Sadhguru: సద్గురు అభిమానులకు శుభవార్త.. తాజా అప్డేట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈషా పౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఢిల్లీ అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవలే ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. సర్జరీ తర్వాత ఆయన వేగంగా కోలుకున్నారు. దీంతో వైద్యులు బుధవారం డిశ్చార్జ్ చేశారు.
ఇటీవల ఆయన తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. అనంతరం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. అనంతరం బ్రెయిన్లో ప్రమాదకర స్థితి ఉండడంతో కొన్ని గంటల్లోనే ఆయన మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స చేశారు. సద్గురు పూర్తిగా కోలుకున్నారని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి తెలిపారు. సద్గురు వేగంగా కోలుకున్నారని.. ఆయన అభిమానులకు ఇది శుభవార్తేనని చెప్పారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు సద్గురు ఢిల్లీ వెళ్లారు. అయితే తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంటే మార్చి 17న అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం వైద్యులు ఆయనకు సిటీ స్కాన్ చేశారు. తక్షణమే సర్జరీ చేయాలని సూచించగానే కొన్ని గంటల్లోనే శస్త్రచికిత్స నిర్వహించారు. డాక్టర్ వినిత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీలతో కూడిన వైద్యుల బృందం విజయవంతంగా సర్జరీ చేశారు.
ఇక ప్రధాని మోడీ.. సద్గురుకు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా సద్గురుతో మాట్లాడి.. మంచి ఆరోగ్యంతో పాటు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!