Site icon NTV Telugu

Rythu Bharosa : రైతన్నలకు అలర్ట్‌.. 2218 కోట్ల నిధులు రైతుల ఖాతాలోకి.. ఎన్ని ఎకరాల వరకు అంటే..?

Rythubharosa

Rythubharosa

Rythu Bharosa : రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 26న ప్రారంభమైన ఈ పథకం అమలులో భాగంగా, ఫిబ్రవరి 5న ఒక ఎకరానికి లోపు భూమి కలిగిన రైతులకు నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, సోమవారం ప్రభుత్వం మరోసారి రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది. గత నెల 27న 4,41,911 రైతుల 9,48,332.35 ఎకరాలకు రూ.5,68,99,97,265 నిధులు జమ చేయగా.. ఈనెల 5వ తేదీన 17,03,419 రైతులకు చెందిన 9,29,234.20 ఎకరాలకు రూ. 5,57,54,07,019 నిధులు విడుదల చేశారు. అయితే.. ఈ రోజు 8,65,999 మంది రైతులకు చెందిన 11,79,247.17 ఎకరాలకు రూ. 7,07,54,84,664 లకు జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు మొత్తంగా 30,11,329 రైతులకు చెందిన 30,56,814.32 ఎకరాలకు రూ. 18,34,08,88,948  లను లబ్దిదారుల ఖాతాల్లో జమచేసినట్లు పేర్కొంది. మొత్తంగా రైతు భరోసా కింద రూ. 2218 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Veera Raghava Reddy : రామరాజ్యం ఆర్మీ వీర రాఘవరెడ్డి అరెస్టు..

Exit mobile version