Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rss Chief Mohan Bhagwat Meets Muslim Leaders In Delhi As Part Of Ongoing Outreach Efforts

RSS: ముస్లిం, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ యత్నం..!

Published Date :July 24, 2025 , 6:04 pm
By RAMAKRISHNA KENCHE
RSS: ముస్లిం, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ యత్నం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

RSS Chief Mohan Bhagwat Meets Muslim Leaders: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గురువారం ఢిల్లీలో పర్యటనలో ఉన్నారు. హర్యానా భవన్‌లో ముస్లిం మత పెద్దలతో సంఘ్ చీఫ్ సమావేశం నిర్వహించారు. సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు, ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అధిపతి ఉమర్ అహ్మద్ ఇలియాసి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంఘ్ చీఫ్ ముస్లిం నాయకులను కలవడం ఇదే మొదటిసారి కాదు. గత మూడు సంవత్సరాలుగా, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లింలు, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నారని
చెబుతున్నారు.

READ MORE: Jio: డేటా ఎక్కువగా యూజ్ చేస్తారా? మీ కోసమే ఈ ప్లాన్.. నెలకు రూ. 276 మాత్రమే.. డైలీ 2.5జీబీ, అన్ లిమిటెడ్ కాల్స్

2022 సంవత్సరంలో సర్ సంఘ్‌చాలక్ మొదటిసారిగా ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్‌లో నిర్మించిన మసీదును సందర్శించారు. భగవత్ ఉత్తర ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌లోని మదర్సా తజ్వీదుల్ ఖురాన్‌ను కూడా సందర్శించారు. మోహన్ భగవత్‌తో పాటు సంఘ్ కార్యకర్తలు కృష్ణ గోపాల్, ఇంద్రేష్ కుమార్ కూడా ఉన్నారు. ఆ సమయంలో మోహన్ భగవత్ ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాసితో సైతం సమావేశం అయ్యారు. అప్పటి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ చొరవను దేశవ్యాప్తంగా స్వాగతించారు. అయితే, నిపుణులు ఈ సందర్శనను ప్రతీకాత్మకంగా అభివర్ణించారు. సంఘ్ తీసుకున్న నిర్ణయం క్షేత్ర స్థాయిలోనూ కనిపించాలని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాదు.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇంద్రేష్ కుమార్ న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించి, మందిర ప్రాంగణంలో మట్టి దీపాలను వెలిగించారు.

READ MORE: Peddapuram: పెద్దాపురంలో చీకటి బాగోతం.. మహిళ ఆవేదన వింటే చలించిపోతారంతే..!

ఇది పక్కన పెడితే.. కొంతకాలంగా సంఘ్ ముస్లింలు, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ముస్లింలతో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశం ఆర్ఎస్ఎస్ యొక్క ఔట్రీచ్ కార్యక్రమంలో భాగం. వేర్పాటువాదులు, ఛాందసవాదులతో పోరాడటం దీని లక్ష్యం. ఈ అంశంపై సర్ సంఘ్‌చాలక్ మాట్లాడుతూ.. “మనందరికీ పూర్వీకులు ఒక్కరే. కానీ..మనం గతాన్ని మరచిపోయాం. అందుకే మనల్ని మనం భిన్నంగా భావిస్తున్నాం. మన మధ్య కొన్ని వివాదాలు ఉండవచ్చు కానీ మన సాన్నిహిత్యాన్ని మాత్రం కొనసాగించాలి. భారతదేశ విభజన వంటి సంఘటన చాలా బాధాకరం. దీని వల్ల ఒకరిపై మరొకరికి అపనమ్మకం ఏర్పడింది. దీని కారణంగా, అసంబద్ధమైన చర్చలు జరుగుతున్నాయి. మనం ఇవన్నీ పక్కన పెట్టి ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగాలి.” అని ఆయన పేర్కొన్నారు.

READ MORE: Love Affair: నవ వధువు పెళ్లైన మూడు నెలలకే.. భర్తకు మత్తు మందు ఇచ్చి.. ప్రియుడితో కలిసి..

సంఘ్(ఆర్ఎస్ఎస్) మార్చి 2023 నుంచి ముస్లిం ఔట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద, ముస్లింలను బీజేపీతో అనుసంధానించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతను పార్టీ మైనారిటీ ఫ్రంట్‌కు అప్పగించారు. మొదటి దశలో 14 రాష్ట్రాలు ఎంపిక చేశారు. వీటిలో 64 జిల్లాల్లో ఈ ప్రచారం నిర్వహించారు. ఈ రాష్ట్రాల్లో జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, గోవా, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, లడఖ్, మహారాష్ట్ర, కేరళ, బీహార్ ఉన్నాయి. మరోవైపు.. ఆర్ఎస్ఎస్‌కి చెందిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఈ అంశంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది ఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని ఈద్ మిలన్ సమరోహ్‌లో ఫోరమ్ ద్వారా ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ పోషకుడు ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టం లక్ష్యాలు, ప్రయోజనాలను ప్రతి వ్యక్తికి తెలియజేయడానికి దేశవ్యాప్తంగా 100 కి పైగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, 500 కి పైగా సెమినార్‌లను నిర్వహిస్తామని వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bharatiya outreach efforts
  • Hindu-Muslim Unity
  • India communal harmony
  • Indian religious harmony
  • KGF Delhi mosque visit

తాజావార్తలు

  • Heatwave Warning: మే నెల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఎల్ నినోపై ఐఎండీ వార్నింగ్

  • Gautam Gambhir: డారిల్ మిచెల్‌కు అర్ష్‌దీప్‌ సారీ చెప్పనక్కర్లేదు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్ డామినేషన్.. అభిషేక్, ఇషాన్ కిషన్ అరాచకం!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • AyeshaKhan : వేడి వేడి అందాలతో సెగలు రేపుతున్న అయేషా ఖాన్..

ట్రెండింగ్‌

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions