Russia Over Ukraine: తగ్గేదెలా.. అన్నట్టుగా ఉక్రెయిన్పై 100కిపైగా డ్రోన్లతో భారీ దాడి చేసిన రష్యా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Over Ukraine: ఉక్రెయిన్పై రష్యా మరోసారి దాడి చేసింది. సోమవారం రాత్రి రష్యా 100కు పైగా డ్రోన్లతో ఉక్రెయిన్ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పిల్లలు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో రష్యా ఉక్రెయిన్కు చెందిన ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలనే టార్గెట్ చేసినట్టు అధికారులు తెలిపారు.
Read Also:Jagtial Murder Case: పిన్ని కాదు, పిశాచి.. తల్లిదండ్రులపై అసూయతో..!
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. గత వారం రోజుల్లో రష్యా సుమారు 1,270 డ్రోన్లు, 39 మిసైళ్లు, ఇంకా 1,000కుపైగా గ్లైడ్ బాంబులు వదిలినట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే, రష్యాలో మరో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రవాణా మంత్రి రోమన్ స్టారోవోయిట్ ను పదవి నుండి తొలగించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన్ను మృతిగా కనుగొన్నారు. అధికార వర్గాలు ఇది ఆత్మహత్యగా భావిస్తున్నాయి.
Read Also:EX MLA Prasanna Kumar Reddy: కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి..
రోమన్ స్టారోవోయిట్ పదవీ తొలగింపుకు కారణంగా ఉక్రెయిన్ డ్రోన్ దాడుల బెదిరింపులతో రష్యాలోని అనేక విమానాశ్రయాలు కార్యకలాపాలు నిలిపివేయడమేనని ప్రకటించింది. మరోవైపు రష్యా సైన్యం సుమారు 1,000 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్న యుద్ధ మార్గంలో కొన్ని కీలక ప్రాంతాల్లో దాడులు ముమ్మరం చేస్తోంది. ఉక్రెయిన్ సైన్యం కూడా దీన్ని తిప్పికొట్టేందుకు తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. శాంతి చర్చలు సరిగా జరగక పోవడంతో ఉక్రెయిన్ మరింత మిలిటరీ సహాయం కోసం అమెరికా, యూరప్ దేశాల వైపు చూస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?