Sandeshkhali: సందేశ్ఖాలీ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థికి భారీ భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లోని బసిర్హాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రేఖా పాత్రకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత కల్పించింది. సందేశ్ఖాలీలో షేక్ షాజహాన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు రేఖా పాత్ర నాయకత్వం వహించింది. ఇప్పుడు ఆమెకు ‘ఎక్స్-కేటగిరీ’ భద్రత కల్పించారు. అలాగే, బీజేపీ కూడా రేఖ పాత్రను బసిర్హత్ లోక్సభ స్థానం నుంచి పోటీలో నిలిపింది. రేఖకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కమాండోలు రక్షణ కల్పిస్తారు.
Read Also: Osmania University: మే నెల మొత్తం ఓయూ బంద్.. చీఫ్ వార్డెన్ నోటీస్..
Also Read
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
- Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
కాగా, లోక్సభ ఎన్నికల చివరి దశ జూన్ 1వ తేదీన బసిర్హత్ లో పోలింగ్ జరగనుంది. సిట్టింగ్ ఎంపీ, బెంగాలీ నటి నుస్రత్ జహాన్ స్థానంలో నామినేట్ చేయబడిన తృణమూల్ కాంగ్రెస్కు చెందిన హాజీ నూరుల్ ఇస్లామ్పై రేఖా పాత్ర పోటీ చేయబోతుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో రేఖ పాత్రకు ముప్పు ఉందని పేర్కొనడంతో ఆమెకు ‘ఎక్స్-కేటగిరీ’ భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రేఖ పాత్రతో పాటు మరో ఐదుగురు బీజేపీ నేతలకు కూడా హోం శాఖ భద్రత కేటాయించింది.
Read Also: Amit Shah : అమిత్ షా ఫేక్ వీడియో.. తెలంగాణ కాకుండా మరో రెండు రాష్ట్రాల్లో దర్యాప్తు
ఇక, ఝర్గ్రామ్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న ప్రణత్ తుడుతో పాటు బహరంపూర్ నుంచి నిర్మల్ సాహా, జయనగర్ నుంచి అశోక్ కందారీ, మధురాపూర్ నుంచి అశోక్ పుర్కైత్లకు ‘ఎక్స్-కేటగిరీ’ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రత్వ శాఖ తెలిపింది. కాగా, రాయ్గంజ్ బీజేపీ అభ్యర్థి కార్తీక్ పాల్కు ‘వై కేటగిరీ’ భద్రతను కేటాయింది. ఈ నెల ప్రారంభంలో లోక్సభ ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లోని బీజేపీ నేతలకు కేంద్ర హోంశాఖ భద్రతను కల్పించింది. అయితే, ప్రస్తుతం 100 మందికి పైగా బీజేపీ నేతలకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్లోకి మీకూ ఎంట్రీ!
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!