Samajika Sadhikara Bus Yatra: నేడు 10వ రోజుకు చేరిన సామాజిక సాధికార బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే..!
వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ దొరుకుతుంది. నేడు 10వ రోజు బస్సుయాత్రలో భాగంగా రాయలసీమలో ఆళ్లగడ్డ, కోస్తాంధ్రాలో వినుకొండ, ఉత్తరాంధ్రాలో ఆముదాలవలసలో ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్రెడ్డి సారథ్యంలో బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో ప్రెస్ మీట్.. అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ బైక్ ర్యాలీ చేయనపున్నారు. ఇక, సాయంత్రం 4 గంటలకు వైసీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
Also Read
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
ఇక, పల్నాడు జిల్లాలోని వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ సామాజికి సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లిలో సుజికీ కార్ షోరూమ్ దగ్గర మధ్యాహ్నం 2 గంటలకు వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అనంతరం మధ్యహ్నం 3 గంటలకు కార్యకర్తలో కలిసి పార్టీ నేతలు పాదయాత్ర చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు శివయ్య స్థూపం సెంటర్ దగ్గర వైసీపీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Read Also: Bhakthi TV : మంగళవారం హనుమాన్ చాలీసా వింటే అపార శక్తిని పొంది అనుకున్నవన్నీ సాధిస్తారు
అలాగే, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఎమ్మెల్యే తమ్మినేని సీతారం వైసీపీ సామాజిక సాధికార యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు వాకలవలస వద్ద శ్రీ ఆంజనేయ స్వామి కళ్యాణ మండపంలో సామాజిక సాధికార యాత్రలో మంత్రులు పత్రికా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భోజనం విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గేటు పాఠశాలలో మనబడి నాడు నేడు పాఠశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఆమదాలవలస వైఎస్ఆర్ కూడలి దగ్గర ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆముదాలవలస బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సభాస్థలికి చేరుకొని అశేష జనవాహినికి మంత్రుల ప్రసంగాలు చేయనున్నారు.
తాజావార్తలు
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో