Sankranti Rush: అప్పుడే సంక్రాంతి రష్..! బస్సులు, రైళ్లన్నీ ఫుల్..
- అప్పుడే సంక్రాంతి రష్..
- బస్సులు, రైళ్లలో రిజర్వేషన్ పూర్తి.. స్పెషల్స్ వేస్తేనే సీట్లు..
- రద్దీ దృష్ట్యా 1,400 స్పెషల్స్ నడపాలని ఆర్టీసీ నిర్ణయం..
- రైళ్లలో భారీగా పెరిగిపోతున్న వెయిటింగ్ లిస్ట్..
- క్రిస్మస్ తర్వాత స్పెషల్ రైళ్లపై నిర్ణయం..
- విమానాల్లో రిజర్వేషన్ చేసుకుంటున్న టెక్కీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranti Rush: సంక్రాంతి పండగ దగ్గరపడుతుండటంతో విజయవాడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లు, బస్సుల్లో భారీ రష్ మొదలైంది. పండుగకు కనీసం రెండు వారాల ముందు నుంచే రాకపోకలపై విపరీతమైన డిమాండ్ పెరగడంతో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి.
సంక్రాంతి సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడంతో, జనవరి 10 నుంచి 14 వరకు అన్ని రైళ్లలో సీట్లు పూర్తిగా బుక్ అయిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. జనవరి 15, 16 తేదీల్లో మాత్రమే కొన్ని సీట్లు అందుబాటులో ఉండగా, 17, 18, 19 తేదీల్లో తిరిగి పూర్తి హౌస్ఫుల్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో స్పెషల్ రైళ్లను నడిపితే మాత్రమే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. క్రిస్మస్ తర్వాత స్పెషల్ రైళ్లపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Also Read
ఆర్టీసీ బస్సుల్లో క్రేజ్
రైళ్ల పరిస్థితికి భిన్నంగా లేకుండా, ఆర్టీసీ బస్సుల్లో కూడా భారీగా రిజర్వేషన్లు జరిగిపోయాయి. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు వెళ్లే బస్సుల్లో అన్ని సీట్లు బుక్ అయిపోయాయి. ఏసీ బస్సుల్లో సీట్లు ఒక్కటీ అందుబాటులో లేవు. నాన్-ఏసీ బస్సుల్లో కూడా 30% మేర రిజర్వేషన్ పూర్తయింది. మరికొన్ని రోజుల్లో ఇవి కూడా పూర్తిగా బుక్ అయ్యే అవకాశం ఉంది.
1,400 స్పెషల్ బస్సులు సిద్ధం
సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ఈసారి రికార్డు స్థాయిలో 1,400 స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించారు. గత సంవత్సరం నడపిన 1,300 స్పెషల్స్ కంటే ఇది 100 బస్సులు ఎక్కువ.
విమాన ప్రయాణాల హల్చల్
హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో పనిచేస్తున్న టెకీలు ఇప్పటికే రెండు నెలల ముందే విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో సంక్రాంతి సీజన్లో విమాన ప్రయాణాలకూ భారీ డిమాండ్ నెలకొంది.
ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్న ప్రజలు
రైళ్లు, బస్సుల్లో సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్న అనేక మంది చివరికి ప్రైవేట్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఈసారి హైదరాబాద్ నుంచి విజయవాడ దిశగా పెద్ద మొత్తంలో క్యాబ్లు, ట్యాక్సీలు రద్దీగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్లో క్యాబ్లు కూడా దొరకకపోవడంతో కొందరు నేరుగా తమ సొంత ఊర్లకు ఫోన్ చేసి, విజయవాడ నుంచి వాహనాలు పంపించమని అడుగుతున్న పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?