Sadhguru: సద్గురు అభిమానులకు శుభవార్త.. తాజా అప్డేట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈషా పౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఢిల్లీ అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవలే ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. సర్జరీ తర్వాత ఆయన వేగంగా కోలుకున్నారు. దీంతో వైద్యులు బుధవారం డిశ్చార్జ్ చేశారు.
ఇటీవల ఆయన తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. అనంతరం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. అనంతరం బ్రెయిన్లో ప్రమాదకర స్థితి ఉండడంతో కొన్ని గంటల్లోనే ఆయన మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స చేశారు. సద్గురు పూర్తిగా కోలుకున్నారని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి తెలిపారు. సద్గురు వేగంగా కోలుకున్నారని.. ఆయన అభిమానులకు ఇది శుభవార్తేనని చెప్పారు.
Also Read
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు సద్గురు ఢిల్లీ వెళ్లారు. అయితే తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంటే మార్చి 17న అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం వైద్యులు ఆయనకు సిటీ స్కాన్ చేశారు. తక్షణమే సర్జరీ చేయాలని సూచించగానే కొన్ని గంటల్లోనే శస్త్రచికిత్స నిర్వహించారు. డాక్టర్ వినిత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీలతో కూడిన వైద్యుల బృందం విజయవంతంగా సర్జరీ చేశారు.
ఇక ప్రధాని మోడీ.. సద్గురుకు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా సద్గురుతో మాట్లాడి.. మంచి ఆరోగ్యంతో పాటు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించారు.
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!