Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నేడే వర్చువల్ క్యూ బుకింగ్స్ ఓపెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala: శబరిమల భక్తులకు ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. శబరిమల మండల మకరవిళక్కు తీర్థయాత్రలో భాగంగా, భక్తుల కోసం వర్చువల్ క్యూ బుకింగ్ శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. దర్శనం కోసం స్లాట్లను www.sabarimalaonline.org వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 70,000 మంది భక్తులు వర్చువల్ క్యూ వెబ్సైట్ ద్వారా స్లాట్లను బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదనంగా, వండిపెరియార్ సత్రం, ఎరుమేలి, నీలక్కల్, పంబ వద్ద రియల్ టైమ్ బుకింగ్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ గరిష్టంగా 20,000 మంది భక్తులు దర్శనం కోసం అనుమతి ఇస్తారు.
READ MORE: Visakhapatnam: లైంగిక వేధింపులతో డిగ్రీ స్టూడెంట్ మృతి.. విద్యార్థి సంఘాల ఆందోళన
Also Read
- Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
- Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
అంతే కాదు.. ప్రయాణికుల ప్రమాద బీమా కవరేజీలో సైతం మార్పులు తీసుకువచ్చారు. గతేడాది యాత్రికులకు ప్రమాద బీమా కవరేజీ కేవలం నాలుగు జిల్లాలకే పరిమితం చేశారు. తాజాగా దాన్ని సవరించి ఈ తీర్థయాత్ర సీజన్ నుంచి శబరిమల ప్రయాణంలో కేరళలో ఎక్కడ ప్రమాదం జరిగిన రూ. 5 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. అంతేకాదు.. ప్రమాద వశాత్తు భక్తులు ఎవరైనా మరణిస్తే మృతదేహాలను ఇంటికి తరలించడానికి ఆర్థిక సాయం చేయనుంది. కేరళ లోపల అయితే అంబులెన్స్ ఖర్చుల కోసం రూ. 30,000, కేరళ వెలుపల రూ. 1 లక్ష వరకు అందించనున్నారు. అదనంగా శబరిమల విధుల్లో ఉన్న దేవస్వం బోర్డు శాశ్వత, రోజువారీ వేతన ఉద్యోగులకు, అలాగే ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు సైతం బీమా కవరేజీ వర్తిస్తుంది.
READ MORE: Kottayam: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్…
గతంలో నీలక్కల్ నుంచి సన్నిధానం వరకు తీర్థయాత్ర మార్గంలో సంభవించే గుండెపోటు లేదా స్ట్రోక్స్ కారణంగా సంభవించే సహజ మరణాలకు పరిహారం ఉండేది కాదు. అయితే.. ఈ ఏడాది నుంచి సహజ మరణాలకు రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించే యాత్రికుల సంక్షేమ నిధి ప్రారంభిస్తారు. ఇక్క ఓ ముఖ్యమైన విషయం గుర్తుచుకోవాలి.. బీమా కవరేజీ పొందడానికి వర్చువల్ క్యూ బుకింగ్ ఐడిని ప్రాథమిక పత్రంగా పరిగణిస్తారు కాబట్టి.. జాగ్రత్తగా ఉంచుకోవడం తప్పనిసరి.
తాజావార్తలు
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!