Sajjala Ramakrishna Reddy: జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమానికి జగన్ పిలుపు..
- ఎవరూ ప్రశ్నించకుండా హింసాకాండ క్రియేట్ చేస్తున్నారు..
- గతంలో మామకు వెన్నుపోటు పొడిచారు..
- ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ పొడుస్తున్నారు..
- వెన్నుపోటుకు పేటెంట్ అంటే చంద్రబాబే
- వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అరాచక, మోసపూరిత పాలనకు జూన్ 4కు ఏడాది అవుతుందని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రశ్నించే గొంతులు లేవకుండా భయోత్పాతాన్ని సృష్టించిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఉండదన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది లోనే 95 శాతం హామీలు అమలు చేశారని కొనియాడారు. ఏడాదిలో ఎంత విధ్వంసం చేయాలో చంద్రబాబు చూపించారని ఎద్దేవా చేశారు.. అధికారం చేతిలో ఉంటే ఎన్ని దాడులు చేయొచ్చనేది చేసి చూపించారన్నారు.
READ MORE: CM Chandrababu: కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నాం..!
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు పీ4 అంటున్నారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. ఎవర్నో తీసుకువస్తాను.. మీరు మీరు చూసుకోండి అంటున్నారని.. ఈ మధ్య మరీ బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. ఎవరూ ప్రశ్నించకుండా హింసాకాండ క్రియేట్ చేస్తున్నారన్నారు.. గతంలో మామకు వెన్నుపోటు పొడిచారు.. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ పొడుస్తున్నారని విమర్శించారు.. వెన్నుపోటుకు పేటెంట్ అంటే చంద్రబాబే గుర్తుకు వస్తారన్నారు.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబు పాలనకు నిరసనగా జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమానికి జగన్ పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రతీ జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు..
READ MORE: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్లో భారత్ “ఘన విజయం”.. అమెరికా సైనిక నిపుణుడు..
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!