Samajika Sadhikara Bus Yatra: నేడు 10వ రోజుకు చేరిన సామాజిక సాధికార బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ దొరుకుతుంది. నేడు 10వ రోజు బస్సుయాత్రలో భాగంగా రాయలసీమలో ఆళ్లగడ్డ, కోస్తాంధ్రాలో వినుకొండ, ఉత్తరాంధ్రాలో ఆముదాలవలసలో ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్రెడ్డి సారథ్యంలో బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో ప్రెస్ మీట్.. అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ బైక్ ర్యాలీ చేయనపున్నారు. ఇక, సాయంత్రం 4 గంటలకు వైసీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ఇక, పల్నాడు జిల్లాలోని వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ సామాజికి సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లిలో సుజికీ కార్ షోరూమ్ దగ్గర మధ్యాహ్నం 2 గంటలకు వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అనంతరం మధ్యహ్నం 3 గంటలకు కార్యకర్తలో కలిసి పార్టీ నేతలు పాదయాత్ర చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు శివయ్య స్థూపం సెంటర్ దగ్గర వైసీపీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Read Also: Bhakthi TV : మంగళవారం హనుమాన్ చాలీసా వింటే అపార శక్తిని పొంది అనుకున్నవన్నీ సాధిస్తారు
అలాగే, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఎమ్మెల్యే తమ్మినేని సీతారం వైసీపీ సామాజిక సాధికార యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు వాకలవలస వద్ద శ్రీ ఆంజనేయ స్వామి కళ్యాణ మండపంలో సామాజిక సాధికార యాత్రలో మంత్రులు పత్రికా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భోజనం విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గేటు పాఠశాలలో మనబడి నాడు నేడు పాఠశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఆమదాలవలస వైఎస్ఆర్ కూడలి దగ్గర ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆముదాలవలస బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సభాస్థలికి చేరుకొని అశేష జనవాహినికి మంత్రుల ప్రసంగాలు చేయనున్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!