Samineni Udayabhanu: కోట శ్రీనివాసరావు హీరో అవ్వాలనుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన మాజీ ఎమ్మెల్యే!
- ఈనెల 13న కోట శ్రీనివాసరావు మృతి
- కోట శ్రీనివాసరావును గుర్తుచేసుకున్న మాజీ ఎమ్మెల్యే
- ఆసక్తికర విషయం పంచుకున్న సామినేని ఉదయభాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EX MLA Samineni Udayabhanu on Kota Srinivasa Rao: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈనెల 13న ఫిల్మ్నగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు. 40 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ కలిగిన కోట శ్రీనివాసరావును అందరూ గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సినీ రంగానికి కోట చేసిన సేవలను ప్రశంసించారు. కోట శ్రీనివాసరావు గురించి ఓ ఆసక్తికర విషయంను పంచుకున్నారు. పద్మశ్రీ కోట శ్రీనివాసరావుకి హోటల్ ఐలాపురంలో సంతాప సభ ఏర్పాటు చేశారు.
కోట శ్రీనివాసరావు హీరోగా రావాలనుకున్నారని, అప్పటికే ఆయనకు 40 సంవత్సరాలు దాటడంతో కుదరలేదని మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సంతాప సభలో తెలిపారు. ఈరోజు విజయవాడలో సామినేని ఉదయభాను మాట్లాడుతూ… ‘కోట శ్రీనివాసరావు గారు ఈ పక్కనే ఉన్న కంకిపాడులో జన్మించారు. నాటక రంగంలో బాగా రాణించిన వ్యక్తి. 1978లో సినీ రంగంలో ప్రవేశించారు. సుమారు 40 సంవత్సరాలు పాటు చలనచిత్ర రంగంలో మరిచిపోలేని వ్యక్తిగా నటించారు. కోట గారు హీరోగా రావాలనుకున్నారు. 40 సంవత్సరాలు దాటింది కాబట్టి 1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో వెండితెర మీద కనిపించారు’ అని చెప్పారు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
Also Read: Prasanna Kumar Reddy: నేను కాదు.. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డే నాపై ఆరోపణలు చేశారు!
‘తెలుగులోనే కాదు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఐదు భాషల్లో కోట శ్రీనివాసరావు సుమారు 750 చిత్రాల్లో నటించారు. విలన్ పాత్రకు నిజంగానే ప్రాణం పోసేవారు. కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం తెలుగు పరిశ్రమ చేసుకున్న అదృష్టం. కోట గారి జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా జరిగిందంటే.. ఆయన కుమారుడిని కోల్పోవడం. పలుమార్లు చాలా మందితో ఆయన చర్చించిన అంశం ఏదైనా ఉంది అంటే.. తన కుమారుడు అకాల మరణం గురించి మాత్రమే’ అని సామినేని ఉదయభాను తెలిపారు. కోట కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కోట కెరీర్ ఆరంభంలో సహాయనటుడు, ప్రతి నాయకుడిగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..