Madhyapradesh: పేద మహిళలకు ప్రతి నెలా రూ.1,000.. శివరాజ్ చౌహాన్ కొత్త పథకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh: రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ కొత్త పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని పేద మహిళలకు ప్రతి నెలా రూ.1000లను తమ ప్రభుత్వం అందజేస్తుందని ప్రకటించారు. ఐదేళ్లలో ఈ పథకం కోసం రూ.60,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు శివరాజ్ చౌహాన్ శనివారం సాయంత్రం నర్మదాపురం నగరంలోని నర్మదా నది ఒడ్డున జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ పథకం కింద పేదరికంలో ఉన్న సోదరీమణులు నెలకు వెయ్యి రూపాయలను పొందుతారని.. వారు ఇతర పథకాల ప్రయోజనాలను పొందుతున్నా కూడా దీనికి అర్హులేనని ఆయన ప్రకటించారు. ఐదేళ్లలో ఈ పథకం కోసం 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబడతాయని అంచనా వేశారు. లాడ్లీ బహనా యోజన రాష్ట్రంలోని సోదరీమణుల జీవితాలను మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇంట్లో మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుందని, కుటుంబం బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుందన్నారు.
Also Read
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
S Jaishankar: 1962లోనే ఆక్రమించారు.. రాహుల్పై విరుచుకుపడిన కేంద్ర మంత్రి
రాష్ట్రంలో దాదాపు కోటి మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు శివరాజ్ చౌహాన్ ఐదు లక్షల లేఖలు పంపారు. ఈ లేఖల్లో ఆయన ప్రభుత్వ మహిళా సంక్షేమ పథకాలన్నింటి గురించి ప్రస్తావించారు. ఈ లేఖల ద్వారా, రాష్ట్రాన్ని సురక్షితంగా, సుసంపన్నంగా మార్చడానికి తనను గెలిపించాలని ఆయన కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం 3.75శాతం పెరిగింది. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటు వేసిన 50 స్థానాలు ఉండటంతో ఈ సంఖ్య గమనార్హం. అనేక నియోజకవర్గాలలో, మహిళా ఓటర్ల శాతం పెరుగుదల 10 నుంచి 12శాతం మధ్య ఉంది. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం వద్ద మహాకాల్ లోక్ తరహాలో నర్మదా కారిడార్, నర్మదా లోక్ను నిర్మించాలని ముఖ్యమంత్రి చౌహాన్ కూడా ప్రణాళికలు ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!