TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సంకేతాలు
- మళ్లీ సమ్మె బాటలో RTC ఉద్యోగులు
- యాజమాన్యం నిర్లక్ష్యంపై JAC ఆగ్రహం
- ఏప్రిల్ 7 నుండి సమ్మెకు సిద్ధమైన కార్మికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (RTC)లో మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. కార్మికులు, ఉద్యోగులు గత కొంతకాలంగా తమ డిమాండ్ల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, అధికార యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు సమ్మె నోటీసులు ఇచ్చిన RTC JAC, తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి సమ్మె మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధమవుతోంది.
ఆర్టీసీ యాజమాన్యం తమ సమస్యలపై చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని ఉద్యోగులు కోరుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. లేబర్ కమిషనర్తో చర్చలు జరిపే అవకాశం కల్పించినా, ఆర్టీసీ యాజమాన్యం అందులో పాల్గొనకపోవడంతో చర్చలు జరగకుండానే RTC JAC నేతలు వెనుదిరిగారు. ఇది ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను సాకుగా చూపుతూ, తమ వాదనలకు మద్దతుగా చర్యలు తీసుకోకపోవడం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను కారణంగా చూపుతున్న యాజమాన్యం, కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం నుండి తప్పించుకుంటోందని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా, ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో పురోగతిలేదు. ఇంకా చాలా మంది ఉద్యోగులకు పూర్తిగా జీతాలు కూడా పడని పరిస్థితి నెలకొంది. విలీన ప్రక్రియ గురించి ఎటువంటి ప్రకటన లేకుండా, ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా పెండింగ్ బిల్లుల గురించి కూడా ఎవరూ స్పందించకపోవడంతో సమస్యలు మరింత పెరిగినట్లయ్యింది.
ఈ పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్తో పాటు, RTC బస్సులను రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేయాలని, ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాలని, విలీన ప్రక్రియను పూర్తిచేయాలని RTC JAC నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇవేవీ పరిష్కారం కాదనే అభిప్రాయంతో, వచ్చే నెల 7వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం వెంటనే చర్చలకు రావలసిన అవసరం ఉందని, లేదంటే RTC సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని కార్మికులు హెచ్చరిస్తున్నారు.
Mark Shankar: పవన్ కుమారుడికి గాయాలు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్, రోజా..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!