Bihar: మటన్ రైస్తో కాంగ్రెస్ విందు.. ఎగబడ్డ జనం.. కింద పడ్డ డీఎస్పీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: ముక్క చుక్క ఉందంటే చాలు మూలకు పడ్డ ముసలోడు కూడా ఎగేసుకొచ్చేస్తారు.. మనోళ్లకు ఉన్న పాడు అలవాటు అది. వెనక ముందు చూసుకోకుండా వచ్చేయడమే. బీహార్లో కూడా మటన్ తో భోజనం అనే సరికి భారీగా జనం తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ రాష్ట్రంలో ఓ ఎంపీ కార్మికుల కోసం మటన్ రైస్తో ఏర్పాటు చేసిన విందుకు భారీగా వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో వారి అదుపు చేయడానికి ప్రయత్నిస్తుండగా డీఎస్పీ కిందపడ్డారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.
Read Also:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ముంగేర్ జిల్లాలోని పోలో గ్రౌండ్లో జేడీయూ జాతీయాధ్యక్షుడు, ముంగేర్ ఎంపీ లాలన్ సింగ్ రోజు పనిచేసుకునే కూలీల కోసం మటన్ తో కమ్మనైన విందును ఏర్పాటు చేశారు. మటన్ రైస్ను తినేందుకు ప్రజలు పెద్దఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. దీంతో రద్దీని అదుపు చేసే సమయంలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారిపై లాఠీలు ఝులిపించారు. విందులో కూలీల కోసం ప్రత్యేకంగా కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు.
Read Also:KKR vs CSK: ప్రతీకారం తీర్చుకున్న కేకేఆర్.. సీఎస్కేపై ఘనవిజయం
ఈ క్రమంలో కొందరు జేడీయూ పార్టీ కార్యకర్తలు అక్కడికి రావడం వల్ల మొదట తోపులాట జరిగింది. అయితే కేవలం రెండు వేల మంది కార్మికుల కోసం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమానికి అంతకు మించి ప్రజలు రావటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు చెబుతున్నారు. మొదటి పంక్తి భోజనం ప్రశాంతంగా ముగిసినా రెండో రౌండ్ సమయానికి జనాలు కిక్కిరిసి పోవడం వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. 2019లో లోక్సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత లాలన్ సింగ్ ఇలాంటి విందులు చాలా ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా ఈ మధ్య కాలంలో ఆ కార్యక్రమానికి బ్రేక్ పడింది. మహమ్మారి ముప్పు తగ్గడం వల్ల ఈసారి ముంగేర్ వేదికగా మరోసారి ఏకంగా రెండు వేల మంది కోసం విందు ఏర్పాటు చేశారు.
जेडीयू अध्यक्ष ललन सिंह की मटन पार्टी में कार्यकर्ताओं को मिली लाठी!
JDU के राष्ट्रीय अध्यक्ष और मुंगेर सांसद ललन सिंह ने महागठबंधन के कार्यकर्ताओं के सम्मान में पोलो मैदान में मटन-पुलाव महाभोज का आयोजन किया। इस दौरान जमकर हंगामा हुआ। भोज खाने के लिए आई भीड़ को नियंत्रित करने के… pic.twitter.com/8e1MowYz28
— Bihar Tak (@BiharTakChannel) May 14, 2023
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?