Abhilash Tomy: చరిత్ర సృష్టించిన సెయిలర్ అభిలాష్ టామీ.. ప్రీమియర్ గ్లోబల్ రేస్లో 2వ స్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhilash Tomy: రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్, కమాండర్ అభిలాష్ టోమీ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ రేస్ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అతను సెప్టెంబర్ 4, 2022న ఫ్రాన్స్లోని లెస్ సాబుల్స్-డి ఒలోన్ నుంచి ప్రారంభమైన సోలో ఎరౌండ్-ది-వరల్డ్ సెయిలింగ్ రేస్లో రెండవ స్థానంలో నిలిచాడు. గోల్డెన్ గ్లోబ్ (జీజీఆర్) రేసులో భారత్కు చెందిన అభిలాష్ టోమీ శనివారం రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అభిలాష్ టోమీ ప్రయాణిస్తున్న పడవ బయానాట్ 236 రోజుల పాటు ప్రయాణించి శనివారం ఉదయం 10.30 గంటలకు ఫ్రాన్స్ తీరానికి చేరుకుంది. 44 ఏళ్ల అభిలాష్ టామీ గోల్డెన్ గ్లోబ్ రేసును పూర్తి చేసిన మొదటి భారతీయుడు, ఆసియా వ్యక్తిగా పేరగాంచారు. గురువారం రాత్రి మొదటి స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకు చెందిన 40 ఏళ్ల నావికుడు కిర్స్టెన్ న్యూషాఫర్కు నిర్వాహకులు గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు. సముద్రం అకస్మాత్తుగా గాలి లేకుండా మారడంతో కిర్స్టన్ చివరి 2-3 నాటికల్ మైళ్లను కవర్ చేయడానికి కొన్ని గంటల సమయం మాత్రమే పట్టింది. దీంతో అభిలాష్ రెండో స్థానంలో నిలిచాడు.
Read Also: Metro Parking: మెట్రో ప్రయాణికులకు రిలీఫ్.. వాహనాల పార్కింగ్పై ఆందోళన చెందాల్సిన పనిలేదు!
Also Read
- Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
- Tattoo Trends 2026: టాటూ ప్లేస్మెంట్ ఎందుకు ముఖ్యం..? 2026లో మారుతున్న కొత్త ట్రెండ్ ఇదే
- Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
- 2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
నాన్స్టాప్ రౌండ్-ది-వరల్డ్ రేస్ ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన, నిదానమైన రేసులో సెప్టెంబర్ 4, 2022న 16 మంది పాల్గొన్నారు. ఈవెంట్లో పాల్గొనేవారు 1968కి ముందు ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, ఆధునిక అత్యాధునిక నావిగేషన్ పరికరాలను ఉపయోగించాలని ఆదేశించారు. సాంకేతిక వైఫల్యాలు లేదా ప్రమాదాల కారణంగా మిగిలిన వారు మధ్యలోనే విరమించుకోవడంతో రేసులో ముగ్గురు మాత్రమే పాల్గొంటున్నారు. ఈ రేసులో పాల్గొనేవారు 32 నుంచి 36 అడుగుల పొడవు గల సాధారణ పడవను మాత్రమే వినియోగించాలి. 2018లో కూడా అప్పటి ఎడిషన్లో రేసులో పాల్గొన్న అభిలాష్, హిందూ మహాసముద్రంలో సముద్రంలో తీవ్రంగా గాయపడటంతో మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. అతను సముద్రంలో మూడు రోజులపాటు చిక్కుకుపోగా విమానం సహాయంతో అతడిని రక్షించారు. ఆ సీజన్లో 18 మంది పాల్గొన్నారు. కానీ వారిలో ఐదుగురు మాత్రమే రేసును పూర్తి చేయగలిగారు. ఈ సారి రేసులో రెండో స్థానంలో అభిలాష్ నిలిచి తన సత్తాను చాటుకున్నారు.
తాజావార్తలు
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
-
Tattoo Trends 2026: టాటూ ప్లేస్మెంట్ ఎందుకు ముఖ్యం..? 2026లో మారుతున్న కొత్త ట్రెండ్ ఇదే
-
Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!