Real Estate: “పొదుపు మంత్రం” హైదరాబాద్లో సొంతింటి కల.. నెరవేర్చుకోండి ఇలా…
- చాలా మందికి సొంతి ఇళ్లు కట్టుకోవాలనే కల
- సొంతిళ్లు ఉంటే ఆ ధీమానే వేరు
- నైట్ఫ్రాంక్ ఇండియా అఫర్డబులిటీ ఇండెక్స్ సూచన
చాలా మందికి సొంతి ఇళ్లు కట్టుకోవాలనే కల ఉంటుంది. సొంతిళ్లు ఉంటే ఆ ధీమానే వేరు. మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు అంతా తమ తమ స్థాయిని బట్టి సొంతిళ్లు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటివరకు అద్దెకు ఉన్నావాళ్లు సైతం ఇప్పుడు సొంతింటి కోసం ఆరాట పడుతున్నారు. ఎవరి స్థాయిని బట్టి, వారి బడ్జెట్కు అనుగుణంగా ఎక్కడో ఓ చోటా సొంతిళ్లు కట్టుకోవాలని, లేదా కొనుగోలు చేయాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. హైదరాబాద్ రియాల్టీ మార్కెట్లో ఇళ్ల ధరలు ప్రతి ఎటా పెరుగుతూనే ఉన్నాయి.
ఈ ఏడాది మాత్రం కొంత స్థిరంగా ధరలు…
Also Read
కానీ.. ఈ ఏడాది మాత్రం కొంత స్థిరంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మళ్లీ ఒకేసారి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పెరుగుతున్న ధరలకు సంబంధం లేకుండా కొంత మంది కొంటునే ఉన్నారు. వారికెలా సాధ్యమవుతుందని మిగితా వారు తలల పట్టుకుంటున్నారు. కొద్దిగా ఆర్థిక ప్రణాళిక ఉంటే మీరూ సొంతింటివారు కావొచ్చు అని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రణాళికలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. గత పద్నాలుగేళ్ల కిందట నగరం శివార్లలో రూ.20 లక్షలకు వ్యక్తిగత ఇళ్లు వచ్చేది. ఇప్పుడ కొండెక్కిన ధరల కారణంగా ఇప్పుడు అదే ప్రదేశంలో రూ.50-60 లక్షల ధరల్లో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధరలు పలుకుతున్నాయి.
ఇల్లు కొనేందుకు ఆదాయ, ఈఎంఐ నిష్పత్తి ముఖ్యం..
2010లో హైదరాబాద్లో గృహరుణంతో ఇల్లు కొనాలంటే ఆదాయంలో ఈఎంఐ చెల్లింపునకే 47 శాతం పోయేది. అప్పట్లో ఇంటి ధరలు తక్కువ ఉండేవి. ఆదాయం కూడా కనిష్టంగా ఉండేది. కాబట్టి ఎక్కువ మంది కొనలేకపోయారు. 2022 నుంచి 2024 వరకు పరిస్థితులు మారాయి. ఆదాయంలో 30 శాతం ఈఎంఐకి కేటాయించగల్గితే ఇల్లు కొనవచ్చు అని నైట్ఫ్రాంక్ ఇండియా అఫర్డబులిటీ ఇండెక్స్ చెబుతోంది. అధ్యయణాల ప్రకారమే ఈ వివరాలు వెల్లడించింది. పెరిగిన ధరల నేపథ్యంలో వ్యక్తిగత ఇల్లు కంటే.. ఫ్లాట్ కే మొగ్గుచూపుతున్నారు.
కొవిడ్ అనంతరం 2021లో వడ్డీరేట్లు తగ్గడంతో ఈఎంఐ భారం క్షీణించింది. ఆదాయంలో 28 శాతం ఈఎంఐ చెల్లించగలిగి స్థోమత కల్గినవారు ఇల్లు కొన్నారు. స్థలాలు కూడా సొంత చేసుకున్నారు. ఆ సమయంలో ధరలు పెరిగినా ధైర్యం చేసి కొన్నారు. ఇప్పుడు వడ్డీరేట్లు 9 శాతం పైనే ఉండటంతో పలువురు భారంగా భావిస్తున్నారు. అయినా సరే 30 శాతం ఈఎంఐ కోసం కేటాయించగల్గితే ఇల్లు కొనుగోలు సాధ్యమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి నుంచే మీ ఆదాయంలో 30శాతం ఈఎంఐకి కేటాయించి ఇళ్లు కొనుగోలు చేయండి..
తాజావార్తలు
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
-
Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..
-
US-China AI Tech War: మక్కీకి మక్కీ కాపీ.. చైనా AI లపై అమెరికా నిఘా!
-
Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
-
AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!