Madhyapradesh: పేద మహిళలకు ప్రతి నెలా రూ.1,000.. శివరాజ్ చౌహాన్ కొత్త పథకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh: రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ కొత్త పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని పేద మహిళలకు ప్రతి నెలా రూ.1000లను తమ ప్రభుత్వం అందజేస్తుందని ప్రకటించారు. ఐదేళ్లలో ఈ పథకం కోసం రూ.60,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు శివరాజ్ చౌహాన్ శనివారం సాయంత్రం నర్మదాపురం నగరంలోని నర్మదా నది ఒడ్డున జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ పథకం కింద పేదరికంలో ఉన్న సోదరీమణులు నెలకు వెయ్యి రూపాయలను పొందుతారని.. వారు ఇతర పథకాల ప్రయోజనాలను పొందుతున్నా కూడా దీనికి అర్హులేనని ఆయన ప్రకటించారు. ఐదేళ్లలో ఈ పథకం కోసం 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబడతాయని అంచనా వేశారు. లాడ్లీ బహనా యోజన రాష్ట్రంలోని సోదరీమణుల జీవితాలను మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇంట్లో మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుందని, కుటుంబం బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుందన్నారు.
Also Read
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
- Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
S Jaishankar: 1962లోనే ఆక్రమించారు.. రాహుల్పై విరుచుకుపడిన కేంద్ర మంత్రి
రాష్ట్రంలో దాదాపు కోటి మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు శివరాజ్ చౌహాన్ ఐదు లక్షల లేఖలు పంపారు. ఈ లేఖల్లో ఆయన ప్రభుత్వ మహిళా సంక్షేమ పథకాలన్నింటి గురించి ప్రస్తావించారు. ఈ లేఖల ద్వారా, రాష్ట్రాన్ని సురక్షితంగా, సుసంపన్నంగా మార్చడానికి తనను గెలిపించాలని ఆయన కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం 3.75శాతం పెరిగింది. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటు వేసిన 50 స్థానాలు ఉండటంతో ఈ సంఖ్య గమనార్హం. అనేక నియోజకవర్గాలలో, మహిళా ఓటర్ల శాతం పెరుగుదల 10 నుంచి 12శాతం మధ్య ఉంది. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం వద్ద మహాకాల్ లోక్ తరహాలో నర్మదా కారిడార్, నర్మదా లోక్ను నిర్మించాలని ముఖ్యమంత్రి చౌహాన్ కూడా ప్రణాళికలు ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..