గుజరాత్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఈ ఐపీఎల్ సీజన్లో దుమ్మురేపుతున్నాడు. తన భారీ ఇన్నింగ్స్ల కారణంగా గుజరాత్ ఈ రోజు టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా సాయి సుదర్శన్ సన్ రైజర్స్ పై ఊచకోత కోశాడు. 23 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా పవర్ ప్లే లో శతకొట్టాడు. ఈ భారీ ఇన్నింగ్స్ కారణంగా సాయి సుదర్శన్ చేసి పలు రికార్డులను తన ఖాతాలో వేడుకున్నాడు.
READ MORE: Manju Warrier : స్టార్ హీరోయిన్ నడుము గిల్లిన వ్యక్తి.. వీడియో వైరల్..
టీ20 క్రికెట్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న సాయి.. 54 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనతను సాధించాడు. అతని కంటే ముందు ఆస్ట్రేలియన్ ప్లేయర్ షాన్ మార్ష్ 53 ఇన్నింగ్స్లలో టీ20 ఫార్మెట్లో 2000 మార్కును అందుకున్నాడు. ఇది కాగా టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన మొదటి భారతీయ క్రికెటర్ గానూ సుదర్శన్ రికార్డు సృష్టించాడు. టీ20లో సచిన్ 59 ఇన్నింగ్సుల్లో 2000 పరుగులు చేశాడు. దీంతో పాటు ఐపీఎల్లో సాయి సుదర్శన్ 1500 పరుగులు క్రాస్ చేశాడు.
READ MORE: Asaduddin Owaisi: ‘‘2029 ఎన్నికల వరకైనా పూర్తవుతుందా.?’’ కులగణనపై ఓవైసీ..
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 1500 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఓ ల్యాండ్ మార్క్ ను క్రియేట్ చేశాడు. ఈ సమయంలో సాయి మరో ప్రపంచ రికార్డును కూడా నమోదు చేసుకున్నాడు. తన కెరీర్లో ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. అంటే ఒక్క డక్ లేకుండానే సుదర్శన్ 2000 పరుగులు సాధించాడు. 54 ఇన్నింగ్స్లలో ఒక్క డక్ లేకపోవడం గమనార్హం.
READ MORE: Minister Seethakka : గొర్రెల స్కామ్పై సీతక్క ధ్వజం.. కేసీఆర్ పాలనలో స్కాములపై కఠిన చర్యలు తప్పవు..
సాయి 2023లో భారత్ తరుపున అరంగేట్రం చేశాడు. మూడు వన్డే మ్యాచుల్లో 127 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో కేవలం 35 మ్యాచులోనే 1500 మార్కును అందుకున్నాడు. గతంలో సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గాయక్వాడ్ 44 ఇన్నింగ్స్లో 1500 ఐపీఎల్ రన్స్ చేశారు. షాన్ మార్ష్ 36 ఇన్నింగ్స్ల్లో , క్రిస్ గేల్ 37 , మైకేల్ హస్సీ 40 ఇన్నింగ్స్ల్లో ఐపీఎల్ లో 1500 మార్క్ ను టచ్ చేశారు.
READ MORE: Jobs Notification: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. మరో నోటిఫికేషన్ జారీ