Saba Karim: ధోనీ వచ్చాకే వికెట్ కీపర్లకు క్రేజ్ పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకానొక సమయంలో ఇండియాకు వికెట్ కీపర్లు దొరకడం కష్టంగా ఉండేది. రాహుల్ ద్రావిడ్ తర్వాత సరైన వికెట్ కీపర్ కోసం కొన్నేళ్ల పాటు ఎన్నో ప్రయత్నాలు చేసింది టీమిండియా. అప్పట్లో పార్థివ్ పటేల్, అజయ్ రత్రా, దినేశ్ కార్తీక్, నమన్ ఓజా కీపింగ్, బ్యాటింగ్ లో సరైన ప్రదర్శన చూపించక.. ఇలా వచ్చి అలా వెళ్లారు. అయితే ఎప్పుడైతే ధోనీ ఎంటర్ అయ్యాడు. అప్పటి నుంచి వికెట్ కీపర్లకు క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం టీమిండియాకి సీనియర్ మోస్ట్ దినేశ్ కార్తీక్, వృద్ధిమాన్ సాహాలతో పాటు రిషబ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, జితేశ్ శర్మ ఇలా అరడజను మంది ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితి రావడానికి ధోనీయే కారణం..
Tamannaah: ఆ సీన్లకి ఒప్పుకోకపోతే అక్కని, ఆంటీని చేసేవారు..తమన్నా ఏంటి ఇలా అనేసింది!
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి బీసీసీఐ మాజీ సెలక్టర్, మాజీ వికెట్ కీపర్ సబా కరీం జియో సినిమా షోలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘నేను మొదటిసారి ధోనీని చూసినప్పుడు అతను బీహార్ టీమ్ కు రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. అతని దగ్గర బ్యాటింగ్, వికెట్ కీపింగ్ స్కిల్స్ని దగ్గర్నుంచి గమనించా. తన బ్యాటింగ్ చూసి ఫిదా అయిపోయా. స్పిన్ బౌలింగ్ అయినా పేస్ బౌలింగ్లో అయినా అద్భుత షాట్లు ఆడుతున్నాడు. అని సబా కరీం తెలిపాడు.
MP Margani Bharat: రాష్ట్రంలో ఏదో రకంగా అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నం
కెన్యాలో ఇండియా A, పాకిస్తాన్ A, కెన్యా మధ్య ట్రై సిరీస్ జరిగింది. దినేశ్ కార్తీక్ అప్పటికే టీమిండియాకి వికెట్ కీపర్గా ఉండడంతో ఇండియా A తరుపున ధోనీకి ఆడే ఛాన్స్ దక్కింది. ఆ సిరీస్లో అతని వికెట్ కీపింగ్ చాలా అద్భుతంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. చెప్పాల్సిన పనే లేదు, చితక్కొట్టేశాడు. ఆ సిరీస్లో అతను ఆడిన విధానం నాకు ఇంకా గుర్తుంది. అదే అతని కెరీర్కి టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకున్నా. వెంటనే కోల్కత్తాకి వెళ్లి కెప్టెన్ సౌరవ్ గంగూలీని కలిశానని సబా కరీం పేర్కొన్నాడు. టీమిండియా ఎలాంటి వికెట్ కీపర్ కోసమైతే చూస్తుందో, అలాంటి వికెట్ కీపర్ బీహార్కి ఆడుతున్నాడని చెప్పా. అప్పటికి సౌరవ్ గంగూలీ, ధోనీని చూడలేదు. అందుకే మాహీని పాకిస్తాన్ టూర్కి సెలక్ట్ చేయలేదు. ఆ తర్వాత ధోనీ ఆటను చూసి టీమ్కి సెలక్ట్ చేయమని చెప్పాడు…’ అంటూ సబా కరీం చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?