీళ్లు వెనక్కి ఫోర్స్ గా వస్తాయని మత్స్యకారులు అంటున్నారు.
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!