Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్ కానిస్టేబుల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: ప్రస్తుతం టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ వార్త వైరల్ అవుతోంది. అదే తమిళనాడులో తొమ్మిది మంది పోలీసులకు ఉరి శిక్ష విధించిన వార్త. సాత్తాన్కుళం లాకప్ డేత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తండ్రి కొడుకులను లాకప్లో చిత్రహింసలు పెట్టి చంపిన కేసులో 9 మంది పోలీస్ అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే.. ఈ సాత్తాన్కుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది తోటి పోలీసులకు ఉరి శిక్ష పడటానికి ప్రధాన కారణం హెడ్ కానిస్టేబుల్ రేవతి. ఈ లాకప్ మరణాలు బయటకు తెచ్చిన కీలక సూత్రదారి రేవతి. ఈ ఘటన జరిగిన వెంటనే ఇది బయకు పొక్కకూడదని పోలీసులు అందరూ మాట్లాడుకున్నారు. సాక్ష్యాలను తుడిచేయాలి, కథను మార్చేశారు. ఇలాంటి సమయంలో చాలా మంది పోలీసులు సైలెంట్గా ఉండటాన్నే సేఫ్గా భావిస్తారు. కానీ రేవతి ఆ ఆప్షన్ తీసుకోలేదు. కేవలం డ్యూటీ మాత్రమే చేయాలని కాకుండా తన కళ్లముందు జరిగిన దారుణానికి స్పందించాలని తన హృదయం పరితపించింది.
READ MORE: RK Roja: రేవంత్రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!
Also Read
ఒకవైపు తొటి సిబ్బంది ఒత్తిడి, మరోవైపు ఉన్నతాధికారులు ఆంక్షల మధ్య ఈ విషయాన్ని బయటకు తీసుకురావాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని రేవతి భీష్మించుకుంది. ఆమె మేజిస్ట్రేట్ ముందు చెప్పిన ప్రతి విషయం కేసు దిశనే మార్చింది. రేవతి కేవలం ఒక స్టేట్మెంట్ కాదు.. ఆ రాత్రి జరిగిన వాస్తవాన్ని కళ్ల ఎదుటే చూయించింది. పోలీసులు స్టేషన్ను శుభ్రం చేసి సాక్ష్యాలను తుడిచివేసినా, ఆమె అత్యంత చాకచక్యంగా గోడల మూలల్లో టేబుళ్ల కింద మిగిలిపోయిన రక్తపు మరకలను గుర్తించి మేజిస్ట్రేట్కు చూపించింది. ఈ రక్తపు చుక్కలే నిందితుల నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించడంలో ప్రధాన భూమిక పోషించాయి. సీసీటీవీ ఫుటేజీని మాయం చేసినా, ఆమె తన జ్ఞాపకశక్తితో సంఘటనలు జరిగిన సమయాలను పూసగుచ్చినట్లు వివరించి దర్యాప్తునకు దిక్సూచిలా నిలిచింది. ఇది సాధారణ విషయం కాదు. పోలీసుగా విధులు నిర్వర్తిస్తూ పోలీసులకే వ్యతిరేకంగా శిక్షపడేలా చేసింది. చివరికి బాధితులకు న్యాయం జరిగేలా చేసింది.ఇలాంటి పోలీసులను అభినందించక తప్పదు. “పోలీసమ్మ నీకు సెల్యూట్”.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!