Bihar: మటన్ రైస్తో కాంగ్రెస్ విందు.. ఎగబడ్డ జనం.. కింద పడ్డ డీఎస్పీ
Bihar: ముక్క చుక్క ఉందంటే చాలు మూలకు పడ్డ ముసలోడు కూడా ఎగేసుకొచ్చేస్తారు.. మనోళ్లకు ఉన్న పాడు అలవాటు అది. వెనక ముందు చూసుకోకుండా వచ్చేయడమే. బీహార్లో కూడా మటన్ తో భోజనం అనే సరికి భారీగా జనం తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ రాష్ట్రంలో ఓ ఎంపీ కార్మికుల కోసం మటన్ రైస్తో ఏర్పాటు చేసిన విందుకు భారీగా వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో వారి అదుపు చేయడానికి ప్రయత్నిస్తుండగా డీఎస్పీ కిందపడ్డారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.
Read Also:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
ముంగేర్ జిల్లాలోని పోలో గ్రౌండ్లో జేడీయూ జాతీయాధ్యక్షుడు, ముంగేర్ ఎంపీ లాలన్ సింగ్ రోజు పనిచేసుకునే కూలీల కోసం మటన్ తో కమ్మనైన విందును ఏర్పాటు చేశారు. మటన్ రైస్ను తినేందుకు ప్రజలు పెద్దఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. దీంతో రద్దీని అదుపు చేసే సమయంలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారిపై లాఠీలు ఝులిపించారు. విందులో కూలీల కోసం ప్రత్యేకంగా కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు.
Read Also:KKR vs CSK: ప్రతీకారం తీర్చుకున్న కేకేఆర్.. సీఎస్కేపై ఘనవిజయం
ఈ క్రమంలో కొందరు జేడీయూ పార్టీ కార్యకర్తలు అక్కడికి రావడం వల్ల మొదట తోపులాట జరిగింది. అయితే కేవలం రెండు వేల మంది కార్మికుల కోసం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమానికి అంతకు మించి ప్రజలు రావటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు చెబుతున్నారు. మొదటి పంక్తి భోజనం ప్రశాంతంగా ముగిసినా రెండో రౌండ్ సమయానికి జనాలు కిక్కిరిసి పోవడం వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. 2019లో లోక్సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత లాలన్ సింగ్ ఇలాంటి విందులు చాలా ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా ఈ మధ్య కాలంలో ఆ కార్యక్రమానికి బ్రేక్ పడింది. మహమ్మారి ముప్పు తగ్గడం వల్ల ఈసారి ముంగేర్ వేదికగా మరోసారి ఏకంగా రెండు వేల మంది కోసం విందు ఏర్పాటు చేశారు.
जेडीयू अध्यक्ष ललन सिंह की मटन पार्टी में कार्यकर्ताओं को मिली लाठी!
JDU के राष्ट्रीय अध्यक्ष और मुंगेर सांसद ललन सिंह ने महागठबंधन के कार्यकर्ताओं के सम्मान में पोलो मैदान में मटन-पुलाव महाभोज का आयोजन किया। इस दौरान जमकर हंगामा हुआ। भोज खाने के लिए आई भीड़ को नियंत्रित करने के… pic.twitter.com/8e1MowYz28
— Bihar Tak (@BiharTakChannel) May 14, 2023
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!