Madhyapradesh: పేద మహిళలకు ప్రతి నెలా రూ.1,000.. శివరాజ్ చౌహాన్ కొత్త పథకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh: రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ కొత్త పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని పేద మహిళలకు ప్రతి నెలా రూ.1000లను తమ ప్రభుత్వం అందజేస్తుందని ప్రకటించారు. ఐదేళ్లలో ఈ పథకం కోసం రూ.60,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు శివరాజ్ చౌహాన్ శనివారం సాయంత్రం నర్మదాపురం నగరంలోని నర్మదా నది ఒడ్డున జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ పథకం కింద పేదరికంలో ఉన్న సోదరీమణులు నెలకు వెయ్యి రూపాయలను పొందుతారని.. వారు ఇతర పథకాల ప్రయోజనాలను పొందుతున్నా కూడా దీనికి అర్హులేనని ఆయన ప్రకటించారు. ఐదేళ్లలో ఈ పథకం కోసం 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబడతాయని అంచనా వేశారు. లాడ్లీ బహనా యోజన రాష్ట్రంలోని సోదరీమణుల జీవితాలను మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇంట్లో మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుందని, కుటుంబం బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుందన్నారు.
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
S Jaishankar: 1962లోనే ఆక్రమించారు.. రాహుల్పై విరుచుకుపడిన కేంద్ర మంత్రి
రాష్ట్రంలో దాదాపు కోటి మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు శివరాజ్ చౌహాన్ ఐదు లక్షల లేఖలు పంపారు. ఈ లేఖల్లో ఆయన ప్రభుత్వ మహిళా సంక్షేమ పథకాలన్నింటి గురించి ప్రస్తావించారు. ఈ లేఖల ద్వారా, రాష్ట్రాన్ని సురక్షితంగా, సుసంపన్నంగా మార్చడానికి తనను గెలిపించాలని ఆయన కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం 3.75శాతం పెరిగింది. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటు వేసిన 50 స్థానాలు ఉండటంతో ఈ సంఖ్య గమనార్హం. అనేక నియోజకవర్గాలలో, మహిళా ఓటర్ల శాతం పెరుగుదల 10 నుంచి 12శాతం మధ్య ఉంది. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం వద్ద మహాకాల్ లోక్ తరహాలో నర్మదా కారిడార్, నర్మదా లోక్ను నిర్మించాలని ముఖ్యమంత్రి చౌహాన్ కూడా ప్రణాళికలు ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!