Sandeshkhali: రాష్ట్రపతిని కలిసిన సందేశ్ఖాలీ బాధితులు.. ఏం విజ్ఞప్తి చేశారంటే..!
సందేశ్ఖాలీ బాధితులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో బాధితులు కలిసి తమ ఆవేదనను రాష్ట్రపతికి వివరించారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. సందేశ్ఖాలీలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సమాజాన్ని కాపాడేందుకు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని బాధితులు కోరారు.
ఎస్సీ, ఎస్టీ సపోర్ట్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పార్థ బిస్వాస్తో కలిసి సందేశ్ఖాలీ బాధితులైన మహిళలు రాష్ట్రపతిని కలిశారు. బాధితులు ముర్ముకు మెమోరాండం సమర్పించినట్లు పార్థ బిస్వాస్ తెలిపారు.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
రాష్ట్రపతి చాలా సానుభూతితో బాధితుల ఆవేదనను తెలుసుకున్నారని పార్థ బిస్వాస్ పేర్కొన్నారు. విషయం తెలుసుకుని ముర్ము చాలా బాధపడ్డారని తెలిపారు. రాష్ట్రపతిని కలిసేందుకు ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఢిల్లీకి వచ్చారని చెప్పుకొచ్చారు.
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో ఉన్న బీద కుటుంబాలను రక్షించడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని బాధితులు లేఖలో పేర్కొన్నారు. తీవ్ర అన్యాయానికి గురవుతున్నట్లు రాష్ట్రపతికి అందజేసిన మెమోరాండంలో పేర్కొన్నారు.
గత కొంతకాలంగా సందేశ్ఖాలీ ప్రాంతం ఆందోళనలతో అట్టుడికింది. తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్, అతని అనుచరులు భూకబ్జా, లైంగిక వేధింపులకు గురి చేశారంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వీరికి మద్దతుగా బీజేపీ నేతలు కూడా నిరసనలు చేపట్టారు.

షాజహాన్ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కాపాడుతున్నారంటూ పెద్ద ఎత్తన విమర్శలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక హైకోర్టు జోక్యంతో నిందితుడు షాజహాన్ను సీబీఐకి పోలీసులు అప్పగించారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ ఇటీవల పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మోడీని బాధిత మహిళలు కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుని ఆవేదన చెందారు. దీంతో వారి బాధలు విని కలత చెందారు. తాజాగా ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి మొర్ర పెట్టుకున్నారు. న్యాయం చేస్తానని ద్రౌపది ముర్ము హామీ ఇచ్చారు.
#WATCH | Delhi | Sandeshkhali incident | Dr. Partha Biswas, Director of the Center for SC/ST Support and Research says, "They (victims) are being identified and threatened that when the media would not be around them and Sheikh Shahjahan would return, what would happen to… pic.twitter.com/J6YCo92Ass
— ANI (@ANI) March 15, 2024
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!