Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా 10 క్రూయిజ్ క్షిపణులతో దాడి.. ఐదుగురు మృతి.. ఆగ్రహించిన జెలెన్ స్కీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Ukraine War: పశ్చిమ ఉక్రెయిన్లోని ఒక నగరంపై రష్యా గురువారం క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ఒక భవనంలో కనీసం ఐదుగురు మరణించారు. గతేడాది క్రెమ్లిన్ సైన్యం దేశంపై దాడి చేసినప్పటి నుండి ఎల్వివ్పై ఇది అత్యంత ఘోరమైన దాడి అని అధికారులు తెలిపారు. రాత్రి జరిగిన దాడిలో నివాస భవనం భారీగా ధ్వంసమైంది. ఈ ఘటనలో 36 మంది గాయపడ్డారు. చనిపోయిన ఐదుగురిలో 21 ఏళ్ల వ్యక్తి, 95 ఏళ్ల మహిళ ఉన్నారని ఎల్వివ్ గవర్నర్ మాక్సిమ్ కోజిట్స్కీ తెలిపారు. వృద్ధురాలు రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలతో బయటపడిందని, అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఆమె తట్టుకోలేకపోయిందని కోజిట్స్కీ చెప్పారు.
Read Also:Gurpatwant Singh Pannun: ఆ ఖలిస్తానీ ఉగ్రవాది బతికే ఉన్నాడు.. భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు..
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
దెబ్బతిన్న 60 ఇళ్లు, 50 కార్లు
మరోవైపు దాడికి సంబంధించి ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ కొన్ని గంటల్లో చివరి బాధితుడిని కూడా భవనం శిధిలాల నుండి బయటకు తీశామని పేర్కొంది. శిథిలాల్లో దాదాపు పాతిపెట్టబడిన ఏడుగురిని సజీవంగా రక్షించామని చెప్పారు. ఈ రష్యా దాడిలో దాదాపు 60 ఇళ్లు, 50 కార్లు కూడా దెబ్బతిన్నాయని ఎల్వివ్ మేయర్ ఆండ్రీ సడోవాయ్ తెలిపారు. మేయర్ రెండు రోజుల అధికారిక సంతాప దినాలు ప్రకటించారు. అదే సమయంలో ఉక్రెయిన్లోని అమెరికా రాయబారి బ్రిగిట్టే బ్రింక్ ఈ దాడిపై రష్యాను విమర్శించారు. ఉక్రెయిన్ పౌరులపై రష్యా పదే పదే దాడులు చేయడం చాలా భయానకమని ఆయన ట్వీట్ చేశారు. నల్ల సముద్రం నుండి ఎల్వివ్ నగరం వైపు రష్యా ప్రయోగించిన 10 క్రూయిజ్ క్షిపణులలో ఏడింటిని అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. దాడికి తగిన సమాధానం ఇస్తామని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also:SSC Supplementary Results: నేడే తెలంగాణ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు..
యుద్ధ సమయంలో క్రెమ్లిన్ సైన్యం పౌర ప్రాంతాలపై పదేపదే దాడి చేసిందని ఆయన అన్నారు. తాము సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని రష్యా అధికారులు పేర్కొన్నప్పటికీ.. గత ఏడాది ఉగ్రదాడి ప్రారంభమైనప్పటి నుంచి ఎల్వివ్ పౌర మౌలిక సదుపాయాలపై ఇదే అతిపెద్ద దాడి అని సదోవాయి పౌరులకు ఒక వీడియో సందేశంలో తెలిపారు. దేశం తూర్పు భాగం నుండి వేలాది మంది ప్రజలు భద్రత కోసం ఎల్వివ్లో నివసిస్తున్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. 64 మంది తమ ఇళ్లను విడిచిపెట్టారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!