RSS: ముస్లిం, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఆర్ఎస్ఎస్ యత్నం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Chief Mohan Bhagwat Meets Muslim Leaders: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గురువారం ఢిల్లీలో పర్యటనలో ఉన్నారు. హర్యానా భవన్లో ముస్లిం మత పెద్దలతో సంఘ్ చీఫ్ సమావేశం నిర్వహించారు. సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అధిపతి ఉమర్ అహ్మద్ ఇలియాసి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంఘ్ చీఫ్ ముస్లిం నాయకులను కలవడం ఇదే మొదటిసారి కాదు. గత మూడు సంవత్సరాలుగా, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లింలు, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నారని
చెబుతున్నారు.
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
2022 సంవత్సరంలో సర్ సంఘ్చాలక్ మొదటిసారిగా ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్లో నిర్మించిన మసీదును సందర్శించారు. భగవత్ ఉత్తర ఢిల్లీలోని ఆజాద్పూర్లోని మదర్సా తజ్వీదుల్ ఖురాన్ను కూడా సందర్శించారు. మోహన్ భగవత్తో పాటు సంఘ్ కార్యకర్తలు కృష్ణ గోపాల్, ఇంద్రేష్ కుమార్ కూడా ఉన్నారు. ఆ సమయంలో మోహన్ భగవత్ ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాసితో సైతం సమావేశం అయ్యారు. అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ చొరవను దేశవ్యాప్తంగా స్వాగతించారు. అయితే, నిపుణులు ఈ సందర్శనను ప్రతీకాత్మకంగా అభివర్ణించారు. సంఘ్ తీసుకున్న నిర్ణయం క్షేత్ర స్థాయిలోనూ కనిపించాలని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాదు.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇంద్రేష్ కుమార్ న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించి, మందిర ప్రాంగణంలో మట్టి దీపాలను వెలిగించారు.
READ MORE: Peddapuram: పెద్దాపురంలో చీకటి బాగోతం.. మహిళ ఆవేదన వింటే చలించిపోతారంతే..!
ఇది పక్కన పెడితే.. కొంతకాలంగా సంఘ్ ముస్లింలు, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ముస్లింలతో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశం ఆర్ఎస్ఎస్ యొక్క ఔట్రీచ్ కార్యక్రమంలో భాగం. వేర్పాటువాదులు, ఛాందసవాదులతో పోరాడటం దీని లక్ష్యం. ఈ అంశంపై సర్ సంఘ్చాలక్ మాట్లాడుతూ.. “మనందరికీ పూర్వీకులు ఒక్కరే. కానీ..మనం గతాన్ని మరచిపోయాం. అందుకే మనల్ని మనం భిన్నంగా భావిస్తున్నాం. మన మధ్య కొన్ని వివాదాలు ఉండవచ్చు కానీ మన సాన్నిహిత్యాన్ని మాత్రం కొనసాగించాలి. భారతదేశ విభజన వంటి సంఘటన చాలా బాధాకరం. దీని వల్ల ఒకరిపై మరొకరికి అపనమ్మకం ఏర్పడింది. దీని కారణంగా, అసంబద్ధమైన చర్చలు జరుగుతున్నాయి. మనం ఇవన్నీ పక్కన పెట్టి ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగాలి.” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Love Affair: నవ వధువు పెళ్లైన మూడు నెలలకే.. భర్తకు మత్తు మందు ఇచ్చి.. ప్రియుడితో కలిసి..
సంఘ్(ఆర్ఎస్ఎస్) మార్చి 2023 నుంచి ముస్లిం ఔట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద, ముస్లింలను బీజేపీతో అనుసంధానించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతను పార్టీ మైనారిటీ ఫ్రంట్కు అప్పగించారు. మొదటి దశలో 14 రాష్ట్రాలు ఎంపిక చేశారు. వీటిలో 64 జిల్లాల్లో ఈ ప్రచారం నిర్వహించారు. ఈ రాష్ట్రాల్లో జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, గోవా, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, లడఖ్, మహారాష్ట్ర, కేరళ, బీహార్ ఉన్నాయి. మరోవైపు.. ఆర్ఎస్ఎస్కి చెందిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఈ అంశంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది ఢిల్లీ రాజ్ఘాట్లోని ఈద్ మిలన్ సమరోహ్లో ఫోరమ్ ద్వారా ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ పోషకుడు ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టం లక్ష్యాలు, ప్రయోజనాలను ప్రతి వ్యక్తికి తెలియజేయడానికి దేశవ్యాప్తంగా 100 కి పైగా ప్రెస్ కాన్ఫరెన్స్లు, 500 కి పైగా సెమినార్లను నిర్వహిస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!