Sunil Gavaskar: ఈ తేడాలు ఎందుకు.. సునీల్ గవాస్కర్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar Slams Cape Town Pitch: ఇటీవల దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరిగిన రెండో టెస్టు కేవలం ఒకటిన్నర రోజులోనే ముగిసిన సంగతి తెలిసిందే. కేప్టౌన్ వేదికగా జరిగిన టెస్టులో ఇరు జట్ల మధ్య 107 ఓవర్లు (అయిదు సెషన్స్) మాత్రమే పడ్డాయి. పిచ్ మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రమాదకరంగా మారి.. బ్యాట్స్మెన్లను ఇబ్బందులకు గురి చేసింది. టెస్టు చరిత్రలో అతి తక్కువ సమయంలో ముగిసిన మ్యాచ్ ఇదే. ఈ పిచ్ పరిస్థితులపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా మరికొందరు విమర్శలు చేశారు. తాజాగా భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించి ఫైర్ అయ్యాడు. భారత్లోని పిచ్లపై ఒకలా, విదేశీ పిచ్ల గురించి మరొకలా మాట్లాడటం ఎందుకని ప్రశ్నించాడు.
కేప్టౌన్ పిచ్ క్యురేటర్ పొరపాటు చేశాడని అంటున్న వారు.. భారత్ పిచ్లపై ఎందుకు నోరు పారేసుకుంటారు? అని సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. ‘దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని పిచ్ పరిస్థితుల్లో పొరపాటు జరిగందంటూ సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదు. భారత క్యురేటర్లు పొడి పిచ్ తయారు చేస్తే.. గెలుపు కోసమే చేశారంటారు. 2023లో భారత్లో తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా ఆలౌట్ అవ్వగానే.. ఆసీస్ మాజీ కెప్టెన్ ఒకరు ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. మా సిబ్బంది కావాలని చేస్తారు.. కానీ మీ సిబ్బంది మాత్రం పొరపాటుగా చేస్తారా?’ అని సన్నీ ఫైర్ అయ్యాడు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
Also Read: Weather Weather Update: 20 రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు.. ఆలస్యంగా రైళ్ల, విమానాల రాకపోకలు!
త్వరలో భారత గడ్డపై పర్యటించనున్న ఇంగ్లండ్ జట్టును ఉద్దేశించి సునీల్ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘మరో మూడు వారాల్లో ఓ టీమ్ భారత్లో టెస్టు సిరీస్ ఆడేందుకు వస్తుంది. ఆ దేశానికి చాలా విసుక్కునే, అరిచే మీడియా ఉంది. వారి జట్టుకు ఏది నచ్చకపోయినా, త్వరగా వికెట్స్ పడినా విమర్శలు మొదలవుతాయి. ఆ ఆరోపణలు వేగంగా వ్యాప్తి చెందుతాయి’ అని సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య త్వరలో టెస్ట్ సిరీస్ జరుగనుంది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా హైదరాబాద్లో జనవరి 25న తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమవుతుంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!