MS Dhoni Angry: ధోనీ కోపాన్ని నేను చూశా.. ఒక్కసారిగా బయపడిపోయా: బద్రీనాథ్
- మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ
- ధోనీ కూడా మనిషే
- వాటర్ బాటిల్ను తన్నితే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Badrinath recalled MS Dhoni’s Angry Moment: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో నిశ్శబ్దంగా ఉంటూ.. తన పని చేసుకుంటూ పోతుంటాడు. మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏంతో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. మైదానంలో సహచర ఆటగాళ్లపై అరిచిన సందర్భాలూ లేవు. అందుకే అతడిని ‘మిస్టర్ కూల్’ అని అంటారు. అయితే ధోనీ ఆగ్రహంను తాను ప్రత్యక్షంగా చూశానని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ ఆటగాడు ఎస్ బద్రీనాథ్ చెప్పాడు. మహీ కోపంలో వాటర్ బాటిల్ను తన్నితే ఎక్కడో పడిందని తెలిపాడు. తాను బయపడిపోయా అని పేర్కున్నాడు.
తాజాగా ఇన్సైడ్స్పోర్ట్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ బద్రీనాథ్ మాట్లాడుతూ… ‘ఎంఎస్ ధోనీ కూడా మనిషే. మహీ కూడా కొన్ని సమయాల్లో తన సంయమనాన్ని కోల్పోతుంటాడు. అయితే మైదానంలో మాత్రం తన కోపాన్ని వ్యక్తం చేయడం చాలా అరుదు. కోపం కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో తాను ఇబ్బంది పడుతున్నట్లు ప్రత్యర్థులు భావించకూడదని అతడి భావన. ధోనీ ఆగ్రహాన్ని నేను ప్రత్యక్షంగా చూశా. అది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జరిగింది. చెన్నై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అది. 110 పరుగుల లక్ష్య ఛేదనలో మేం వరుసగా వికెట్లను కోల్పోయాం. సునాయాసంగా గెలిచే మ్యాచ్లో ఓడిపోయాం’ అని చెప్పాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
Also Read: Gold Price Today: షాకిస్తున్న బంగారం ధరలు.. నిన్న రూ.1300, నేడు రూ.440! లక్ష చేరువలో వెండి
‘అనిల్ కుంబ్లే బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నేను ఎల్బీగా అవుట్ అయ్యాను. ఎంఎస్ ధోనీ డ్రెస్సింగ్ రూమ్ లోపలికి వస్తున్నాడు. నేను డ్రెస్సింగ్ రూమ్ పక్కనే ఉన్నా. ధోనీ, నాకు మధ్య ఓ చిన్న వాటర్ బాటిల్ ఉంది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న అతడు బాటిల్ను గట్టిగా తన్నేశాడు. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నవారంతా మహీ కళ్లల్లోకి చూసేందుకూ కూడా ప్రయత్నించలేదు’ అని ఎస్ బద్రీనాథ్వివరించాడు. అంతర్జాతీయ క్రికెట్కు 2020లో ధోనీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2024లో ఫినిషర్గా అభిమానులను అలరించాడు. 8 ఇన్నింగ్స్లలో 161 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025లో అతడు ఆడతాడా? లేదో? చూడాలి.
తాజావార్తలు
-
Explainer: ప్రతి ముగ్గురిలో ఒకరికి సోకుతుంది.. కంటి చూపును దెబ్బతీస్తుంది.. గర్భంలోని శిశువుకూ ముప్పు!
-
Vastu Tips: డబ్బు ఇంట్లో నిలవడం లేదా? ఉప్పు పాత్రలో ఈ ఒక్కటి ఉంచితే అదృష్టం మారుతుందా?
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!