Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Sajjala Ramakrishna Reddy Press Meet Over Ap Elections

Sajjala Ramakrishna Reddy: కుప్పంలో కూడా మేం గెలవబోతున్నాం.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి చక్కటి ఫలితాలు..!

Published Date :May 17, 2024 , 2:33 pm
By Sudhakar Ravula
Sajjala Ramakrishna Reddy: కుప్పంలో కూడా మేం గెలవబోతున్నాం.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి చక్కటి ఫలితాలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sajjala Ramakrishna Reddy: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి.. కుప్పంలో కూడా మేం గెలవబోతున్నాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీస్ అబ్జర్వర్ అధికారులను, పోలీసులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పాలన ఈసీ పరిధిలో ఉంది కాబట్టి.. టీడీపీ తన ఏజెంట్లను నియమించుకుంది. అధికారులను.. వ్యవస్ధలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలనేది చంద్రబాబు నైజం అని దుయ్యబట్టారు. మేం స్ట్రయిట్ గా ఉంటాం. అధికారుల సాయంతో మేం అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తాం. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాను మారిస్తే.. అంతా దారిలోకి వస్తుందన్నారు. కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతాయని మేం అనుకోవడం లేదన్నారు. ఒకవేళ అలాంటివి జరిగినా మేం ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.

మాది చాలా బలమైన పార్టీ.. టెక్నికల్‌గా మేం అధికారంలో ఉన్నా.. ప్రాక్టీకలుగా మేం అధికారంలో లేనట్టే అన్నారు సజ్జల.. అయితే, ఈసీ నిష్పాక్షింగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరిస్తే పొలిటికల్ వయొలెన్స్ అనేదే జరగదన్నారు. ప్రజలు చాలా ఉత్సాహంతో పోలింగులో పాల్గొన్నారు. మహిళలు చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం మాకు శుభ సూచికంగా వెల్లడించిన ఆయన.. కుప్పంలో మేం గెలవబోతున్నాం. రాష్ట్రం అంతా వైసీపీకి చక్కటి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జగన్ పాలనకు అనుకూలంగా ఓట్లు వెల్లువెత్తాయి. బస్సుల్లో వచ్చి ఓట్లేసిన వాళ్లంతా జగన్ సంక్షేమ పథకాల లబ్దిదారులే అన్నారు. మేం ఎవర్నీ భ్రమలో పెట్టాల్సిన అవసరం లేదు. పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత వల్లే అనుకుంటారు.. కానీ, ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పుడు కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు.

వాళ్లిచ్చిన హామీలను కూడా చంద్రబాబు ప్రచారం చేసుకోలేదని ఎద్దేవా చేశారు సజ్జల.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్‌ను విమర్శించడంతోనే ఎన్నికల్లో చంద్రబాబు లబ్ది పొందే ప్రయత్నం చేశారన్న ఆయన.. ప్రజలు వైసీపీని ఓన్ చేసుకున్నారు. మామూలుగా అయితే చంద్రబాబు ఈపాటికే బయటకు వచ్చేవారు. తమ ఓటమి ఖాయమని చంద్రబాబుకు కూడా అర్థమైందని వ్యాఖ్యానించారు. అధికారుల మీద.. పోలీసుల మీద ఫిర్యాదులు చేయొచ్చు.. కానీ, ఎవర్ని నియమించాలో కూడా కూటమి నేతలే చెప్పారు. కూటమి ఏర్పడినప్పుడే చంద్రబాబుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని మేం భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈసీ తప్పును సరిదిద్దుకోవడం మంచిదని సూచించారు. ఎక్కడైతే అధికారులను మార్చారో.. అక్కడే గొడవలు జరిగాయి. ఈ-ఆఫీసు మార్చొద్దని చంద్రబాబు లేఖలు రాస్తున్నారు. తానేదో అధికారంలోకి వస్తున్నారనే ఇంఫ్రెషన్‌ క్రియేట్ చేస్తున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబు తన గురించి తానేం అనుకుంటున్నారో అర్థం కావడం లేదు.

ఇక, తాడిపత్రి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు సజ్జల.. అవసాన దశలో కూడా చంద్రబాబు.. టీడీపీ పద్దతి మారలేదన్న ఆయన.. గతంలో ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ గురించి పదే పదే మాట్లాడారు.. ఇప్పుడు మాట్లాడడం లేదు. దీనిపై ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల టీడీపీకే నెగెటీవ్ అయ్యిందన్నారు. తాను చేసిన తప్పుడు ప్రచారం ఫలితం జూన్ 4వ తేదీన తెలుస్తుంది. ఏపీ చేసిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మంచిదని నీతి ఆయోగ్ కూడా చెప్పిందని గుర్తుచేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • sajjala ramakrishna reddy
  • YSRCP

తాజావార్తలు

  • PM Narendra Modi: ఉగాది శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోదీ

  • JR. NTR : యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. టోని మరోసారి వస్తున్నాడు..

  • Pre Wedding Shoot: ముదురుతున్న పిచ్చి.. ఫ్రీ-వెడ్డింగ్ షూటింగ్ కోసం ఓ జంట ఎంత పని చేసిందంటే..!

  • Couvade syndrome: మగాళ్లకు కూడా గర్భం.. సైంటిస్టులు తేల్చిన సంచలన నిజం!

  • Ugadi 2026-YS Jagan: ఉగాది వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ దంపతులు!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions