Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్ కానిస్టేబుల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: ప్రస్తుతం టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ వార్త వైరల్ అవుతోంది. అదే తమిళనాడులో తొమ్మిది మంది పోలీసులకు ఉరి శిక్ష విధించిన వార్త. సాత్తాన్కుళం లాకప్ డేత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తండ్రి కొడుకులను లాకప్లో చిత్రహింసలు పెట్టి చంపిన కేసులో 9 మంది పోలీస్ అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే.. ఈ సాత్తాన్కుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది తోటి పోలీసులకు ఉరి శిక్ష పడటానికి ప్రధాన కారణం హెడ్ కానిస్టేబుల్ రేవతి. ఈ లాకప్ మరణాలు బయటకు తెచ్చిన కీలక సూత్రదారి రేవతి. ఈ ఘటన జరిగిన వెంటనే ఇది బయకు పొక్కకూడదని పోలీసులు అందరూ మాట్లాడుకున్నారు. సాక్ష్యాలను తుడిచేయాలి, కథను మార్చేశారు. ఇలాంటి సమయంలో చాలా మంది పోలీసులు సైలెంట్గా ఉండటాన్నే సేఫ్గా భావిస్తారు. కానీ రేవతి ఆ ఆప్షన్ తీసుకోలేదు. కేవలం డ్యూటీ మాత్రమే చేయాలని కాకుండా తన కళ్లముందు జరిగిన దారుణానికి స్పందించాలని తన హృదయం పరితపించింది.
READ MORE: RK Roja: రేవంత్రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఒకవైపు తొటి సిబ్బంది ఒత్తిడి, మరోవైపు ఉన్నతాధికారులు ఆంక్షల మధ్య ఈ విషయాన్ని బయటకు తీసుకురావాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని రేవతి భీష్మించుకుంది. ఆమె మేజిస్ట్రేట్ ముందు చెప్పిన ప్రతి విషయం కేసు దిశనే మార్చింది. రేవతి కేవలం ఒక స్టేట్మెంట్ కాదు.. ఆ రాత్రి జరిగిన వాస్తవాన్ని కళ్ల ఎదుటే చూయించింది. పోలీసులు స్టేషన్ను శుభ్రం చేసి సాక్ష్యాలను తుడిచివేసినా, ఆమె అత్యంత చాకచక్యంగా గోడల మూలల్లో టేబుళ్ల కింద మిగిలిపోయిన రక్తపు మరకలను గుర్తించి మేజిస్ట్రేట్కు చూపించింది. ఈ రక్తపు చుక్కలే నిందితుల నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించడంలో ప్రధాన భూమిక పోషించాయి. సీసీటీవీ ఫుటేజీని మాయం చేసినా, ఆమె తన జ్ఞాపకశక్తితో సంఘటనలు జరిగిన సమయాలను పూసగుచ్చినట్లు వివరించి దర్యాప్తునకు దిక్సూచిలా నిలిచింది. ఇది సాధారణ విషయం కాదు. పోలీసుగా విధులు నిర్వర్తిస్తూ పోలీసులకే వ్యతిరేకంగా శిక్షపడేలా చేసింది. చివరికి బాధితులకు న్యాయం జరిగేలా చేసింది.ఇలాంటి పోలీసులను అభినందించక తప్పదు. “పోలీసమ్మ నీకు సెల్యూట్”.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..