NTV Telugu Site icon

Sabita Indra Reddy: ముఖ్యమంత్రిపై సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు..

Sabitha

Sabitha

ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.’ విద్యార్థుల ముందు, గురువుల ముందు కేసీఆర్ గారిని విమర్శించడమే మీ విధానమా ముఖ్యమంత్రి గారు @TelanganaCMO. గడిచిన పది నెలలలో కేసీఆర్ గారి పేరు ఎత్తకుండా ఒక్క సభలో అయినా మాట్లాడారా..?. మాట్లాడేటప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమా లేక పార్టీ కార్యక్రమా అని ముఖ్యమంత్రి గారు మర్చిపోతున్నారు. మీరు ఇచ్చాం అని చెప్తున్న టీచర్ పోస్టులు కేసీఆర్ గారు మంజూరు చేసినవి కావా, హైయర్ ఎడ్యుకేషన్‌‌లో 3202 పోస్టులు, యూనివర్సిటీలో 1081 పోస్టులు కేసీఆర్ గారి ప్రభుత్వం మంజూరు చేసినవి కావా?.. ఇంటర్, టెక్నికల్ మరియు కాలేజియేట్ ఎడ్యుకేషన్ సంబంధించి 3896 కాంట్రాక్టు ఉద్యోగులను కేసీఆర్ గారు రెగ్యులర్ చేశారు అని చెప్తే బాగుండేది. ఎన్నికల ముందు మీరు చెప్పిన 25,000 టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు అని ఆ గురువుల ముందు చెప్తే బాగుండేది.’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

Read Also: Pat Cummins: ఆ ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ సక్సెస్‌కు కారణం పాట్ కమిన్స్‌!

‘ఎన్నికలప్పుడు 6000 పాఠశాలలు మూతపడ్డాయి అని అబద్దం చెప్పిన మీరు, ఆ పాఠశాలల లిస్ట్ విడుదల చేస్తే బాగుండేది. “మన ఊరు మన బడి” కార్యక్రమం ఎందుకు ఆపేసారో చెప్తే బాగుండేది.
6 లక్షల మంది పేద విద్యార్థులు చదువుతున్న కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన గురుకులాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేద్దాం అనుకుంటున్నది అని చెప్తే బాగుండేది. ప్రభుత్వ పాఠశాలలో “బ్రేక్ ఫాస్ట్ స్కీమ్” ఎందుకు ఆపేశారో చెప్తే బాగుండేది. ఎన్నికల సమయంలో చెప్పినట్టు ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారో చెప్తే బాగుండేది. 19 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న మీరు మిగితా పాఠశాలలను గాలికి వదిలేశాము అని చెప్తే బాగుండేది’ అని సబితా ఇంద్రారెడ్డి ఎక్స్‌లో తెలిపారు.

Read Also: Vizag Honey Trap Case: కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీట్రాప్‌ కేసులో కొత్త కోణాలు..