Madhyapradesh: పేద మహిళలకు ప్రతి నెలా రూ.1,000.. శివరాజ్ చౌహాన్ కొత్త పథకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh: రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ కొత్త పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని పేద మహిళలకు ప్రతి నెలా రూ.1000లను తమ ప్రభుత్వం అందజేస్తుందని ప్రకటించారు. ఐదేళ్లలో ఈ పథకం కోసం రూ.60,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు శివరాజ్ చౌహాన్ శనివారం సాయంత్రం నర్మదాపురం నగరంలోని నర్మదా నది ఒడ్డున జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ పథకం కింద పేదరికంలో ఉన్న సోదరీమణులు నెలకు వెయ్యి రూపాయలను పొందుతారని.. వారు ఇతర పథకాల ప్రయోజనాలను పొందుతున్నా కూడా దీనికి అర్హులేనని ఆయన ప్రకటించారు. ఐదేళ్లలో ఈ పథకం కోసం 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబడతాయని అంచనా వేశారు. లాడ్లీ బహనా యోజన రాష్ట్రంలోని సోదరీమణుల జీవితాలను మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇంట్లో మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుందని, కుటుంబం బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుందన్నారు.
Also Read
- Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
S Jaishankar: 1962లోనే ఆక్రమించారు.. రాహుల్పై విరుచుకుపడిన కేంద్ర మంత్రి
రాష్ట్రంలో దాదాపు కోటి మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు శివరాజ్ చౌహాన్ ఐదు లక్షల లేఖలు పంపారు. ఈ లేఖల్లో ఆయన ప్రభుత్వ మహిళా సంక్షేమ పథకాలన్నింటి గురించి ప్రస్తావించారు. ఈ లేఖల ద్వారా, రాష్ట్రాన్ని సురక్షితంగా, సుసంపన్నంగా మార్చడానికి తనను గెలిపించాలని ఆయన కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం 3.75శాతం పెరిగింది. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటు వేసిన 50 స్థానాలు ఉండటంతో ఈ సంఖ్య గమనార్హం. అనేక నియోజకవర్గాలలో, మహిళా ఓటర్ల శాతం పెరుగుదల 10 నుంచి 12శాతం మధ్య ఉంది. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం వద్ద మహాకాల్ లోక్ తరహాలో నర్మదా కారిడార్, నర్మదా లోక్ను నిర్మించాలని ముఖ్యమంత్రి చౌహాన్ కూడా ప్రణాళికలు ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?