SA vs IND: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ 2026 వార్మప్ మ్యాచ్ తో బోణి కొట్టింది. సౌతాఫ్రికాపై టీమిండియా శుభారంభం చేసింది. ముంబై డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికాపై 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగగా, చివర్లో బౌలర్లు కట్టుదిట్టంగా రాణించారు.
OTR: తెలంగాణలో పాగా వేయడానికి ఇదో అవకాశం.. జనసేనాని ఎంట్రీతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ కేవలం 20 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత తిలక్ వర్మ (45), సూర్యకుమార్ యాదవ్ (30), హార్దిక్ పాండ్యా (30) విధ్వంసకర ఇన్నింగ్స్ లతో స్కోర్బోర్డును పరుగులు పెట్టించారు. చివర్లో అక్షర్ పటేల్ 35 పరుగులతో నాటౌట్గా నిలిచి ఇన్నింగ్స్ను భారీ స్కోర్ తో ముగించాడు.
HYD Woman M*urder: నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు ఘోరం..
240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆరంభంలో దూకుడుగా ఆడింది. రయాన్ రికెల్టన్ (44), ట్రిస్టన్ స్టబ్స్ (45 నాటౌట్), మార్కో యాన్సెన్ (31) పోరాటం చేసినప్పటికీ భారత బౌలర్లు మధ్య ఓవర్లలో కీలక వికెట్లు పడగొట్టారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులకే దక్షిణాఫ్రికాను కట్టడి చేయడంతో భారత్కు 30 పరుగుల విజయం దక్కింది. ఈ వార్మ్-అప్ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ టీమిండియా మంచి ప్రదర్శన చేసింది.
