NTV Telugu Site icon

Sabita Indra Reddy: ఏమీ లేని ఆకులా బీజేపీ తీరు

తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది. ఒకవైపు పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్, మంత్రుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ మంత్రులు సైతం బీజేపీ నేతల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీజేపీ నేతల్ని టార్గెట్ చేశారు. కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడతదంట…..అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటదంట. ఏమి లేని ఆకు లాగా బీజేపీ తీరు ఉందంటూ విద్యా మంత్రి సబితా రెడ్డి విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న కల్యాణ లక్ష్మి మీకు దమ్ముంటే మీ మోడీ కి చెప్పి దేశమంతా ఇప్పించండి….అది మీకు చేత కాదు అన్నారు. అధికారమిస్తే ఉచిత విద్య,ఉచిత వైద్యం అంటున్నారు. ఎవరు వద్దన్నారు..కేంద్రంలో అధికారం ఉన్నది మీ బీజేపీ పార్టీ అని మర్చిపోయారా? దమ్ముంటే వెంటనే దేశమంతా ఉచిత విద్య, వైద్యం ఇవ్వండి అని మంత్రి సబితా సవాల్ విసిరారు.

ఏమి చేతకాని వీళ్ళు మహేశ్వరంలో పాదయాత్ర చేస్తారoట.. 100 శాతం చేయండి. మేం వేసిన రోడ్లు చూసుకుంటూ రండి. 24 గంటలు వెలుగుతున్న లైట్లు చూసుకుంటా తిరగండి. ఇంటింటికి వెళ్లి అమ్మలను అడగండి నీళ్లు ఎట్లా వస్తున్నాయని. చెరువు కట్ట దగ్గర నుండి రండి అందులో చేపలు ఎలా తిరుగుతున్నాయో కనిపిస్తాయన్నారు మంత్రి సబిత.

Warangal Crime : వరంగల్ లో కలకలం.. పత్లిమిల్లు యజమాని ఆత్యహత్యాయత్నం