Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Rs 4000 Crore Have Been Prepared For Vizag Steel Plant If Central Government Gives Permission The Problem Will Be Solve

KA Paul : వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రూ. 4 వేల కోట్లు ఇస్తా..

Published Date :May 19, 2023 , 5:54 pm
By NTV WebDesk
KA Paul : వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రూ. 4 వేల కోట్లు ఇస్తా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్ల రూపాయలు రెడీ చేసా.. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే.. సమస్య తీర్చేస్తా అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు రెడీ చేసి వచ్చాను.. కేంద్రం అనుమతి ఇస్తే.. సమస్య తొలగినట్టేనని పాల్ తెలిపారు. త్వరలో కేంద్రం నుంచి అనుమతి వస్తుంది.. కుటుంబ కుల రాజకీయాలకు వ్యతిరేకంగా పని చేద్దాం రండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. కాపు, బీసీ ఎస్సీలు అందరూ కలిసి రండి..నేను తెలుగు వాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవటానికి కలిసి పనిచేద్దాం రావాలంటూ కేఏ పాల్ అన్నాడు.

Also Read : Junmoni Rabha: మలుపులు తిరుగున్న “లేడీ సింగం” మృతి కేసు.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు..

జేడి లక్ష్మి నారాయణను ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించానని కేఏ పాల్ తెలిపారు. గద్దర్ లాంటి ప్రజా నాయకులే ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఏపీ-తెలంగాణ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను అంటూ పాల్ చెప్పుకొచ్చాడు. నా ప్రజాశాంతి పార్టీ నుంచి అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని తెలిపారు. ఇదే సందర్బంగా కేఏ పాల్ మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై తన మార్క్ తో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు విశాఖ రావడం అనవసరమన్నారు.
పవన్ పార్టీ అభ్యర్థులకు బుద్ది వచ్చిందా? అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.

Also Read : CM Jagan: సీఎం జగన్ మానవీయ స్పందన.. వాలంటీర్‌కు ఆర్థిక చేయూత

జనసైనికులు లోకేష్ జెండా మోయకండి.. వంగవీటి రంగా ఆత్మ గోషిస్తుంది అంటూ కేఏ పాల్ సూచించారు. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తుల వల్లే బీసీలు ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. చంద్రబాబు విశాఖ రావడం అనవసరం..ఆయన సింగపూర్ లో సెటిల్ అయితే మంచిది అంటూ కేఏ పాల్ సలహాలిచ్చారు. కాగా కొన్ని రోజుల క్రితం పాల్ మాట్లాడుతు..స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ కాకుండా ఉండటానికి తాను ప్రాణ త్యాగం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నానంటూ కామెంట్స్ చేశాడు. 4వేల కోట్లు తెచ్చి స్టీల్ ప్లాంట్ కోసం నెల రోజుల్లో డొనేషన్ ఇస్తానని స్టీల్ ప్లాంట్ అప్పుల్లో ఉంటే ఆ అప్పులన్నీ తీర్చేస్తానని ఆయన వ్యాఖ్యనించారు. నేను 5లక్షల కోట్లను తెచ్చా మీరు ఎందుకు స్టీల్ ప్లాంట్ కోసం ఇవ్వలేకపొతున్నారు? అని ప్రశ్నించారు. నా ఫండ్స్ రాకుండా ప్రభుత్వాలు నిలిపివేస్తున్నాయని పాల్ ఆరోపించారు. ఈక్రమంలో గతంలో తాను చేసిన వాగ్ధానానికి కట్టుబడి ఉండి రూ.4వేల కోట్లు రెడీ చేసానంటూ తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పుకొచ్చాడు.

Also Read : Bandi Sanjay : ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ

ప్రధాని మోడీ దగ్గర స్టీల్ ప్లాంట్ పోరాటకమిటీ నేతలు 27 మందిని కూర్చోపెడదామనుకున్నాను అని కేఏ పాల్ అన్నారు. ఏం జరిగిందో తెలీదు వారు రాలేకపోయారు..ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది.. మరోసారి ప్రయత్నించి వారితో మోడీని కలిసే ఏర్పాటు చేస్తాను అంటూ కేఏ పాల్ వెల్లడించారు. బీజేపీ అవినీతి చేస్తోంటే ఏపీలో పార్టీల నేతలు ప్రశ్నించలేకపోతున్నారు.. మరోసారి జగన్ సీఎం అయితే ఏంటి లాభం..నేను కాపు కులంలో పుట్టాను..దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను..కాపు సత్తా చూపించాలి అన్నారు. వాలంటీర్లకు నెలకు ఇచ్చే 5 వేల రూజీతంతో తిండి ఎలా దొరుకుంది.. వాలంటీర్లతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను గెలిపిస్తే తొలిదశలో లక్ష మంది వాలంటీర్లను పర్మినెంట్ ను చేస్తాను అని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ నెలకు లక్ష కోట్ల అప్పు చేస్తున్నారు అంటూ కేఏ పాల్ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • central government
  • JD Lakshmi Narayana
  • KA Paul
  • rs 4000 crore
  • vizag steel plant

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions