Abhilash Tomy: చరిత్ర సృష్టించిన సెయిలర్ అభిలాష్ టామీ.. ప్రీమియర్ గ్లోబల్ రేస్లో 2వ స్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhilash Tomy: రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్, కమాండర్ అభిలాష్ టోమీ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ రేస్ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అతను సెప్టెంబర్ 4, 2022న ఫ్రాన్స్లోని లెస్ సాబుల్స్-డి ఒలోన్ నుంచి ప్రారంభమైన సోలో ఎరౌండ్-ది-వరల్డ్ సెయిలింగ్ రేస్లో రెండవ స్థానంలో నిలిచాడు. గోల్డెన్ గ్లోబ్ (జీజీఆర్) రేసులో భారత్కు చెందిన అభిలాష్ టోమీ శనివారం రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అభిలాష్ టోమీ ప్రయాణిస్తున్న పడవ బయానాట్ 236 రోజుల పాటు ప్రయాణించి శనివారం ఉదయం 10.30 గంటలకు ఫ్రాన్స్ తీరానికి చేరుకుంది. 44 ఏళ్ల అభిలాష్ టామీ గోల్డెన్ గ్లోబ్ రేసును పూర్తి చేసిన మొదటి భారతీయుడు, ఆసియా వ్యక్తిగా పేరగాంచారు. గురువారం రాత్రి మొదటి స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకు చెందిన 40 ఏళ్ల నావికుడు కిర్స్టెన్ న్యూషాఫర్కు నిర్వాహకులు గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు. సముద్రం అకస్మాత్తుగా గాలి లేకుండా మారడంతో కిర్స్టన్ చివరి 2-3 నాటికల్ మైళ్లను కవర్ చేయడానికి కొన్ని గంటల సమయం మాత్రమే పట్టింది. దీంతో అభిలాష్ రెండో స్థానంలో నిలిచాడు.
Read Also: Metro Parking: మెట్రో ప్రయాణికులకు రిలీఫ్.. వాహనాల పార్కింగ్పై ఆందోళన చెందాల్సిన పనిలేదు!
Also Read
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
నాన్స్టాప్ రౌండ్-ది-వరల్డ్ రేస్ ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన, నిదానమైన రేసులో సెప్టెంబర్ 4, 2022న 16 మంది పాల్గొన్నారు. ఈవెంట్లో పాల్గొనేవారు 1968కి ముందు ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, ఆధునిక అత్యాధునిక నావిగేషన్ పరికరాలను ఉపయోగించాలని ఆదేశించారు. సాంకేతిక వైఫల్యాలు లేదా ప్రమాదాల కారణంగా మిగిలిన వారు మధ్యలోనే విరమించుకోవడంతో రేసులో ముగ్గురు మాత్రమే పాల్గొంటున్నారు. ఈ రేసులో పాల్గొనేవారు 32 నుంచి 36 అడుగుల పొడవు గల సాధారణ పడవను మాత్రమే వినియోగించాలి. 2018లో కూడా అప్పటి ఎడిషన్లో రేసులో పాల్గొన్న అభిలాష్, హిందూ మహాసముద్రంలో సముద్రంలో తీవ్రంగా గాయపడటంతో మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. అతను సముద్రంలో మూడు రోజులపాటు చిక్కుకుపోగా విమానం సహాయంతో అతడిని రక్షించారు. ఆ సీజన్లో 18 మంది పాల్గొన్నారు. కానీ వారిలో ఐదుగురు మాత్రమే రేసును పూర్తి చేయగలిగారు. ఈ సారి రేసులో రెండో స్థానంలో అభిలాష్ నిలిచి తన సత్తాను చాటుకున్నారు.
తాజావార్తలు
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!