Rs. 25 Crores in Garbage Dump: చెత్త ఏరుకోవడానికి వెళ్తే రూ.25 కోట్లు దొరికాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs. 25 Crores in Garbage Dump: చెత్త ఏరుకొని జీవనం సాగించేవారు ఎందరో ఉన్నారు.. కొన్నిసార్లు వాళ్లకు చెత్తలో విలువైన వస్తువులు దొరికిన సందర్భాలు ఉంటాయి.. చిల్లర, పదోపాతికో దొరికిన ఘటనలు లేకపోలేదు.. కానీ, ఒకేసారి కోట్లలో సొమ్ము దొరికితే.. షాక్ అవ్వడం తప్ప ఇంకా ఏం ఉంటుంది.. అలాంటి ఘటనే ఇప్పుడు బెంగళూరులో వెలుగు చూసింది.. అయితే అది ఇండియన్ కరెన్సీ కాదు.. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడంతో.. చివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగింది..
Read Also: Mumbai Road Accident: బాంద్రాలో కారు బీభత్సం.. ముగ్గురు మృతి!
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
సాధారణంగా కరెన్సీ దొరికితేనే కాస్త ఆశ్చర్యపోతాం.. ఒకవేళ అలాంటిది ఏకంగా రూ.25 కోట్లు దొరికితే ఏం చేయాలో కూడా తెలియకుండా షాక్కు గురయ్యే పరిస్థితి.. అది కూడా చెత్త కుప్పలో..! ఇలాంటి ఘటనే బెంగళూరులో ఈ నెల 1వ తేదీన జరిగింది.. అయితే అది ఇండియన్ కరెన్సీ కాదు.. అమెరికా డాలర్లు. బెంగళూరు శివారులో సల్మాన్ షేక్ అనే వ్యక్తి రోజులాగే చెత్త ఏరుతుండగా 23 కట్టల అమెరికన్ డాలర్లు దొరికాయి. షాక్తిన్న అతడు.. తన మూటలో డాలర్ల కట్టలను వేసుకొని ఇంటికి వెళ్లిపోయాడు.. ఏం చేయాలో అర్థంకాక.. మూడు నాలుగు రోజుల పాటు ఆలోచించాడు.. చివరకు 5వ తేదీన ఆ కరెన్సీని తన యజమాని బప్పాకు అందజేశాడు.. ఆ తర్వాత ఈ వ్యవహారం స్థానిక సామాజిక కార్యకర్త కలీముల్లా వరకు వెళ్లింది.. ఇక, బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానందకు ఈ విషయాన్ని చేరవేశారు.. అనంతరం కేసు దర్యాప్తు చేయాల్సిందిగా హెబ్బాళ్ పోలీసులను ఆదేశించారు సీపీ.. అయితే, దొరికిన ఆ డాలర్ల విలువ రూ.25 కోట్లు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. ఆ కరెన్సీ కట్టలపై కొన్ని రకాల రసాయనాలు పూసినట్లు కూడా గుర్తించారు. నల్లడాలర్ కుంభకోణానికి పాల్పడిన ముఠా ఈ కరెన్సీ నోట్లను అక్కడే వదిలేసి వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు.. అవి అసలు డాలర్లా లేక నకిలీవా? అనే అనుమానాలు కూడా కలగడంతో.. ఆ విషయాన్ని తేల్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఇక, ఈ వ్యవహారంలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!