CM Jagan: చంద్రబాబు లాంటి నేతల వల్లే మేనిఫెస్టోకు విలువ ఉండటం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు వ్యవసాయం, అనుబంధ రంగాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. గత 40 నెలల్లో వ్యవసాయ రంగంలో రూ.1,28,634 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. గత మూడేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని.. సగటున 167.99 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని వెల్లడించారు. రైతు భరోసా ద్వారా 52 లక్షల 38 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామన్నారు. రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు అందించామని పేర్కొన్నారు. ఏ సీజన్లో జరిగిన పంట నష్టాన్ని ఆ సీజన్లోనే చెల్లిస్తున్నామని.. దేశంలో ఎక్కడా లేనివిధంగా వాస్తవ సాగుదారులకే బీమా రక్షణ కల్పిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. గత మూడేళ్లలో ఒక్క మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కరవు ఉండేదని.. కరవు, చంద్రబాబు ఇద్దరూ కవలలు అని జగన్ ఎద్దేవా చేశారు.
తన హయాంలో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చెరువులు, వాగులు, వంకలు కళకళలాడుతున్నాయని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో ఐదు ప్రధాన నదులు పరవళ్లు తొక్కుతున్నాయని… కృష్ణా, గోదావరి డెల్టాలతో పాటు రాయలసీమ, రైతులకు అత్యధికంగా సాగునీరు అందుతుందన్నారు. గత మూడేళ్లలో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు. సగటున 13.29 లక్షల టన్నుల దిగుబడి పెరిగిందని.. వైసీపీ హయాంలో రైతులే కాదు.. రైతు కూలీలూ సంతోషంగా ఉన్నారన్నారు. ఆర్బీకేలతో వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. ఈ మూడేళ్లలో 98.4 శాతం హామీలు అమలు చేశామని జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో రైతులకు బీమా పరిహారం అందలేదని ఆరోపించారు. సున్నా వడ్డీ కింద నేరుగా రైతుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తున్నామని.. రైతులకు వడ్డీ రాయితీ నవంబర్లో అందిస్తామని చెప్పారు. గత మూడేళ్లలో 65.65 లక్షల మంది రైతులకు రూ.1,282 కోట్లు చెల్లించామన్నారు. బాబు పెట్టిన బకాయిలు రైతులకు తామే చెల్లించామని పేర్కొన్నారు. రుణమాఫీపై చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చారని.. రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని వాగ్ధానం చేశారని… రుణమాఫీ చేయకుండా ఆయన రైతులను దగా చేశారని విమర్శించారు. చివరికి రైతులకు సున్నా వడ్డీని కూడా ఎగ్గొట్టారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి నాయకుల వల్లే మేనిఫెస్టోకు విలువ లేకుండా పోతోందని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Nara Lokesh: వాయిదాపడే ప్రసక్తే లేదు.. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి!
Read Also:Team India: టీమిండియా చెత్త రికార్డు.. ఒకే ఏడాదిలో రెండు సార్లు..!!
రైతు భరోసా కేంద్రాల పరిధిలోకి కిసాన్ డ్రోన్లను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని… రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మోటార్లకు మీటర్లపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని.. ఎక్కడా ఏ రైతు నుంచి రూపాయి వసూలు చేయలేదన్నారు. మోటార్లకు మీటర్లతో నాణ్యమైన విద్యుత్ అందించగలమని పేర్కొన్నారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అండగా ఉంటున్నామని జగన్ చెప్పారు. అటు ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సాయం అందిస్తున్నామని… రైతుల కుటుంబాలకు పరిహారం రూ.7 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్నామని వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Mallu Ravi : కొండా సురేఖ వ్యవహారంపై మల్లు రవి సంచలన వ్యాఖ్యలు
-
Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
-
Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
-
El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!