RSS: ముస్లిం, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఆర్ఎస్ఎస్ యత్నం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Chief Mohan Bhagwat Meets Muslim Leaders: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గురువారం ఢిల్లీలో పర్యటనలో ఉన్నారు. హర్యానా భవన్లో ముస్లిం మత పెద్దలతో సంఘ్ చీఫ్ సమావేశం నిర్వహించారు. సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అధిపతి ఉమర్ అహ్మద్ ఇలియాసి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంఘ్ చీఫ్ ముస్లిం నాయకులను కలవడం ఇదే మొదటిసారి కాదు. గత మూడు సంవత్సరాలుగా, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లింలు, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నారని
చెబుతున్నారు.
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
2022 సంవత్సరంలో సర్ సంఘ్చాలక్ మొదటిసారిగా ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్లో నిర్మించిన మసీదును సందర్శించారు. భగవత్ ఉత్తర ఢిల్లీలోని ఆజాద్పూర్లోని మదర్సా తజ్వీదుల్ ఖురాన్ను కూడా సందర్శించారు. మోహన్ భగవత్తో పాటు సంఘ్ కార్యకర్తలు కృష్ణ గోపాల్, ఇంద్రేష్ కుమార్ కూడా ఉన్నారు. ఆ సమయంలో మోహన్ భగవత్ ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాసితో సైతం సమావేశం అయ్యారు. అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ చొరవను దేశవ్యాప్తంగా స్వాగతించారు. అయితే, నిపుణులు ఈ సందర్శనను ప్రతీకాత్మకంగా అభివర్ణించారు. సంఘ్ తీసుకున్న నిర్ణయం క్షేత్ర స్థాయిలోనూ కనిపించాలని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాదు.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇంద్రేష్ కుమార్ న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించి, మందిర ప్రాంగణంలో మట్టి దీపాలను వెలిగించారు.
READ MORE: Peddapuram: పెద్దాపురంలో చీకటి బాగోతం.. మహిళ ఆవేదన వింటే చలించిపోతారంతే..!
ఇది పక్కన పెడితే.. కొంతకాలంగా సంఘ్ ముస్లింలు, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ముస్లింలతో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశం ఆర్ఎస్ఎస్ యొక్క ఔట్రీచ్ కార్యక్రమంలో భాగం. వేర్పాటువాదులు, ఛాందసవాదులతో పోరాడటం దీని లక్ష్యం. ఈ అంశంపై సర్ సంఘ్చాలక్ మాట్లాడుతూ.. “మనందరికీ పూర్వీకులు ఒక్కరే. కానీ..మనం గతాన్ని మరచిపోయాం. అందుకే మనల్ని మనం భిన్నంగా భావిస్తున్నాం. మన మధ్య కొన్ని వివాదాలు ఉండవచ్చు కానీ మన సాన్నిహిత్యాన్ని మాత్రం కొనసాగించాలి. భారతదేశ విభజన వంటి సంఘటన చాలా బాధాకరం. దీని వల్ల ఒకరిపై మరొకరికి అపనమ్మకం ఏర్పడింది. దీని కారణంగా, అసంబద్ధమైన చర్చలు జరుగుతున్నాయి. మనం ఇవన్నీ పక్కన పెట్టి ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగాలి.” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Love Affair: నవ వధువు పెళ్లైన మూడు నెలలకే.. భర్తకు మత్తు మందు ఇచ్చి.. ప్రియుడితో కలిసి..
సంఘ్(ఆర్ఎస్ఎస్) మార్చి 2023 నుంచి ముస్లిం ఔట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద, ముస్లింలను బీజేపీతో అనుసంధానించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతను పార్టీ మైనారిటీ ఫ్రంట్కు అప్పగించారు. మొదటి దశలో 14 రాష్ట్రాలు ఎంపిక చేశారు. వీటిలో 64 జిల్లాల్లో ఈ ప్రచారం నిర్వహించారు. ఈ రాష్ట్రాల్లో జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, గోవా, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, లడఖ్, మహారాష్ట్ర, కేరళ, బీహార్ ఉన్నాయి. మరోవైపు.. ఆర్ఎస్ఎస్కి చెందిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఈ అంశంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది ఢిల్లీ రాజ్ఘాట్లోని ఈద్ మిలన్ సమరోహ్లో ఫోరమ్ ద్వారా ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ పోషకుడు ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టం లక్ష్యాలు, ప్రయోజనాలను ప్రతి వ్యక్తికి తెలియజేయడానికి దేశవ్యాప్తంగా 100 కి పైగా ప్రెస్ కాన్ఫరెన్స్లు, 500 కి పైగా సెమినార్లను నిర్వహిస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!