Madhyapradesh: పేద మహిళలకు ప్రతి నెలా రూ.1,000.. శివరాజ్ చౌహాన్ కొత్త పథకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh: రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ కొత్త పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని పేద మహిళలకు ప్రతి నెలా రూ.1000లను తమ ప్రభుత్వం అందజేస్తుందని ప్రకటించారు. ఐదేళ్లలో ఈ పథకం కోసం రూ.60,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు శివరాజ్ చౌహాన్ శనివారం సాయంత్రం నర్మదాపురం నగరంలోని నర్మదా నది ఒడ్డున జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ పథకం కింద పేదరికంలో ఉన్న సోదరీమణులు నెలకు వెయ్యి రూపాయలను పొందుతారని.. వారు ఇతర పథకాల ప్రయోజనాలను పొందుతున్నా కూడా దీనికి అర్హులేనని ఆయన ప్రకటించారు. ఐదేళ్లలో ఈ పథకం కోసం 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబడతాయని అంచనా వేశారు. లాడ్లీ బహనా యోజన రాష్ట్రంలోని సోదరీమణుల జీవితాలను మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇంట్లో మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుందని, కుటుంబం బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుందన్నారు.
Also Read
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
- Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
S Jaishankar: 1962లోనే ఆక్రమించారు.. రాహుల్పై విరుచుకుపడిన కేంద్ర మంత్రి
రాష్ట్రంలో దాదాపు కోటి మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు శివరాజ్ చౌహాన్ ఐదు లక్షల లేఖలు పంపారు. ఈ లేఖల్లో ఆయన ప్రభుత్వ మహిళా సంక్షేమ పథకాలన్నింటి గురించి ప్రస్తావించారు. ఈ లేఖల ద్వారా, రాష్ట్రాన్ని సురక్షితంగా, సుసంపన్నంగా మార్చడానికి తనను గెలిపించాలని ఆయన కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం 3.75శాతం పెరిగింది. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటు వేసిన 50 స్థానాలు ఉండటంతో ఈ సంఖ్య గమనార్హం. అనేక నియోజకవర్గాలలో, మహిళా ఓటర్ల శాతం పెరుగుదల 10 నుంచి 12శాతం మధ్య ఉంది. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం వద్ద మహాకాల్ లోక్ తరహాలో నర్మదా కారిడార్, నర్మదా లోక్ను నిర్మించాలని ముఖ్యమంత్రి చౌహాన్ కూడా ప్రణాళికలు ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!