Jagtial Murder Case: పిన్ని కాదు, పిశాచి.. తల్లిదండ్రులపై అసూయతో..!
- జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం
- ఐదేళ్ల చిన్నారిని చంపిన పిన్ని
- బాలికను చంపేసి ఏం తెలియనట్లు డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిని పిన్ని అయ్యే మహిళ దారుణంగా గొంతు కోసి చంపేసింది. కేవలం ఆ చిన్నారి తల్లిదండ్రులతో ఉన్న అసూయతోనే అఘాయిత్యానికి పాల్పడింది. అంతే కాదు బాలికను చంపేసి ఏం తెలియనట్లు డ్రామా అడిన కిలాడీని ఎట్టకేలకు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆడుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిన బాలిక..అదే కాలనీలోని మరొకరి ఇంటిలో శవమై తేలింది.. బాత్రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
కోరుట్లలోని ఆదర్శనగర్లో నివాసముంటున్న ఆకుల రాములు-నవీన దంపతులకు కుమారుడు వేదాస్, కూతురు ఐదేళ్ల హితిక్ష ఉన్నారు. రాములు ఉపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లగా నవీన అత్తామామలతోనే ఉంటోంది. సాయంత్రం కాలనీకి చెందిన పిల్లలతో హితిక్ష ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. దొంగ పోలీస్, పులి ఆట ఆడుకుంటూ అదృశ్యమైపోయింది బాలిక. ఇతరులకు కనిపించకుండా తప్పించుకొని తిరిగే ఆటను కాలనీలో అందరి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా కనిపించకుండా పోయింది. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. ఆ తరువాత సాయంత్రం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది. సుమారు గంటన్నర పాటు వెతికారు. చివరికి తమ కూతురు కనిపించడం లేదని రాత్రి 8.30 గంటల సమయంలో పోలీసులకు చెప్పారు.
స్థానికుల సాయంతో పోలీసులు వెతుకుతుండగా అదే కాలనీలోని కొడుపల్లి విజయ్ ఇంటి బాత్రూంలో హితిక్ష రక్తపు మరకలతో లభ్యమయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించి వెంటనే హుటాహుటిన బాలికను ఆస్పత్రికి తీసుకుని పోగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విజయ్ ఇంట్లో హితిక్ష రక్తపు మడుగులో పడి ఉండడంతో అతడే హత్య చేసి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. విజయ్ భార్య దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. ఆ ఇంట్లో విజయ్తో పాటు అతని అన్న, తమ్ముని కుమారులు ఉన్నట్లుగా సమాచారం.
విజయ్ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు సెల్ఫోన్ ద్వారా అతనితో మాట్లాడితే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెప్పాడు. అతను.. నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వచాయి. ఇదిలా ఉంటే బాలిక తల్లితో.. పిన్నికి కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో మనస్పర్ధలు ఉన్నాయి. ఈ మనస్పర్ధలు నేపథ్యంలోనే బాలిక పిన్ని చంపి ఉంటుందని అనుమానించారు.
పిన్ని మమతను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపడింది. ఆడుకోవడానికి వెళ్లిన బాలికను పక్కింటి బాత్రూమ్కు తీసుకువెళ్లి హత్య చేసినట్లుగా ఒప్పుకుంది. బాలిక తల్లి దండ్రుల సంపాదపై ఉన్న అసూయతోనే చంపేసినట్లు వెల్లడించింది. అంతే కాదు గతంలో ఆన్లైన్లో బెట్టింగ్ ఆడిన మమత.. లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఓ వైపు డబ్బులు లేకపోవడం.. బాలిక తల్లి తనను చిన్నచూపు చూడడంతో కక్ష పెంచుకున్నట్లు వెల్లడైంది.
ఇక మమత పిన్ని మామూలు మహిళ కాదు.. అంతకు ముందు బాలికను అతి కిరాతకంగా హత్య చేసి.. మళ్లీ కుటుంబ సభ్యుల అందరితో కలిసి బాలికను వెతుకున్నట్లు డ్రామా ఆడింది. చిన్నారి మృతదేహం దొరికిన తర్వాత కూడా తన డ్రామా ఆపలేదు. అందరితో కలిసి చిన్నారి కోసం ఎంతో వేదన పడుతున్నట్లుగా ఏడ్చింది. అప్పటి వరకు ఏడ్చిన ఆమెను.. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అంతా షాక్ అయ్యారు.
పెద్దవాళ్ల ఆర్ధిక సంబంధాలు.. కక్షలకు అభం శుభం తెలియని చిన్నారి హితిక్ష బలైంది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..