SBI Insurance Policy: ఎస్బీఐ పాలసీ.. రోజుకు రూ. 6 పొదుపు చేస్తే చాలు.. రూ. 40 లక్షలు మీవే!
- ఎస్బీఐ పాలసీ.. రోజుకు రూ. 6 పొదుపు చేస్తే చాలు
- రూ. 40 లక్షలు మీవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తక్కువ సంపాదించే వాళ్లు కాదు.. తక్కువ పొదుపు చేసే వాళ్లు పేదవాళ్లు అని నిపుణులు అంటుంటారు. నేడు మీరు మీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని సేవ్ చేస్తే రాబోయే రోజుల్లో ఆపదలు సంభవించినప్పుడు, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో పొదుపు చేసిన డబ్బు ఆదుకుంటుంది. అదే సమయంలో ఇన్సూరెన్స్ పాలసీల్లో చేరితే దురదృష్టావశాత్తు ఏదైనా ప్రమాదం భారిన పడినప్పుడు ఇన్సూరెన్స్ సొమ్ము కుటుంబానికి అండగా ఉంటుంది. అప్పుల బాధ లేకుండా చేస్తుంది. మరి మీరు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన ప్రమాద బీమా పథకాన్ని అందిస్తోంది. అదే SBI వ్యక్తిగత ప్రమాద బీమా పథకం. ఇందులో చేరి రోజుకు రూ. 6 పొదుపు చేస్తే చాలు రూ. 40 లక్షలు పొందే ఛాన్స్ ఉంటుంది.
Also Read:AP Cabinet Decisions: 80 వేల కోట్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్.. లక్షకు పైగా ఉద్యోగాలు..!
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు రకాల ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తోంది. అందులో ఒకటి PAI (Personal Accident Insurance). ఇందులో వంద రూపాయల నుంచి 2 వేల రూపాయల వరకు బీమా పాలసీలు ఉన్నాయి. ఈ వ్యక్తిగత ప్రమాద బీమాలో పలు రకాల స్లాబులు ఉన్నాయి. అయితే వీటిలో ఏడాదికి రూ. 2 వేల (అంటే రోజుకు రూ. 6 చొప్పున) ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే వారు ప్రమాద వశాత్తూ మరణిస్తే, నామినీకి 40 లక్షల రూపాయలు చెల్లిస్తారు.
Also Read:Illegal immigrants: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. భారత్పై హక్కుల సంస్థ ఆరోపణలు..
అర్హులు ఎవరు?
ప్రమాదాల్లో సంభవించిన మరణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. సహజ మరణాలను, అనారోగ్య మరణాలను లెక్కలోకి తీసుకోరు. రోడ్డు ప్రమాదాలు, కరెంట్ షాక్, వరదలు, భూకంపాలు, పాము, తేలు కాటు ద్వారా సంభవించే ప్రమాద మరణాలకు మాత్రమే బీమా వర్తిస్తుంది. ఈ బీమాలో చేరడానికి 18 నుంచి 65 ఏళ్ల వయసున్న వారు అర్హులు. పాలసీ క్లెయిమ్ చేసుకోవడానికి మరణం సంభవించిన 90 రోజుల్లోపు వివరాలను బీమా కంపెనీకి నామినీ తెలియజేయాలి. ఘటన జరిగిన 180 రోజుల్లోపు సంబంధిత పత్రాలన్నీ సమర్పించాలి. ఒకవేళ పాలసీదారు ఈ పాలసీని రద్దు చేసుకోవాలని భావిస్తే, లిఖిత పూర్వకంగా నోటిసు ఇస్తే 15 రోజుల్లో పాలసీని రద్దు చేస్తారు. ఈ పాలసీ తీసుకోవాలని భావించేవారు తమ దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని పాలసీలో చేరొచ్చు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..