Abhilash Tomy: చరిత్ర సృష్టించిన సెయిలర్ అభిలాష్ టామీ.. ప్రీమియర్ గ్లోబల్ రేస్లో 2వ స్థానం
Abhilash Tomy: రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్, కమాండర్ అభిలాష్ టోమీ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ రేస్ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అతను సెప్టెంబర్ 4, 2022న ఫ్రాన్స్లోని లెస్ సాబుల్స్-డి ఒలోన్ నుంచి ప్రారంభమైన సోలో ఎరౌండ్-ది-వరల్డ్ సెయిలింగ్ రేస్లో రెండవ స్థానంలో నిలిచాడు. గోల్డెన్ గ్లోబ్ (జీజీఆర్) రేసులో భారత్కు చెందిన అభిలాష్ టోమీ శనివారం రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అభిలాష్ టోమీ ప్రయాణిస్తున్న పడవ బయానాట్ 236 రోజుల పాటు ప్రయాణించి శనివారం ఉదయం 10.30 గంటలకు ఫ్రాన్స్ తీరానికి చేరుకుంది. 44 ఏళ్ల అభిలాష్ టామీ గోల్డెన్ గ్లోబ్ రేసును పూర్తి చేసిన మొదటి భారతీయుడు, ఆసియా వ్యక్తిగా పేరగాంచారు. గురువారం రాత్రి మొదటి స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకు చెందిన 40 ఏళ్ల నావికుడు కిర్స్టెన్ న్యూషాఫర్కు నిర్వాహకులు గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు. సముద్రం అకస్మాత్తుగా గాలి లేకుండా మారడంతో కిర్స్టన్ చివరి 2-3 నాటికల్ మైళ్లను కవర్ చేయడానికి కొన్ని గంటల సమయం మాత్రమే పట్టింది. దీంతో అభిలాష్ రెండో స్థానంలో నిలిచాడు.
Read Also: Metro Parking: మెట్రో ప్రయాణికులకు రిలీఫ్.. వాహనాల పార్కింగ్పై ఆందోళన చెందాల్సిన పనిలేదు!
Also Read
నాన్స్టాప్ రౌండ్-ది-వరల్డ్ రేస్ ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన, నిదానమైన రేసులో సెప్టెంబర్ 4, 2022న 16 మంది పాల్గొన్నారు. ఈవెంట్లో పాల్గొనేవారు 1968కి ముందు ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, ఆధునిక అత్యాధునిక నావిగేషన్ పరికరాలను ఉపయోగించాలని ఆదేశించారు. సాంకేతిక వైఫల్యాలు లేదా ప్రమాదాల కారణంగా మిగిలిన వారు మధ్యలోనే విరమించుకోవడంతో రేసులో ముగ్గురు మాత్రమే పాల్గొంటున్నారు. ఈ రేసులో పాల్గొనేవారు 32 నుంచి 36 అడుగుల పొడవు గల సాధారణ పడవను మాత్రమే వినియోగించాలి. 2018లో కూడా అప్పటి ఎడిషన్లో రేసులో పాల్గొన్న అభిలాష్, హిందూ మహాసముద్రంలో సముద్రంలో తీవ్రంగా గాయపడటంతో మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. అతను సముద్రంలో మూడు రోజులపాటు చిక్కుకుపోగా విమానం సహాయంతో అతడిని రక్షించారు. ఆ సీజన్లో 18 మంది పాల్గొన్నారు. కానీ వారిలో ఐదుగురు మాత్రమే రేసును పూర్తి చేయగలిగారు. ఈ సారి రేసులో రెండో స్థానంలో అభిలాష్ నిలిచి తన సత్తాను చాటుకున్నారు.
తాజావార్తలు
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!