Real Estate: “పొదుపు మంత్రం” హైదరాబాద్లో సొంతింటి కల.. నెరవేర్చుకోండి ఇలా…
- చాలా మందికి సొంతి ఇళ్లు కట్టుకోవాలనే కల
- సొంతిళ్లు ఉంటే ఆ ధీమానే వేరు
- నైట్ఫ్రాంక్ ఇండియా అఫర్డబులిటీ ఇండెక్స్ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మందికి సొంతి ఇళ్లు కట్టుకోవాలనే కల ఉంటుంది. సొంతిళ్లు ఉంటే ఆ ధీమానే వేరు. మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు అంతా తమ తమ స్థాయిని బట్టి సొంతిళ్లు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటివరకు అద్దెకు ఉన్నావాళ్లు సైతం ఇప్పుడు సొంతింటి కోసం ఆరాట పడుతున్నారు. ఎవరి స్థాయిని బట్టి, వారి బడ్జెట్కు అనుగుణంగా ఎక్కడో ఓ చోటా సొంతిళ్లు కట్టుకోవాలని, లేదా కొనుగోలు చేయాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. హైదరాబాద్ రియాల్టీ మార్కెట్లో ఇళ్ల ధరలు ప్రతి ఎటా పెరుగుతూనే ఉన్నాయి.
ఈ ఏడాది మాత్రం కొంత స్థిరంగా ధరలు…
Also Read
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
కానీ.. ఈ ఏడాది మాత్రం కొంత స్థిరంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మళ్లీ ఒకేసారి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పెరుగుతున్న ధరలకు సంబంధం లేకుండా కొంత మంది కొంటునే ఉన్నారు. వారికెలా సాధ్యమవుతుందని మిగితా వారు తలల పట్టుకుంటున్నారు. కొద్దిగా ఆర్థిక ప్రణాళిక ఉంటే మీరూ సొంతింటివారు కావొచ్చు అని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రణాళికలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. గత పద్నాలుగేళ్ల కిందట నగరం శివార్లలో రూ.20 లక్షలకు వ్యక్తిగత ఇళ్లు వచ్చేది. ఇప్పుడ కొండెక్కిన ధరల కారణంగా ఇప్పుడు అదే ప్రదేశంలో రూ.50-60 లక్షల ధరల్లో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధరలు పలుకుతున్నాయి.
ఇల్లు కొనేందుకు ఆదాయ, ఈఎంఐ నిష్పత్తి ముఖ్యం..
2010లో హైదరాబాద్లో గృహరుణంతో ఇల్లు కొనాలంటే ఆదాయంలో ఈఎంఐ చెల్లింపునకే 47 శాతం పోయేది. అప్పట్లో ఇంటి ధరలు తక్కువ ఉండేవి. ఆదాయం కూడా కనిష్టంగా ఉండేది. కాబట్టి ఎక్కువ మంది కొనలేకపోయారు. 2022 నుంచి 2024 వరకు పరిస్థితులు మారాయి. ఆదాయంలో 30 శాతం ఈఎంఐకి కేటాయించగల్గితే ఇల్లు కొనవచ్చు అని నైట్ఫ్రాంక్ ఇండియా అఫర్డబులిటీ ఇండెక్స్ చెబుతోంది. అధ్యయణాల ప్రకారమే ఈ వివరాలు వెల్లడించింది. పెరిగిన ధరల నేపథ్యంలో వ్యక్తిగత ఇల్లు కంటే.. ఫ్లాట్ కే మొగ్గుచూపుతున్నారు.
కొవిడ్ అనంతరం 2021లో వడ్డీరేట్లు తగ్గడంతో ఈఎంఐ భారం క్షీణించింది. ఆదాయంలో 28 శాతం ఈఎంఐ చెల్లించగలిగి స్థోమత కల్గినవారు ఇల్లు కొన్నారు. స్థలాలు కూడా సొంత చేసుకున్నారు. ఆ సమయంలో ధరలు పెరిగినా ధైర్యం చేసి కొన్నారు. ఇప్పుడు వడ్డీరేట్లు 9 శాతం పైనే ఉండటంతో పలువురు భారంగా భావిస్తున్నారు. అయినా సరే 30 శాతం ఈఎంఐ కోసం కేటాయించగల్గితే ఇల్లు కొనుగోలు సాధ్యమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి నుంచే మీ ఆదాయంలో 30శాతం ఈఎంఐకి కేటాయించి ఇళ్లు కొనుగోలు చేయండి..
తాజావార్తలు
-
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
-
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
-
JanaNayagan : జననాయగన్ మరోసారి సెన్సార్.. అదనంగా మరో 41 సెకండ్స్
-
FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!